Andhra Pradesh Government Good News For CPS Employees - Sakshi
Sakshi News home page

AP: సీపీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Published Wed, Aug 16 2023 6:47 PM

Ap Govt Good News For Cps Employees - Sakshi

సాక్షి, విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వం అమలు చేసే గ్యారంటీ పెన్షన్ స్కీం లో మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. రిటైర్‌మెంట్‌ నాటి బేసిక్‌ పేలో 50 శాతం గ్యారంటీ పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యోగి వార్షిక చెల్లింపుల్లో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయాలని నిర్ణయించింది. జీపీఎస్‌ ఉద్యోగుల జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్‌, యాన్యుటిలో లోటు ఉంటే ప్రభుత్వమే భర్తీ చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం, అప్పటి ధరల ఆధారంగా బేసిక్‌ పే నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: AP: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మరో శుభవార్త

Advertisement
Advertisement