దిశ బిల్లును తీసుకొచ్చిన నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 18 మహిళా పోలీస్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. అందులో తొలి స్టేషన్ను 2020 ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలోనే స్వయంగా తానే ప్రారంభించారు. దిశ యాప్ను వేల మంది విద్యార్థినుల సమక్షంలో నన్నయ యూనివర్సిటీలో ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని మహిళలు, చిన్నారులకు రక్షణగా నిలుస్తూ.. ఆకతాయిలు, నేరగాళ్లకు వణుకు పుట్టించేది. అటువంటి స్టేషన్ను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయ దురుద్దేశంతో మహిళా పోలీస్ స్టేషన్గా మార్చేసి నీరుగార్చేసింది.


