● ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు
గుత్తి: లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి లారీ ఢీ కొనడంతో ఓమ్నీ వ్యాన్లో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ బసవరాజ్ను అదుపులోకి తీసుకుని సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ విచారణ చేశారు. ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.


