AP: జాక్‌పాట్‌ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప | 600 Kgs Fish Caught In Fishermen Net At Anakapalle District | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప.. ధర ఎంతో తెలుసా? 

Feb 28 2023 7:32 AM | Updated on Feb 28 2023 9:49 AM

600 Kgs Fish Caught In Fishermen Net At Anakapalle District - Sakshi

ఎస్‌.రాయవరం (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ముక్కుడు టేకుగా పిలిచే ఈ చేప సుమారు 600 కిలోల బరువు ఉంది. దీని విలువ సుమారు రూ.2 లక్షలపైనే. సముద్రంలో వలకు చిక్కిన ఈ చేపను మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు లాక్కొచ్చారు.

 

అంత ఖరీదైన చేపను స్థానికంగా కొనే నాథుడు లేక కాకినాడ, విశాఖపట్నంలోని చేపల వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఈ రేవులో ఇంత పెద్ద చేప మొదటిసారిగా దొరికిందని, అనుకున్న ధర రాకపోతే చేపను సముద్రంలో విడిచిపెడతామని మత్స్యకారులు చెప్పారు. ప్రస్తుతం శారద, వరాహ నదుల కలయిక మొగలో నీటిలో వల తాడుతో  బంధించి ఉంచారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement