
31 వరకు చెల్లించేవారికి మాత్రమే వర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.