ఆరిలోవ: విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులోని ఈ మర్రి చెట్టు సందర్శకులను ఆకర్షిస్తోంది. దీని వయసు 150 ఏళ్లకు పైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జూ పార్కు ఏర్పాటు చేసినప్పటికే ఇది పెద్ద వృక్షం. జూ పార్కు నిర్మించి సుమారు 50 ఏళ్లు గడిచాయి.
ఈ చెట్టు చుట్టూ అధికారులు కనుజుల ఎన్క్లోజరు నిర్మించారు. దీంతో కనుజులు ఈ చెట్టు నీడలోనే ఎక్కువ సమయం సేదదీరుతున్నాయి.


