బీటెక్‌ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ ఫలితాల విడుదల

Apr 29 2025 7:03 AM | Updated on Apr 29 2025 7:03 AM

బీటెక

బీటెక్‌ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బీటెక్‌ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌ ఫలితాలను ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన 15 రోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్స్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ కే. మాధవి, డాక్టర్‌ డి .లలిత కుమారి కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుడు ఎం. రామశేఖర్‌రెడ్డి, విభాగాధిపతులు టి.నారాయణరెడ్డి, జి.మమత, కళ్యాణ్‌కుమార్‌, అజిత, జరీనా పాల్గొన్నారు.

రూ.65 లక్షల పంట నష్టం

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 8.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండ 49.6 మి.మీ, రాయదుర్గం 38.6 మి.మీ, రాప్తాడు 30 మి.మీ, గుంతకల్లు 24.2 మి.మీ, కూడేరు 22.4 మి.మీ, యాడికి 19.4 మి.మీ, ఆత్మకూరు 18 మి.మీ, గార్లదిన్నె 13.8 మి.మీ మేర నమోదైంది. పామిడి, పెద్దపప్పూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం, శెట్టూరు, గుమ్మఘట్ట, శింగనమల, విడపనకల్లు, గుత్తి, నార్పల, పెద్దవడుగూరు, కణేకల్లు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడా పంట నష్టం జరిగింది. అనంతపురం, తాడిపత్రి, గుమ్మఘట్ట, గుంతకల్లు మండలాల్లో 16 మంది రైతులకు చెందిన 11.70 హెక్టార్లలో అరటి దెబ్బతినడంతో రూ.48.60 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే గార్లదిన్నె మండలంలో 38 మంది రైతులకు చెందిన 25 హెక్టార్లు వరి నేలవాలడంతో రూ.15.50 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

ఏడీసీసీబీ, డీసీఎంఎస్‌లకు నూతన చైర్మన్ల నియామకం

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డిని నియమించారు. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌గా కనగానపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నెట్టెం వెంకటేశును నియమించారు.

అసిస్టెంట్‌ కలెక్టర్‌గా

సచిన్‌ రహర్‌ బాధ్యతలు

అనంతపురం అర్బన్‌: శిక్షణలో భాగంగా 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సచిన్‌ రహర్‌కు అసిస్టెంట్‌ కలెక్టర్‌ హోదా ఇస్తూ ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి పూలమొక్క అందజేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ కలిశారు. రాజస్థాన్‌కు చెందిన సచిన్‌ రహర్‌ యూపీఎస్‌సీలో 291 ర్యాంక్‌ సాధించారు. పిలానిలోని బిర్లా పబ్లిక్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో బీఎస్‌సీ (ఫిజిక్స్‌) చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనిర్సిటీలో ఎంఏ (జియోగ్రఫీ) చేశారు. బికనర్‌లోని మహారాజ గంగా సింగ్‌ యూనివర్సిటీలో ఎంఏ చేశారు.

బీటెక్‌ ఫలితాల విడుదల 1
1/4

బీటెక్‌ ఫలితాల విడుదల

బీటెక్‌ ఫలితాల విడుదల 2
2/4

బీటెక్‌ ఫలితాల విడుదల

బీటెక్‌ ఫలితాల విడుదల 3
3/4

బీటెక్‌ ఫలితాల విడుదల

బీటెక్‌ ఫలితాల విడుదల 4
4/4

బీటెక్‌ ఫలితాల విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement