పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు | Above 2234 crore for the Polavaram project special account | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు

Dec 12 2020 3:43 AM | Updated on Dec 12 2020 3:43 AM

Above 2234 crore for the Polavaram project special account - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234.28 కోట్లు జమయ్యాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్లూడీఏ) శుక్రవారం ఆ మొత్తాన్ని జమ చేసింది. గత శుక్రవారం ఈ మొత్తాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)కు నాబార్డు విడుదల చేసిన విషయం తెలిసిందే.  దీంతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేస్తూ ఈ నిధులను ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.17,665.29 కోట్లు ఖర్చు చేసింది.

ఇందులో ఏప్రిల్‌ 1, 2014 తర్వాత రూ.12,529.42 కోట్లను ఖర్చు చేసింది. అందులో ఇప్పటివరకూ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్స్‌ చేసింది. తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసిన రూ.2,234.28 కోట్లను కలుపుకుంటే.. రూ.10,741.54 కోట్లను రీయింబర్స్‌ చేసింది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.1787.88 కోట్లు బకాయి పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement