AP: 14న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

Andhra Pradesh Cabinet meeting on 14th March - Sakshi

సాక్షి, అమరావతి : ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్‌ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top