-
బిడ్డల నోటి‘ముద్ద’ సర్కార్ హైజాక్
మధ్యాహ్న భోజనం నిధులు దారి మళ్లింపు నిధులు విడుదల చేసినట్లు రికార్డుల్లో చూపుతున్న ప్రభుత్వం ♦ ట్రెజరీల ద్వారా కొర్రీ వేయిస్తూ బిల్లులు పెండింగ్లో పెట్టిన వైనం ♦ బిల్లులందక ఏజెన్సీలు అప్పుల పాలు.. బకాయిలు రూ.150 కోట్లు ♦ డబ్బుల్లేక విద్యార్థులకు అత్యంత నాసిరకమైన భోజనం ♦ వంట పని వారికి ఐదారు నెలలుగా గౌరవ భృతి కరువు అసలే అరకొర నిధులు.. ఆపై వాటిని విడుదల చేయడంలో సర్కారు అలసత్వం.. అంతులేని నిర్లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కిరాణా కొట్టు వారిని అయ్యా.. బాబూ.. అంటూ బతిమిలాడి ఇన్నాళ్లూ సరుకులు అప్పపై తెచ్చుకున్నాయి. ఇక అప్పుపై ఇవ్వలేమంటూ వారూ చేతులెత్తేయడంతో ఏం వండాలో.. పిల్లలకు ఏం పెట్టాలో తెలీక తలపట్టుకున్నారు. నీళ్ల పప్ప, మగ్గిపోయిన బియ్యంతో వండిన అన్నాన్ని ‘మింగలేక.. కక్కలేక’ విద్యార్థులకు మింగుడు పడటం లేదు. తమ పిల్లలకు ఒక్క పూటైనా భోజనం దొరుకుతుందన్న పేద తల్లిదండ్రుల ఆశ సర్కారు నిర్వాకంతో సన్నగిల్లుతోంది. సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం పేద పిల్లల కడుపు మాడ్చడానికే మొగ్గు చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 47,635 ప్రభుత్వ స్కూళ్లలోని 43,91,645 మంది పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోంది. ప్రభుత్వం తన రికార్డుల్లో మాత్రం నిధులు విడుదల చేస్తున్నట్లు చూపుతూ ట్రెజరీల్లో చెల్లింపులు చేయకుండా నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నెలకు రూ.30 కోట్లకు పైగా ఈ పథకం కింద నిధులు రావాలి. ఈ లెక్కన ఐదు నెలలుగా దాదాపు రూ.150 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. దీంతో క్షేత్ర స్థాయిలో పథకం అమలులో వేలాది ఏజెన్సీలు నానా అవస్థలు పడుతున్నాయి. ఆయా గ్రామాల్లోని దుకాణ వ్యాపారులు దయతలచి అప్పుపై సరుకులు అందిస్తే విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. వ్యాపారులు అప్పులివ్వని చోట ఈ పథకం పడకేసింది. రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇదే పరిస్థితి. బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తుండగా ఇతర సరుకులకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా నిధులను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడం మాట అటుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సైతం విడుదల చేయకుండా దారి మళ్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ప్రతి రోజూ అన్నంతో పాటు కూర, వారానికి మూడు కోడి గుడ్లు, పప్పు, చారుతో మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో డ్వాక్రా గ్రూపు మహిళలు, మరి కొన్ని చోట్ల నాంది ఫౌండేషన్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి ప్రభుత్వం నాణ్యమైన బియ్యం కూడా సరఫరా చేయడం లేదు. పలుచోట్ల అత్యంత నాసిరకమైన మగ్గిన బియ్యాన్ని సరఫరా చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. ► బియ్యం మినహా ఇతర సరుకుల కోసం ఒక్కో జిల్లాకు నెలకు సగటున రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు అవసరం. విద్యార్థుల సంఖ్యను అనుసరించి కృష్ణా జిల్లాలో అత్యధికంగా రూ.4.75 కోట్లు, నెల్లూరులో రూ. 2.25 కోట్లు, తూర్పుగోదా వరిలో రూ.3.10 కోట్లు.. ఇలా ప్రతి జిల్లా లో నెలనెలా నిధులు విడుదల చేయాలి. ► ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఒక రోజుకు రూ.4.86, హైస్కూలు విద్యార్థికైతే రూ.6.78 చొప్పున సరుకుల కోసం ప్రభుత్వం విడుదల చేసేది. దీనిని గత ఏడాదిలో రూ.5.13, రూ.7.18కి పెంచినా నిధులు విడుదల చేయడం లేదు. వంటచేసే వారికి నెలకు ఇవ్వాల్సిన రూ.1000 గౌరవ భృతి కూడా ఐదారు నెలలుగా ఇవ్వలేదు. ► ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు నీళ్ల చారు, ఉడికీ ఉడకని అన్నం దిక్కవుతోంది. గత ఏడాది జూలైలో ప్రభుత్వం 1–8 తరగతి వరకు పిల్లలకు రూ.132.25 కోట్లు, 9, 10 తరగతుల పిల్లలకు రూ.16.49 కోట్లు విడుదల చేసింది. నవంబర్లో 1–8 తరగతుల వారి కోసం రూ.239.98 కోట్లు, హైస్కూల్ పిల్లలకు రూ.70.55 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఆయా ట్రెజరీల ద్వారా నిధులు అందలేదు. కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నుంచి, కొన్ని జిల్లాల్లో అక్టోబర్ నుంచి నిధులు అందడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ► సిలిండర్, స్టవ్ ఉన్నప్పటికీ డబ్బులు లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. పొగ వల్ల ఇలు వంట పని వారు, అటు విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ► కర్నూలు జిల్లాలో వంట పని వారికి గత ఏడాది ఆగస్టు నుంచి గౌరవ భృతి ఇవ్వలేదు. బిల్లులు సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు నిలిపివేశారు. ఈ సర్కారుకు కనికరం లేదు గతేడాది అక్టోబర్ నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇన్నాళ్లు అప్పులిచ్చిన వారు ఇక ఇవ్వమని చెబుతున్నారు. నిత్యావసర సరుకులు, గ్యాస్, కోడిగుడ్ల ధరలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే ఏ విధంగా బతకాలి? ప్రభుత్వం సరుకులకు ఇస్తున్న మొత్తం గిట్టుబాటు కావడం లేదు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 ఇవ్వాలి. స్వల్ప మొత్తానికి వెట్టి చాకిరీ చేస్తున్నా ఈ సర్కారుకు మాపై కనికరం లేదు. –షేక్ జాస్మిన్, ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, గుంటూరు శ్రమ దోపిడీ మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వారి శ్రమ దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వం నిరంకుశ నిర్ణయాలతో వంట నిర్వాహకులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించడం లేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాము. బకాయిలు చెల్లిస్తే ఏజెన్సీల భారం వదులుకుని ఏదో ఒక పని చేసుకుని బతకడానికి కొందరు సిద్ధమయ్యారు. –పంచాది లతాదేవి, మధ్యాహ్న బోజన పధకం వర్కర్స్అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయు నాయకురాలు -
తెలంగాణ ప్రభుత్వానికి 20 కోట్ల విరాళం!
ఒక రోజు మూల వేతనం ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం 22 సంఘాలతో జేఏసీ ఆవిర్భావం హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఒకరోజు మూలవేతనం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. కొత్త ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం హైదరాబాద్లో 22 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ టీచర్స్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. 1.50 లక్షల మంది ఉపాధ్యాయుల మూలవేతనంతో దాదాపు రూ.20 కోట్లకు పైగా అయ్యే ఆ మొత్తాన్ని జూన్ 2న కొత్త ప్రభుత ్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందజేయనున్నట్లు వివరించింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేశారు. టీచర్స్ జేఏసీ చైర్మన్గా పి.వెంకట్రెడ్డి, సెక్రటరీ జనరల్స్గా భుజంగరావు, మణిపాల్రెడ్డి, కన్వీనర్గా సాయిరెడ్డి, కో-చైర్మన్లుగా యాదయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, ధమనేశ్వర్రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా మల్లయ్య, దేశ్పాండే, నారాయణరెడ్డి, బాలపీరు, మల్లికార్జున్రెడ్డి, కోశాధికారిగా వాసుదేవరావులను ఎన్నుకున్నారు. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంటు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని, అది ఇవ్వకపోయినా సంతోషమేనని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. చైర్మన్ పి.వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉపాధ్యాయ సమస్యల జోలికి వెళ్లకుండా, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 10వేల మంది స్థానికేతరులు ఉన్నారని, ఆ లెక్కలు తీసి వారి ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేశారు. -
తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డీఈఓ రమేష్ బదిలీ... మళ్లీ హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలు ఊపందుకున్న ఈ సమయంలోనూ రమేష్ బదిలీ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేయగా... రిలీవ్ చేసేది లేదని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గత నెలలో తేల్చిచెప్పారు. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాలు ఆమెపై తిరుగుబాటు అస్త్రాన్ని సంధించాయి. రమేష్ను బదిలీ చేయకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామంటూ ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్కు అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు గురువారం ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్కు ఒక లేఖ అందజేశారు. రోజుకో మలుపు డీఈఓ రమేష్ను బదిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 12 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు డీఈఓ రాజేశ్వర్రావును నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన్ను రిలీవ్ చేయలేమని, పైగా పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆయన్ను బదిలీ చేయడం కుదరదని కలెక్టర్ తేల్చిచెప్పారు. మార్చి 3 తేదీ వరకు ఆయన ఎన్నికల విధుల్లో ఉంటారని ఆ తర్వాత బదిలీ విషయం పరిశీలిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని కలెక్టర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, ఎన్నికల కమిషన్కు లేఖ కూడ రాశారు. ఇక డీఈఓ బదిలీ దాదాపుగా ఆగిపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ డీఈఓ బదిలీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. డీఈఓను బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సారి ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ లేఖను వారు జిల్లా కలెక్టర్కు అందజేశారు. లేఖలో పేర్కొన్న అంశాలు నెలవారీ పదోన్నతుల ప్రక్రియ సరిగా నిర్వహించలేదనీ, కార్యాలయంలో సిటిజన్ చార్టును కూడా అమలు చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాను ఎప్పటికప్పుడు ప్రకటించకుండా దాచి పెడుతున్నారని వివరించారు. అంతేకాకుండా అక్రమంగా డిప్యుటేషన్లకు డీఈఓ తెరలేపారని, ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంలోనూ అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. అంతేకాకుండా అనుమతి లేని పాఠశాలలు నడుస్తున్నట్లు డీఈఓకు సమాచారం వచ్చినా.. కొన్ని పాఠశాలల విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించారని వారు లేఖలో ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కొన్ని సంఘాలను ప్రోత్సహిస్తున్నారని, ఉమ్మడి పరీక్ష నిర్వహణకు ఖర్చు చేయాల్సిన నిధులు కార్యాలయ ఆధునికీకరణ పనులకు డీఈఓ అక్రమంగా వినియోగించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారు కలెక్టర్కు లేఖ అందజేశారు. అయితే ఆరోపణలు కాకుండా తగిన ఆధారాలు తీసుకొని వస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉపాధ్యాయులకు చెప్పి పంపించినట్లు సమాచారం.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
యాదవులకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్
క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించిన కలెక్టర్
ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి
రియల్టర్ల వద్ద కోట్లు వసూళ్లు...
ఓటమి భయంతో బెంబేలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement