అమరావతి: ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్లో హెరిటేజ్ కొత్త యూనిట్ను నిర్మించిన భీమా ఇన్ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం.
హైదరాబాద్లో కొత్త హెరిటేజ్ యూనిట్ను భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్ హెరిటేజ్, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్ యూనిట్ పూర్తి చేసినట్లు భీమా ఇన్ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమా ఇన్ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది.


