సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి

Dec 30 2025 7:22 AM | Updated on Dec 30 2025 7:22 AM

సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి

సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి

చింతపల్లిలో ప్రచారం చేస్తున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్‌

చింతపల్లి: విశాఖనగరంలో ఈనెల 31 నుంచి జనవరి 4వరకూ జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్‌ కోరారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చింతపల్లిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశం నలుమూలలు నుంచి కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖ సినీ నటులు, రచయితలు, కళాకారులు హాజరుకానున్నారన్నారు. ఇప్పటికే మహాసభలు ప్రాంగణంలో శ్రామిక ఉత్సవ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెంకటగిరి, ధనుంజయ్‌, చిరంజీవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement