డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు

Dec 28 2025 7:39 AM | Updated on Dec 28 2025 7:39 AM

డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు

డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం పొడిగింపు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న నెట్టెం వెంకటేశులు పదవీకాలం శనివారంతో ముగిసింది. ఇపుడు మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తరులు ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీ కాలాన్ని కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో

దంపతులకు తీవ్రగాయాలు

45 నిమిషాలైనా రాని 108 వాహనం

శింగనమల: శివపురం వద్ద ఎన్‌హెచ్‌544–డీపై జరిగిన ప్రమాదంలో తాడిపత్రికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మీదేవి బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లికి వెళ్లి, తిరిగి తాడిపత్రికి బైక్‌పై బయలుదేరారు. శివపురం వద్దకు రాగానే బైక్‌ డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కోసం ఫోన్‌ చేసి 45 నిమిషాలు వేచి చూసినా రాకపోవడంతో రోడ్డు పనులు చేస్తున్న అంబులెన్స్‌లో అస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement