బిల్లు ఉన్నా తప్పని కేసులు
ప్రధాన రహదారులకే పరిమితమవ్వాల్సిన వసూళ్ల వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామాల్లో గుడులు, బడుల వద్ద కూడా ఏఎంఆర్ సిబ్బంది తిష్ట వేస్తున్నారు. రద్దీగా ఉండే రహదారుల పక్కన టెంట్లు ఏర్పాటు చేసుకుని వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎక్కడ మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నా అక్కడికి సిబ్బంది వాలిపోతున్నారు. సీనరేజీ పేరుతో నగదు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక అనుమతులు, గుర్తింపు, చెక్పోస్టుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకుండానే కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో వివాదాలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండేళ్ల కాలంలో ప్రతి రోజు వివాదాలు జరుగుతున్నాయి. వివాదాలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ పరిష్కారం చేయలేక పోలీసులు మిన్నకుండిపోతున్నారు. రోడ్డుపై బండి ఆపితే కేసులు నమోదు చేసే పోలీసులకు ఈ అనధికారిక శిబిరాలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీనరేజి పేరుతో రెండేళ్లుగా దోపిడీ
గ్రామాల్లోనూ చెక్పోస్టులా...?


