పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు 

AP Govt Has Appointed Joint Collectors Specifically For Poor Houses - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించింది. వీరు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఫేజ్‌ల్లో రూ. 50,944 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ జేసీలకు హౌసింగ్, ఎనర్జీ, రూరల్‌ వాటర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఏపీ ఫైబర్‌ నెట్, గ్రామ, వార్డు శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. మొదటి దశ జూన్‌ 2022, రెండో దశ జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.

చదవండి: Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు  
Andhra Pradesh: రైతుకు ఫుల్‌ ‘పవర్‌’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top