
‘నీతి ఆయోగ్’లో నార్నూర్ ముందంజ
నార్నూర్: నీతి ఆయోగ్ ‘ఆకాంక్ష’ బ్లాక్లో నార్నూర్ మండలం ఎంపికై అభివృద్ధి సాధిస్తుందని, మొదటి 30 బ్లాక్లల్లో మొదటి స్థానంలో ఉందని ఆకాంక్ష డైరెక్టర్ మనోజ్సింగ్ బోరా అన్నారు. ఆయన సోమవారం తన బృందంతో కలిసి మండలంలోని జామ్డా, గుంజాల గ్రామాల్లో పర్యటించారు. జామ్డాలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన బృందం సందర్శించింది. విద్యార్థినులు వీక్షిస్తున్న డిజిటల్ తరగతులను బృందం డైరెక్టర్ మనోజ్సింగ్బోరా పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు అనిల్ చహ్వాణ్, కే బాషా, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, పీడీ మిల్కా, సీడీపీవో శారద, సూపరింటెండెంట్ గంగాసింగ్ రాథోడ్, ఎంపీవో సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.