సరిహద్దుల్లోని ప్రసిద్ధ డుడుమ జలపాతం సుమారు 558 అడుగుల ఎత్తు నుంచి మంచు తెరల మధ్యలో జాలువారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది.
● ముంచంగిపుట్టు మండలంలోని జడిగూడ, తారాబు (పిట్టలబొర్ర), హంసబంద, బురదగుంట, నెమలి, రంగినిగూడ జలపాతాలు పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి.
● పెదబయలు మండలం గిన్నెలకోట–జామిగుడ పంచాయతీల మధ్య ఉన్న పిట్టలబొర్ర జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి పడుతూ పాలపుంతను తలపిస్తోంది. మరోవైపు డుంబ్రిగుడలోని చాపరాయి జలపాతం, అంజోడ సిల్క్ ఫారం, అరకు ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది.
● జలపాతాల అందాలను చూసి ఆనందిస్తున్న పర్యాటకులు, అక్కడి మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● తారాబు, జడిగూడ వంటి జలపాతాలకు వెళ్లే మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పిట్టలబొర్ర జలపాతానికి చేరుకోవాలంటే జామిగుడ నుంచి మూడు కిలోమీటర్ల మేర కొండకోనల్లో కాలినడకన సాహసోపేత ప్రయాణం చేయాల్సి వస్తోంది. స్థానికులు వేసిన రాళ్ల దారులు ప్రమాదకరంగా మారాయి.
● పర్యాటక ప్రాంతాల వద్ద కనీసం తాగునీరు, ఆహారం దొరకడం లేదు. రాత్రి బస చేసేందుకు కాటేజీలు లేకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు.
● ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో రవాణా, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి లభించడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పర్యాటకులు వాపోతున్నారు.
పాల నురగ మాదిరిగా కనువిందు చేస్తున్న తారబు జలపాతం


