ఏపీలో పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు ఇవే.. | Sakshi
Sakshi News home page

ఏపీలో పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు ఇవే..

Published Tue, Apr 2 2024 5:37 PM

AP Government Pension Distribution On April 3 To 6 Guidelines Here - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌3 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది. 

పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు

  • సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ.
  • దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్‌.
  • మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ.
  • ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్న సచివాలయాలు.
  • ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది.

Advertisement
Advertisement