షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధం
నర్సీపట్నం: ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ ప్రాంతంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధమైంది. పట్టణంలోని అయ్యన్నకాలనీకి చెందిన జి.నానాజీ తన స్కూటీపై కాంప్లెక్స్కు వస్తున్నాడు. ఇక్కడ ఇన్గేట్ నుంచి వస్తుండగా స్కూటీ నుంచి మంటలు వ్యాపించాయి. అతడు భయంతో దాన్ని పార్కు చేసి పరుగులు తీశాడు. ప్రయాణికులు, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


