చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు
కొయ్యూరు: మాదకద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారమవుతుందని చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. కాకరపాడు గురుకుల జూనియర్ బాలుర కళాశాలలో కేరీర్ గైడెన్స్పై సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ ద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ర్యాగింగ్కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంప ఎస్ఐ ఎస్.శ్రీనివాస్, ప్రిన్సి పాల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు
పోలీసుస్టేషన్ల తనిఖీ
కొయ్యూరు, మంప స్టేషన్లను డీఎస్పీ తిరుపతిరావు తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, సి బ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తెలిపారు.


