-
India Famous Durga Temples Images: భారతదేశంలోని ప్రసిద్ధ దుర్గా దేవాలయాలు (ఫొటోలు)
-
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. కాగా, ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో వీరబ్రహ్మం, ఎస్పీ రాహుల్, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ నుంచి ఏపీకి 'అంతా క్షేమంగా'.. -
వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారుక్ ఖాన్, వీడియో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Shah visited Vaishno Devi Temple ❤️ May Devi Maa fulfill all his wishes 🙏🏻 #ShahRukhKhan𓀠 pic.twitter.com/1XrL82XaCW — 👸Sharania Jhanvi𓀠🌹BesharamRang (@SharaniaJ) December 12, 2022 -
వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భక్తుల్లో కొందరు టీనేజర్ల మధ్య వాగ్వివాదం ఆరంభమైందని పోలీసు డీజీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఈ గొడవకు కారణం తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందని, గందరగోళం ఎక్కువకావడంతో ఒక్కమారుగా ఇరుకు సందులోకి అనేకమంది దూసుకువచ్చారని తెలిపారు. ఈ గందరగోళంలో ఊపిరాడక పలువురు మరణించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్లోకి రానివ్వలేదు) కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్నా పలువురు భక్తులు నిర్ణీత స్థాయిని మించి ఆలయంలోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ సింగ్ చెప్పారు. ఆలయ బోర్డు ఏర్పాట్లలో లోపమే ఘటనకు కారణమని ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కొందరు ఆరోపించారు. చాలామంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని చెప్పారు. అధిక రద్దీతో తొక్కిసలాట జరగవచ్చని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారని, కానీ ఆలయ బోర్డు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దుర్ఘటన జరిగిందని విమర్శించారు. ఘటన సమయంలో వెనక్కు వెళ్లకుండా చాలామంది నేలపై పడుకున్నారని, దీంతో రద్దీ మరింత పెరిగిందని మరో సాక్షి చెప్పారు. ఇతర సాక్షులు కూడా ఈ విషయాలను ధృవీకరించారు. అయితే ఆలయ బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. 50 వేల మందికి అనుమతి ఉన్నా 35 వేల మందికే అనుమతిచ్చామని తెలిపింది. రెండు గ్రూపుల మధ్య ఆరంభమైన గొడవ అంతిమంగా తొక్కిసలాటకు దారితీసిందని ఆలయ బోర్డు ప్రకటించింది. చదవండి: (వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట) -
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. గర్భాలయానికి వెలుపల గేట్ నెంబర్ 3 వద్ద శనివారం ఉదయం 2.30– 2.45 ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఆరంభమైంది. ఒక్కమారుగా జరిగిన ఈ ఘటనతో భీతావహ వాతావరణం నెలకొందని, ఊపిరి ఆడక పలువురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు యూపీ, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా హరియాణా, కశ్మీర్ నుంచి ఒక్కొక్కరున్నారు. గాయపడినవారికి మాతా వైష్ణోదేవి నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని, వారంలో నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఆదేశించారు. తొక్కిసలాట అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దుర్ఘటన జరిగిన గంటకు తిరిగి దర్శనాలకు అనుమతించారు. అయితే పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించకుండా వెనుదిరిగారు. ప్రముఖుల సంతాపం దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వెలిబుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. మరణించినవారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలయ బోర్డు చెల్లిస్తుంది. మరణించినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి ఈ మొత్తాలందిస్తారు. పర్వదినాల్లో దేవాలయానికి రద్దీ పెరుగుతుందని, నూతన సంవత్సరాదిన యువత రద్దీ పెరగడం తాజా ట్రెండ్గా మారిందని, అందువల్ల ఇకమీదట న్యూఇయర్ రోజున తగిన ఏర్పాట్లు చేయాల్సిఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం తమ వారు మరణించడంతో రోదిస్తున్న కుటుంబసభ్యులు గత దుర్ఘటనలు ► 2003, ఆగస్టు 27: మహారాష్ట్ర నాసిక్లో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 39మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు. ► 2005, జనవరి 25: మహారాష్ట్రలోని మంధర్ దేవీ ఆలయంలో కొబ్బరికాయలు భారీగా కొట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. బురదపై భక్తులు హఠాత్తుగా జారిపడి తొక్కిసలాట ఆరంభమైంది. ఈ ఘటనలో 340 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ► 2008, ఆగస్టు 3: హిమాచల్ప్రదేశ్ నైనా దేవీ మందిరం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయన్న పుకార్లు గందరగోళానికి దారితీసాయి. దీనివల్ల జరిగిన తోపులాటలో 162మంది మరణించగా 47మంది గాయపడ్డారు. ► 2010, మార్చి 4: యూపీలోని కృపాల్ మహరాజ్కు చెందిన రామ్ జానకీ ఆలయం వద్ద ఉచితంగా ఆహారం, దుస్తులు పంచారు. వీటికోసం జరిగిన తొక్కిసలాట 63మందిని బలి తీసుకుంది. ► 2011, నవంబర్ 8: హరిద్వార్లోని హర్ కా పౌరీ ఘాట్లో తొక్కిసలాట 20మంది మృతికి కారణమైంది. ► 2012, నవంబర్ 19: పాట్నా వద్ద ఛాత్పూజ జరిగే అదాలత్ ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలి 20మంది మరణించారు. ► 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్లోని రత్నగిరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నదిపై వంతెన కూలిపోతోందన్న పుకార్లు భారీ తొక్కిసలాటకు కారణమయ్యాయి. దీంతో 115మంది మరణించగా, 100మంది గాయపడ్డారు. ► 2014, అక్టోబర్ 3: పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆరంభమైన తోపులాట 32మం దిని బలికొంది. 26మంది గాయపడ్డారు. ► 2015, జూలై 14: ఏపీలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement