
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
పాడేరు : పాండిచ్చేరిలో వచ్చేనెల 11 నుంచి 13 వరకు జరగనున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్స్క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆకాంక్షించారు. జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు వంతాల సింహాచలం, పాతుకోట రాజశేఖర్, తలార్సింగి సీఏహెచ్ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థులు గల్లెల రామ్చరణ్, బుల్లేరి చంద్రశేఖర్ బుదవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని జేసీ అభినంధించారు.