నష్ట పరిహారం ఇవ్వడం లేదు...
సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలి. లేబర్ కార్డు తీసుకునే సమయంలో ప్రభుత్వం రూ.60 కట్టించుకుని రశీదు ఇస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా మహిళలే పనులు చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. సంక్షేమ బోర్డుకు నిధులిచ్చి కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి.
–మారేడుపూడి సత్యనారాయణ, మేస్త్రి, మూలపేట గ్రామం


