-
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. గురువును మించిన శిష్యుడు
-
ఉద్యోగులకు షాక్..వీఆర్ఎస్పై హీరోమోటోకార్ప్ కీలక ప్రకటన!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్టైమ్ సెటిల్మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్అండ్డీ, హెచ్ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు
సంస్థాన్ నారాయణపురం, చండూరు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్.. నీకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు. పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ని ఉద్దేశించి విమర్శించారు. చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి -
ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారంలో ఆర్టీసీ వేగాన్ని పెంచింది. ఇటీవలే దాదాపు 3100 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. వీఆర్ఎస్ తీసుకుంటే, వచ్చే ఆర్థిక ప్రయోజనాలను స్పష్టం చేస్తూ ఆర్టీసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపులు ఇలా... ►వీఆర్ఎస్ తీసుకున్న రోజు వరకు అర్హత ఉన్న గ్రాట్యుటీ వడ్డీతో కలిపి చెల్లిస్తారు. ►పీఎఫ్కు సంబంధించి ఉద్యోగి వితరణ, యాజమాన్యం వితరణ మొత్తాలను వీఆర్ఎస్ తీసుకునే నాటికి లెక్కించి జత చేసి చెల్లిస్తారు. ►పదేళ్లకు పైగా సర్వీసు ఉన్న వారికి కనిష్టంగా రూ.వేయి చొప్పున పెన్షన్ చెల్లిస్తారు. ►స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం, స్టాఫ్ బెన్వెలెంట్ కమ్ థ్రిఫ్ట్ స్కీం కింద ఉద్యోగి అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందిస్తారు. ►300 ఆర్జిత సెలవులకు రావాల్సిన మొత్తం లేదా వాస్తవంగా ఖాతాలో క్రెడిటైన అసలు ఈఎల్స్ మొత్తం రెంటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ►నోటీసు కాలానికి సంబంధించిన వేతనం చెల్లిస్తారు. వీఆర్ఎస్ తీసుకున్నాక మిగిలిపోయిన సర్వీసు కాలం ఐదేళ్లలోపు ఉంటే వేతనం + చివరిసారి పొందిన కరువు భత్యం ఇంటూ 15/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములాతో చెల్లిస్తారు. ఐదేళ్లకు పైబడి–పదేళ్లలోపు సర్వీసు ఉంటే పే + చివరిసారి పొందిన కరువుభత్యం ఇంటూ 20/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం చెల్లిస్తారు. పదేళ్లకుపైబడి సర్వీసు ఉంటే పే +చివరి డీఏ ఇంటూ 25/26 ఇంటూ పదేళ్ల మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం లెక్కించి చెల్లిస్తారు. ఇక నోషనల్ గ్రాట్యుటీకి సంబంధించి ఐదేళ్ల గరిష్ట మొత్తం లేదా మిగిలిన సర్వీసు కాలానికి లెక్కించిన మొత్తం.. వీటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ఉద్యోగి వాటా నోషనల్ పీఎఫ్కు.. ఐదేళ్ల గరిష్ట సర్వీసు లేదా మిగిలిన సర్వీసు.. ఏది తక్కువో అది లెక్కించి చెల్లిస్తారు. బస్పాస్: సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్వరకు, జిల్లా సర్వీసుల్లో డీలక్స్ కేటగిరీ వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. సూపర్ లగ్జరీ ఆపై కేటగిరీల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించొచ్చు. ఉద్యోగి మరణించాక ఇదే రాయితీ స్పౌజ్కు వర్తిస్తుంది. 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్స్ మొత్తాన్ని వడ్డీతోపాటు చెల్లిస్తారు. -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం: ఐపీఎస్ పదవికి రాజీనామా
RS Praveen Kumar Resignation: సాక్షి, హైదరాబాద్: సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమ వారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసు కోవడంపై పోలీస్ శాఖ, ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా ఉన్న గురుకుల సొసైటీల్లో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణా లతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏడీజీ హోదాలో యూసఫ్గూడ బెటాలియన్లో ఉన్న కొందరు ఆత్మీయులు, ఐపీఎస్ మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికొచ్చారు. తర్వాత కొద్దిసేపటికే తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెలువరించారు. రాష్ట్రవ్యాప్త గుర్తింపు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇదీ ఆయన నేపథ్యం.. పూర్తిపేరు: రేపల్లె శివ ప్రవీణ్కుమార్ పుట్టింది: ఆలంపూర్, 1967 తల్లిదండ్రులు: ప్రేమమ్మ, బీఆర్ సవరన్న విద్యార్హతలు: వెటర్నరీ సైన్స్లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్, హార్వర్డ్, మసాచుసెట్స్ వర్సిటీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ అవార్డులు: పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్) సమీప బంధువులు: మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పోలీసు వెబ్సైట్ సృష్టికర్త హైదరాబాద్లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా పనిచేసిన సమయంలో పోలీస్ శాఖలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో సీసీఎస్లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగానే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్లకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. నగర పోలీస్ వెబ్సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్, ఆన్లైన్ పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఫారినర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తదితరాలకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మధ్య ఎస్ఎంఎస్ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ డిలీట్ దెమ్ కార్యక్రమాలు ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే. హుజూరాబాద్లో పోటీ చేసే ఉద్దేశం లేదు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రవీణ్కుమార్ స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కుందన్బాగ్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా కొంత విశ్రాంతి కావాలని, 26 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులోనే గడిచిపోయాయని, మిగిలిన విషయాలను పట్టించుకోలేదన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణ చేశానని వెల్లడించారు. తాను వెళ్లిపోయినంత మాత్రాన గురుకులాల విద్యా సంస్థలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించారు. స్వేరోస్ తన సృష్టి కాదని, దాన్ని పూర్వ విద్యార్థులు స్థాపించారని, అందులో తాను అనుకోకుండా చేరానని చెప్పారు. స్వేరోస్లో లక్షలాదిమంది ఉన్నారని, దాంట్లో ప్రవీణ్ ఒకడని, తాను ఉన్నా లేకున్నా స్వేరోస్ ముందుకు సాగుతుందదని స్పష్టం చేశారు. pic.twitter.com/AnaEek8baJ — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement