జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Dec 25 2025 8:11 AM | Updated on Dec 25 2025 8:11 AM

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం

నదిలో స్నానానికి

వెళ్లి మృత్యు ఒడికి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట తీవ్ర విషాదం

శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఘటన

గార్లదిన్నె: అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లి తిరుగుపయనంలో నదీ స్నానానికి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నీటమునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో అతని స్వగ్రామం గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.కొత్తపల్లికి చెందిన మల్లికార్జున, సరళ దంపతుల కుమారుడు నందకుమార్‌ (27) పుణేలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి శబరిమలకు వెళ్లి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. మంగళవారం తిరుగు ప్రయనమయ్యాడు. శబరిమల నుంచి 50 కిలో మీటర్లు దూరం దాటాక నది కనిపించడంతో అక్కడ స్నేహితులతో కలిసి నందకుమార్‌ స్నానానికి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి పైకిరాలేకపోయాడు. తోటి స్నేహితులు విఫలయత్నం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి గజ ఈతగాళ్లతో నదిలో వెతికించి నందకుమార్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. బుధవారం నందకుమార్‌ మృతదేహాన్ని స్వగ్రామం ఎం.కొత్తపల్లికి తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement