కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని ఆచరించాలన్నదే బాబా ప్రధాన సందేశం. చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని సూచించేవారు. ఆయన బోధనలు ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. దాదాపు 40 ఏళ్లుగా బాబా సేవలో ఉన్నాం. గ్రామంలో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాబా బోధనలు ఆచరిస్తున్నాం.
– మురళీధర్, భక్తుడు, బేల
ఆధ్యాత్మిక కేంద్రంగా పట్నాపూర్
కొన్నేళ్ల నుంచి పట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. నేడు నిర్వహించే జయంతికి అధికారికంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. తాగునీరు, అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించాం.
– ఇంగ్డె కేశవ్, సిద్దేశ్వర్ సంస్థాన్ చైర్మన్


