గత ప్రభుత్వాలకు భిన్నంగా..
నేను తిరుపతి నుంచి ఈ సదస్సుకు వచ్చాను. మా స్టార్టప్ కంపెనీ ద్వారా స్కూళ్లకు యూకేలో మాదిరిగా సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నాం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిర్వహించిన ఈ సదస్సులో ఎన్నో విషయాలు తెల్సుకున్నాను. ఈ సదస్సు స్టార్టప్ కంపెనీల నిర్వాహకులకు మంచి ప్లాట్ఫాం. మాలాంటి వారెందరికో ప్రయోజనం చేకూరుతుంది. మునుపటి ప్రభుత్వాల్లా కాకుండా ఈ ప్రభుత్వం సదస్సుల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణలో పెడుతోంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేం ఎంఓయూ కుదుర్చుకున్నాం. – జి.శశిరేఖ, ఎడ్వెంచర్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి


