breaking news
World Diabetes Day
-
పిల్లల్ని కనాలంటే ఆ మందులు వాడకూడదా?
దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం.. ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్ను కంట్రోల్లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది. ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందివాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్తో ఏం కాదు వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవువాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. -డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ -
టైప్-1 మధుమేహంపై పిల్లలకు అవగాహన
హైదరాబాద్: అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం, బాలల దినోత్సవం సందర్భంగా జీవీకే హెల్త్ హబ్లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చిన్నతనం నుంచి టైప్-1 మధుమేహం ఉండి, దాన్ని విజయవంతంగా అధిగమిస్తూ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అయిన కొంతమంది.. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలిసి ఇబ్బంది పడుతున్న పిల్లలకు అవగాహన కల్పించారు. నాలుగైదేళ్ల వయసులో టైప్-1 మధుమేహం ఉండి, ఏం తినాలో ఏం తినకూడదో కూడా సరిగా తెలియని పిల్లలకు.. తాము ఇన్నాళ్ల నుంచి ఎలా దాన్ని అధిగమిస్తున్నామన్న విషయాన్ని సమగ్రంగా వివరించారు.అంతకుముందు ఉదయం 6.30 గంటలకు కేబీఆర్ పార్కు నుంచి మొదలుపెట్టి 8.30కి జీవీకే హెల్త్ హబ్ వరకు డయాబెటిస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీకే డయాబెటిస్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.జి. శాస్త్రి మాట్లాడుతూ, ‘‘మధుమేహం వల్ల రక్తనాళాలు ప్రభావితం అవుతున్నాయి. దానివల్ల చిన్నవయసులోనే గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. మన దేశం మధుమేహం విషయంలో ప్రపంచ రాజధానిగా ఉంది. అందువల్ల అందరికీ ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించేందుకే డయాబెటిస్ వాక్ నిర్వహించాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా టైప్-1 మధుమేహానికి ఉచిత చికిత్స అందించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివ, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దీపిక, ఇంకా పెద్ద సంఖ్యలో వైద్యులు, ఆస్పత్రి సీఓఓ జె.సుమన్ రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.కోట్లు కరిగిస్తున్న ‘షుగర్’!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్ జబ్బు వస్తే వైద్య ఖర్చులకే ఆ కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..భారతదేశంలో డయాబెటిస్ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..డయాబెటిస్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్ ఫుడ్, షుగర్-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.సగటు వైద్య ఖర్చులుమధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది. -
చిన్నవయసులోనే మధుమేహం
హైదరాబాద్: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ప్రస్తుతం మన సమాజంలో మధుమేహం తీరుతెన్నులు, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, కన్సల్టెంట్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని వివరించారు. కొన్ని దశాబ్దాల క్రితం కనీసం 40-50 ఏళ్లు దాటినవారే మధుమేహం బారిన పడినట్లు గుర్తించేవారు. ఇప్పుడు ఇంకా బాగా చిన్నవయసులోనే, అంటే 15-20 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులు. తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. వీటన్నింటివల్ల అధిక బరువు, ఊబకాయం, దాంతోపాటే మధుమేహం కూడా వస్తున్నాయి.‘‘సాధారణంగా మధుమేహం అనేది రెండు రకాలు. మొదటిది టైప్-1. అంటే.. శరీరంలో ఏవో తెలియని మార్పుల వల్ల పాంక్రియాస్ ప్రభావితమై, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక మధుమేహం వస్తుంది. వాళ్లకు జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. కానీ రెండోది టైప్-2. ఇది ప్రధానంగా జీవనశైలి మార్పుల వల్ల వచ్చేది. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారానే దాన్ని నియంత్రించుకోవచ్చు. గతంతో పోలిస్తే చాలా చిన్నవయసులోనే ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. మా ఆస్పత్రికి రోజూ ఔట్పేషెంట్ విభాగంలో 20-30 మంది మధుమేహ బాధితులు వస్తుంటే, వారిలో దాదాపు 30% మంది చిన్నవయసువారే ఉంటున్నారు. కొందరికి 20లు, 30లలోను ఇంకా కొందరికి 10-15 ఏళ్ల వయసులో కూడా వస్తోంది. ప్రధానంగా ఇలా చిన్నవయసులో వచ్చేవారిలో ఎక్కువమందికి ఊబకాయం ఉంటోంది. జీవనశైలి మార్పుల వల్ల బరువు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఊబకాయం కనిపిస్తోంది. అలాగే మొత్తమ్మీద మధుమేహం ఉన్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా వాసుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల 30ల నుంచి కూడా ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా మధ్యమధ్యలో మధుమేహం వచ్చిందేమో పరీక్షించుకోవాలి. ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్లు కూడా తరచు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు అయితే దాదాపు ప్రతియేటా పరీక్షలు చేయించుకోవాలి.గతంలో కేవలం గ్లూకోజ్ నియంత్రిస్తే సరిపోతుంది అనుకునేవారు. తర్వాత గత పదేళ్ల నుంచి మధుమేహం ఉన్నవారికి కీలక అవయవాలు అంటే గుండె, కిడ్నీలు, కళ్లు, కాళ్లు.. ఇలా అన్నింటినీ కాపాడాలని గుర్తించారు. అదే ఇప్పుడైతే బరువు విషయాన్ని కూడా చూస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించే మందులతోనే బరువు కూడా తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటోంది’’ అని డాక్టర్ బి.శ్రావ్య తెలిపారు. బరువును అదుపులో పెట్టాలికన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని మాట్లాడుతూ, ‘‘మధుమేహం వచ్చినవారు తప్పనిసరిగా తమ శరీర బరువును వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. 5-10% బరువు తగ్గినా కూడా అది మధుమేహ నియంత్రణకు బాగా ఉపయోగ పడుతుంది. అలాగే నడక లాంటి వ్యాయామాలు ప్రతిరోజూ తప్పక ఉండాలి. దాంతోపాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. వీటన్నింటిద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారానే మనం మధుమేహాన్నిఅదుపుచేయగలం. మధుమేహ పరీక్షలంటే కేవలం ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత చేయించుకునే రెండు రక్తపరీక్షలే కాదు. హెచ్బీఏ1సీ పరీక్ష కూడా చేయించుకోవాలి. దానివల్ల గత కొంతకాలంగా మధుమేహం స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దాన్ని బట్టే కచ్చితమైన డయాగ్నసిస్ ఉండి మందులు ఎలాంటివి వాడాలో సూచించగలం’’ అని చెప్పారు. -
యోగాతో డయాబెటిస్కు చెక్ చెప్పవచ్చా?
World Diabetes Day డయాబెటిస్ నియంత్రణకు యోగా పనికొస్తుందా అంటే కచ్చితంగా పనికొస్తుంది. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, జీవన శైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచు కోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు, అధిక బరువు సమస్యనుంచి కూడా బయట పడవచ్చు. అధిక బరువు, అధిక స్థాయిలో ఉన్న షుగర్ శరీర అవయవాల పని తీరును దెబ్బతీస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని రకాల యోగాసనాల గురించి తెలుసుకుందాం.కొన్ని రకాలు యోగాసనాలు ఒత్తిడిని నిర్వహించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, విశ్రాంతికి, రక్త ప్రసరణను మెరుగు పర్చడానికి దోహదపడతాయి. ఎవరైనా చేయొచ్చా? ఎలా ప్రారంభించాలి?యోగా వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.వారానికి 2-3 సెషన్లతో ప్రారంభించవచ్చు. అవాటైన కొద్దీ క్రమంగా, సౌలభ్యతను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.యోగా సాధనకు కావలసిందల్లా యోగా మ్యాట్ ,సౌకర్యవంతమైన దుస్తులు. అదనపు సపోర్ట్ కోసం బ్లాక్స్, పట్టీలు , బోల్స్టర్ వంటివి ఉంచుకోవచ్చు. ఇవి ఆప్షనల్.యోగా జీవక్రియను పెంచడం, కండరాల స్థాయిని మెరుగుపరచడం ,ఒత్తిడికి సంబంధించిన ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. షుగర్ - ముఖ్య యోగాసనాలు కాళ్ళు పైకి వంగి భంగిమ (విపరిత కరణి): హఠ యోగాలో ఒక భంగిమ విశ్రాంతినిస్తుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ (పశ్చిమోత్తనాసన): ఈ భంగిమ ఆందోళనను, అలసటను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ధనురాసన: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కోబ్రా భంగిమ (భుజంగాసన): కండరాలను బలపరుస్తుంది. ఇన్సులిన్ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.సుపైన్ స్పైనల్ ట్విస్ట్ (సుప్త మత్స్యేంద్రసన): ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది. (రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)ఒంటె భంగిమ (ఉస్ట్రాసనం): పక్కటెముకలకు చక్కటి బలాన్నిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండెకు, శరీరానికి శక్తినిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.పర్వత భంగిమ (తడాసనం): భంగిమను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ యోగాసనాలన్నీ బరువు నియంత్రణలోనూ, మంచి నిద్రకు కూడా బాగా ఉపయోగపడతాయి. నోట్ : వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అనేక యోగాసనాలను యోగా నిపుణుల ద్వారా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ భంగిమలు మందులు, ఆహారం , సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గమనించాలి. ఒక వేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.ఇదీ చదవండి: జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది! -
జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది!
World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటి చేయడం వలన షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం జిమ్ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నడక, స్ట్రెచింగ్, స్క్వాట్లు లేదా వాల్ పుష్-అప్లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వ్యాయామం చేసినప్పుడు, కండరాల్లోని మైటోకాండ్రియా పవర్హౌస్లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే అదనపు కొవ్వును కరిగిస్తుంది.రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.తేలికపాటి వ్యాయామాలుచురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.వాల్ పుష్-అప్లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.స్క్వాట్లు అండ్ లంగెస్ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.లైట్ స్ట్రెచింగ్ అండ్ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా చేస్తుందీ వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.సోలియస్ పుష్-అప్లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి కిందికి కదలించేలా చేసే వ్యాయామం.క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి! -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం) -
చిన్న టిప్స్తో 'డయాబిటిస్'ను జయించిన సెలబ్రిటీలు
షుగర్, మధుమేహం, డయాబిటిస్.. ఇలా పేరు ఏదైనా కావచ్చు ఇదో దీర్ఘకాల సమస్య. దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయం కాదు. నియంత్రణలో ఉంచుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం, మానని పుండ్లు, వేళ్లు, పాదాలు, కాళ్లు తీసేయాల్సిన రావటం.. చూపు పోవటం, కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయి. ఆపై మరణం ముప్పూ పెరుగుతుంది. దీంతో ఈ జబ్బు గురించి అందరికీ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుతారు. మధుమేహంతో బాధ పడుతున్న సినీ సెలబ్రిటీలు దానిని ఎలా కంట్రోల్లో ఉంచారో తెలుసుకుందాం.కమల్ హాసన్- మధుమేహంకమల్ హాసన్ టైప్ 1 డయాబెటిస్ యోధుడని చెప్పాలి. తన బాల్యం నుంచి పడుతున్నారు. అతి దాహం, అతి మూత్రం, చిరాకు, అనారోగ్య సమస్యలు..ఈ జబ్బుతో ఎన్ని బాధలో. వాటన్నింటినీ అనుభవిస్తూనే అత్యుత్తమ నటన ఇస్తున్నారు. ఒకసారి తన పరిస్థితి గురించి మాట్లాడుతూ.. డయాబెటిస్ అనేది కేవలం జీవక్రియ రుగ్మత అని తెలిపారు. దానిని జయించవచ్చని తెలిపారు. అందుకోసం క్రమంతప్పకుండా జిమ్లో చేసే వ్యాయామాలు ఉపయోగపడ్డాయన్నారు. మద్యపానాన్ని పూర్తిగా మానేయడం వల్ల మధుమేహంతో పోరాటంలో విజయం సాధించగలిగానని చెప్పారు. డయాబెటిస్ వల్ల తన కెరీర్, లుక్స్ మొత్తం జీవితంపై ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. కమల్ హాసన్ యోగా కూడా చేస్తారు. వ్యాయామంతో పాటు వైద్యల సూచన మేరకు డైట్ ఫాలో కావడంతో డయాబెటిస్ను కంట్రోల్ చేసుకున్నారు.కొన్ని నాలో కూడా కనిపించాయి: సమంత స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ఫిట్గా ఉంటారు. ఎప్పుడూ జిమ్లోనే గడిపేస్తారు. అయితే, ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారిలో సర్వసాధారణంగా కనిపించే కొన్ని సమస్యలు తనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఆమె గమనించారు. అయితే, ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆహారంలో మరిన్ని మార్పులు చేసుకున్నాని పంచకున్నారు. సమంతకు 2022లో మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా ఆమె కఠినమైన డైట్ పాటించి విజయం సాధించారు.13 ఏళ్ల వయసు నుంచే డయాబెటిస్: నిక్ జోనస్బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్కు 13 ఏళ్ల వయసులో డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సింగర్, నటుడిగా ప్రసిద్ధి చెందిన నిక్ జోనస్ తనకున్న షుగర్ వ్యాధి గురించి బహిరంగంగానే చెప్పారు. 13 ఏళ్ల వయసులో టైప్ 1 డయాబెటిస్ నిర్ధరణ అయిన తర్వాత ఎవరో తన కలలపై తలుపులు మూసినట్లు అనిపించిందని ఆయన బాధపడ్డారు. కానీ, పూర్తి వ్యాయామంతో పాటు వైద్యుల సూచించిన డైట్ ఫాలో కావడంతో సులువుగా జయించానన్నారు.టైప్-1 డయాబెటిస్: సోనమ్ కపూర్నేటి ఫ్యాషన్ ఐకాన్లలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఒకరు.. ఆమె కూడా టైప్ 1 డయాబెటిస్ బారిన పడింది. తనకు 17 ఏళ్ళ వయసులో నిర్ధారణ అయింది. టైప్ 1 డయాబెటిస్తో పాటు, సోనమ్కు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ (పిసిఓడి) కూడా ఉంది. దీంతో కెరీర్, ఆరోగ్యం మధ్య సమతుల్యత విషయంలో విజయం సాధించింది. సోనమ్ కపూర్ తన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో డయాబెటిస్ను అధిగమించగలిగింది. ఫిట్గా ఉండటానికి జిమ్కు వెళ్లడం కంటే ఈత కొట్టడం వంటి శారీరక శ్రమలను ఆమె ఇష్టపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆమె తన అభిమానులకు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంది.


