పోలీస్‌ గ్రీవెన్స్‌కు 34 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 34 ఫిర్యాదులు

Jul 6 2026 11:57 PM | Updated on Jul 6 2026 11:57 PM

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజా ఫిర్యాదుల విషయంలో జాప్యం చేయకుండా చట్టపరిధిలో వెంటనే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 34 ఫిర్యాదులు స్వీ కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధి కా రులతో ఫోన్‌లో మాట్లాడి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అ ధికారి జైస్వాల్‌ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement