ఆదిలాబాద్టౌన్: అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్ చౌక్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యూనుస్ అక్బాని, ప్రకాశ్, మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, అశోక్ స్వామి, రాజు, రమేశ్, నారాయణ, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు.


