తోటలో తమిళనాడు వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

తోటలో తమిళనాడు వాసి మృతి

Apr 25 2025 8:04 AM | Updated on Apr 25 2025 8:04 AM

తోటలో

తోటలో తమిళనాడు వాసి మృతి

రోలుగుంట: తమిళనాడు రాష్ట్రం నుంచి కనగరాజ్‌ రమేష్‌(42) వడ్డిప నుంచి అర్ల వెళ్లే అడవి మార్గంలోని ఓ ఊప్లిస్‌ తోటలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి గురువారం వెళ్లి పరిశీలించారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు మేనల్లుడు దయానిధి మండలంలో బొప్పన గ్లోబల్‌ అండ్‌ సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో తనకు కూడా డ్రైవర్‌ జాబ్‌ చూడమని చెప్పి దయానిధి వద్దకు రమేష్‌ వచ్చాడు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి మృతుడికి దయానిధి కొంత డబ్బు ఇచ్చాడని ఎస్‌ఐ తెలిపారు. ఆ డబ్బులతో కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే పూటుగా మద్యం తాగుతూ తిరిగాడని, దీనికి తోడు సరైన ఆహారం అందకపోవడంతో తోటలో చనిపోయినట్టు భావిస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనకాపల్లి నుంచి క్లూస్‌ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.

తోటలో తమిళనాడు వాసి మృతి 1
1/1

తోటలో తమిళనాడు వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement