
రీ సర్వే వివరాలను వెంటనే అప్లోడ్ చేయండి
రంపచోడవరం: ఏజెన్సీ ఏడు మండలాల్లో భూహక్కు, భూ చట్టం ద్వారా రీ సర్వేకు సంబంధించిన వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో శుక్రవారం తహసీల్దార్లు, సర్వేయర్లతో రీ సర్వే ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేసిన భూముల వివరాలను వీఆర్వోల లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కు అప్లోడ్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక ఇంట్లో యజమానుల పేర్లతో ఉన్న భూములు వారసులకు మ్యుటేషన్ చేయాలని తెలిపారు. ఆర్డీడీ కేజీయా కుమారి మాట్లాడుతూ ఏజెన్సీలో 133 గ్రామాల్లో రీ సర్వే చేసినట్టు చెప్పారు. ఇంకా 268 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. 133 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసిన వాటికి గెజిట్ నోటిఫికేషన్ కోసం ఈ వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు