
విశాఖ: నగరంలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. గాజువాక శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు.
అదే రోజు కె. కోటపాడు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు. ఆపై అదృశ్యమయ్యారు. కె. కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కె. కోటపాడు పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ మాత్రం దొరకలేదు.