breaking news
UP T20 League
-
రింకూ సింగ్ అట్టర్ ప్లాప్.. అయినా టైటిల్ కొట్టేశాడు
యూపీ టీ20 లీగ్-2026 విజేతగా రింకూ సింగ్ సారధ్యంలోని మీరట్ మేవరిక్స్ నిలిచింది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో లక్నో ఫాల్కన్స్ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన మీరట్.. రెండో యూపీ టీ20 టైటిల్ను ముద్దాడింది. ఈ తుది పోరులో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ దివ్యాన్ష్ జోషి(40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 105) విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్లో 2 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ మూడు, భువనేశ్వర్ కుమార్, అజిత్ వర్మ, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విశాల్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు.కేకేఆర్ కెప్టెన్గా రింకూ?ఇక మీరట్ను జట్టును రెండో సారి ఛాంపియన్గా నిలపడంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ దూసుకొచ్చాడు. గత రెండు సీజన్లలో అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అయితే అతడు ఇటీవల ఆల్ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోల్కతా కెప్టెన్సీ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల బట్టి తదుపరి కేకేఆర్ కెప్టెన్గా రింకూ సింగ్నే ఎంపిక చేసే అవకాశముంది. అతడు ఈ యూపీ టీ20 లీగ్లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు -
మరోసారి చెలరేగిన భువీ.. టీమిండియా సెలెక్టర్లకు సవాల్
టీమిండియాకు దూరమైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. యూపీ టీ20 లీగ్ 2026లో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న మీరట్ మావెరిక్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో అబ్బురపడే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. అతడకి కార్తీక్ త్యాగి (4-0-38-2), విశాల్ చౌదరి (4-0-23-1) సహకరించారు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో హిమాన్షు సింగ్ (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ చేశాడు. అతడికి అభినందన్ సింగ్ (4-0-28-2), కృష్ణ్ కుమార్ సరోజ్ (4-0-20-1), విప్రాజ్ నిగమ్ (4-0-15-1) కూడా తోడవడంతో రింకూ సింగ్ నేతృత్వంలోని మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఫాల్కన్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. మావెరిక్స్ తరఫున రింకూ సింగ్ (34), జీషన్ అన్సారీ (30 నాటౌట్) పోరాటం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.కాగా, యూపీ టీ20 లీగ్ ప్రస్తుత సీజన్లో భువీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. పలు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి, తన జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5.88 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఐపీఎల్ 2026లోనూ భువీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ తరఫున 16 ఇన్నింగ్స్ల్లో 28 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు 2025 సీజన్లోనూ 17 వికెట్లతో సత్తా చాటి ఆర్సీబీకి తొలి టైటిల్ గెలిపించాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున గత రెండు సీజన్లలో ఏకంగా 45 వికెట్లు సాధించాడు.ఈ అద్భుత ప్రదర్శనల తర్వాత భువీ తిరిగి టీమిండియా వైపు చూస్తున్నాడు. 2022 నవంబర్లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. దాదాపు నాలుగేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో వరుసగా మెరుగైన ప్రదర్శనలు చేస్తూ పునరాగమనానికి తలుపులు తడుతున్నాడు. తాజా యూపీ టీ20 ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.చదవండి: సిరాజ్తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు! -
భువీ విజృంభణ
యూపీ టీ20 లీగ్ 2026లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభిస్తున్నాడు. ఈ టోర్నీలో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కాశీ రుద్రాస్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతడి జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపు లక్నో ఫాల్కన్స్కు వరుసగా మూడవది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు గానూ భువీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఈ మ్యాచ్లో లక్నో ఫాల్కన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భువీ కొత్త బంతితో చెలరేగిపోయాడు. పవర్ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి కాశీ రుద్రాస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువీతో పాటు అభినందన్ సింగ్ (3-16) కూడా సత్తా చాటడంతో రుద్రాస్ 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రుద్రాస్ తరఫున శుభమ్ చౌబే (32 బంతుల్లో 46 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు.అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. హిమాన్షు సింగ్ (64) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 16 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.కాగా, యూపీ టీ20 లీగ్లో భువనేశ్వర్ కుమార్ తన అసమాన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో అదిరిపోయే స్పెల్స్తో సత్తా చాటుతున్న అతడు.. టోర్నీ చరిత్రలోనే (నాలుగు సీజన్లు) 400 డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్గా అవతరించాడు. ఈ టోర్నీ 2024 ఎడిషన్లో భువీ వేసిన స్పెల్ (4-1-4-0) టీ20ల చరిత్రలోనే అత్యుత్తమమైన స్పెల్స్లో ఒకటిగా చలామణి అవుతుంది.ప్రస్తుతం భువీకి భారత జట్టులో చోటు లేనప్పటికీ.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్సీబీ వరుసగా రెండు సీజన్లలో టైటిల్ సాధించడంలో భువీది కీలకపాత్ర. -
రింకూ సింగ్ విధ్వంసం.. కేవలం 7 బంతుల్లోనే! వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా గోరఖ్పూర్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో మీరట్ ఘన విజయం సాధించింది. మీరట్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం.కాగా ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్పూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. గోరఖ్పూర్ బ్యాటర్లలో అభయ్ ప్రతాప్ సింగ్(33) టాప్ స్కోరర్గా నిలిచారు. మీరట్ బౌలర్లలో జీషన్ అన్సారీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఈ లక్ష్యాన్ని మీరట్ మావెరిక్స్ వికెట్ కోల్పోకుండా 6.4 ఓవర్లలో ఊదిపడేసింది. అయితే లక్ష్య చేధనలో మీరట్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అక్షయ్ దూబే(9) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ రింకూ సింగ్ మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్చపరిచాడు.అక్షయ్ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకూ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకనా మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం ఏడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 2 ఫోర్లు, మూడు సిక్స్లతో 29 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. అతడి స్ట్రైక్ రేట్ 414.29గా ఉండడం గమనార్హం. రింకూతో పాటు యువ ఆటగాడు స్వస్తిక్ చికారా(24 బంతుల్లో 44) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్That Rinku Singh special. 💥1️⃣ 6️⃣ 4️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ 2️⃣ 🔥 pic.twitter.com/L57yTUFcTV— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 24, 2026 -
పాక్ ఆటగాడిని అనుకరించిన విరాట్ కోహ్లి మాజీ సహచరుడు
విరాట్ కోహ్లి మాజీ సహచరుడు (ఆర్సీబీ) స్వస్తిక్ చికారా పాకిస్తాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ను అనుకరించి వార్తల్లోకెక్కాడు. యూపీ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. కాన్పూర్ సూపర్స్టార్స్తో జరిగిన మ్యాచ్లో ఫర్హాన్ తరహాలో గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 2025 ఆసియా కప్లో ఫర్హాన్ భారత్పై అర్ధశతకం సాధించిన తర్వాత ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్పట్లో ఈ అంశం తీవ్ర వివాదానికి దారితీసిందిIndian Shahibzada Farhan 😭🔥Swastik Chikara played a match-winning knock of 97* off just 46 balls in the UPT20.After finishing the match, he did the 𝗴𝘂𝗻 𝗰𝗲𝗹𝗲𝗯𝗿𝗮𝘁𝗶𝗼𝗻. 🔥 pic.twitter.com/ICkty9rYkg— Jara (@JARA_Memer) August 23, 2026తాజాగా చికారా ఫర్హాన్ గన్ సెలబ్రేషన్స్ రిపీట్ చేయడం చర్చనీయాంశమైంది. చికారా చర్యపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ మ్యాచ్లో చికారా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. కేవలం 46 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన పరుగులను సిక్సర్తో పూర్తి చేసిన అనంతరం చికారా ప్రేక్షకుల వైపు చూస్తూ తుపాకీ కాల్చినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కాగా, చికారా, ఫర్హాన్కు ముందు కూడా ఇలాంటి గన్ సెలబ్రేషన్స్ ఓ సారి తారసపడ్డాయి. 2005లో శ్రీలంకపై 183 పరుగులు చేసిన అనంతరం టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని కూడా బ్యాట్ను తపాకీలా పట్టుకొని గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.భీకర ఫామ్లో చికారాచికారా ప్రస్తుతం యూపీ టీ20 లీగ్ 2026లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో 48.25 సగటుతో 193 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతడు ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఆకట్టుకుంటున్నాడు.అయితే అతడి ప్రధాన సమస్య నిలకడ. ఐదు ఇన్నింగ్స్ల్లో రెండు సార్లు 50కి పైగా స్కోర్లు చేసినప్పటికీ, మరో మూడు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 2025 యూపీ టీ20 సీజన్లోనూ చికారా 13 ఇన్నింగ్స్ల్లో 370 పరుగులు చేసి మూడు అర్ధశతకాలు సాధించాడు.ఐపీఎల్ పునరాగమనమే లక్ష్యం2025లో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అనంతరం ఆర్సీబీ అతడిని విడుదల చేసింది.2026 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ చికారాపై ఆసక్తి చూపలేదు. యూపీ టీ20 లీగ్ ప్రదర్శనలు అతడి ఐపీఎల్ అవకాశాలను పెంచవచ్చు.2027 ఐపీఎల్కు ఓపెనర్ల కోసం చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు చికారాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. -
ఫినిషర్ రింకూ సింగ్ ఈజ్ బ్యాక్
టీమిండియా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ ఛేజింగ్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. యూపీ టీ20 లీగ్ 2026లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. లక్నో ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.🚀Rocket Rinku for a reason. 🔥pic.twitter.com/Ktl4vMBkk8 https://t.co/ChVvyki6Ym— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 19, 2026183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు కష్టాల్లో (10 ఓవర్లలో 75-4) ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన రింకూ.. కేవలం 24 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.రింకూ విధ్వంసంతో మావెరిక్స్ స్కోర్ 154/6కు చేరుకుంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మావెరిక్స్ను 5 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.2023 జ్ఞాపకాలురింకూ సింగ్ తాజా ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు 2023 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై అడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుకొచ్చింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది 29 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రింకూ, అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.ఫినిషర్గా రింకూ ఎందుకు ప్రత్యేకం..?2023 ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్కు నమ్మకమైన ఫినిషర్ అనే గుర్తింపు వచ్చింది. 2026 ఐపీఎల్లోనూ అతను 59.00 సగటుతో రాణించాడు. అయితే బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు రావడంతో 2023 స్థాయి స్థిరత్వాన్ని మాత్రం కొనసాగించలేకపోయాడు.అయినా ఒత్తిడిలో ఛేజింగ్ను ముగించే సామర్థ్యంలో రింకూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీ20ల్లో ఛేజింగ్ చేసిన 54 మ్యాచ్ల్లో 34 విజయాల్లో అతను భాగమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 94 టీ20 మ్యాచ్ల్లో అతని సగటు 33.04, స్ట్రైక్రేట్ 139.44. ఈ క్రమంలో ఎనిమిది అర్ధసెంచరీలు సాధించాడు. -
వివాదంలో రింకూ సింగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ తన స్వరాష్ట్రం యూపీలో జరిగే టీ20 లీగ్లో రచ్చ చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్గా వ్యవహరించే రింకూ.. గోరఖ్పూర్ లయన్స్ మ్యాచ్కు ముందు గ్రౌండ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరలవుతోంది.The ground staff member told Rinku and his teammate that the area was reserved for the opposition’s practice bowling, but neither of them listened. Rinku still ran towards the pitch and started bowling while the poor guy kept chasing them. Rinku and his teammate just kept… pic.twitter.com/3MyKIHS0za— ElysiumCricket (@CricketElysium) August 19, 2026అసలేం జరిగిందంటే..?మ్యాచ్కు ముందు మావెరిక్స్ ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో రింకూ సింగ్, అతని సహచర ఆటగాడు ప్రత్యర్థి జట్టు కోసం కేటాయించిన ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది.ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ప్రాక్టీస్ కోసం ఆ ప్రాంతాన్ని కేటాయించడంతో అక్కడికి వెళ్లవద్దని గ్రౌండ్ సిబ్బంది రింకూను, అతని సహచరుడిని కోరాడు. అయితే రింకూ అతని సూచనలను పట్టించుకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లి బౌలింగ్ చేసినట్లు వీడియోలో కనిపించింది.గ్రౌండ్ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లాలని పదేపదే కోరుతున్న సమయంలో రింకూ, అతని సహచరుడు నవ్వుతూ కనిపించడం వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రింకూపై విమర్శలు వస్తున్నాయి. అమాయకంగా కనిపిస్తాడు కానీ, ముదురే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రింకూకు శిక్ష పడుతుందా..?అయితే ఈ ఘటనను క్రికెట్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడం అంత సులభం కాదు. వీడియోలో కనిపిస్తున్నది ప్రత్యర్థి జట్టు కేటాయించిన ప్రాక్టీస్ పిచ్ మాత్రమే. అది మ్యాచ్కు ఉపయోగించే అసలు పిచ్ కాకపోవడంతో, అక్కడ బౌలింగ్ చేసినందుకు నేరుగా శిక్ష విధించే నిబంధన ఉన్నట్లు స్పష్టత లేదు.మ్యాచ్కు ఉపయోగించే ప్రధాన పిచ్ను దెబ్బతీయడం లేదా దాని పరిస్థితిని ప్రభావితం చేసే చర్యలు మాత్రం తీవ్రంగా పరిగణించబడతాయి. కానీ ఈ ఘటనలో రింకూ అసలు మ్యాచ్ పిచ్ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు.క్రీడాస్ఫూర్తికి విరుద్ధంప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రింకూ సింగ్పై నిషేధం లేదా భారీ శిక్ష పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ సిబ్బంది సూచనలను పట్టించుకోకుండా ప్రత్యర్థి జట్టు ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లడం మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. -
ఫైనల్కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కోటి ఆఫర్?
యూపీ టీ20 లీగ్-2025.. ఫైనల్ మ్యాచ్కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలోని లీగ్ స్టేజి మ్యాచ్లను ఫిక్సింగ్ చేయడానికి బుక్కీలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బీసీసీఐ యాంటీ కరప్షన్ విభాగం దృష్టికి వెళ్లింది. అనంతరం లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం.. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్కు ‘vipss_nakrani’ అనే యూజర్ నుంచి ఇన్స్ట్రాగ్రామ్లో ఓ మెసెజ్ వచ్చింది. అందులో తను బుకీని అని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కోటి రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయల కమిషన్ ఇస్తానని రాసి ఉందంట. వెంటనే అర్జున్ ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. ఆతర్వాత ఏసీయూ సభ్యలు బుకీ ఫోన్ నంబర్ పొందడానికి ఇన్స్టాగ్రామ్లో చాట్ను కంటిన్యూ చేశారు. ఆటగాళ్లు తన సూచనలను పాటించాలని, మ్యాచ్ల సమయంలో తన సహచరులతో కలిసి మైదానంలో ఉంటానని కూడా బుకీ వెల్లడించాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్లను మరొక ఫోన్లో రికార్డు చేసి పోలీస్లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని లక్నో డీసీపీ ధ్రువీకరించారు. కాగా యూపీ టీ20 లీగ్ విషయానికి వస్తే.. శనివారం ఫైనల్ పోరులో ఎకానా స్టేడియం వేదికగా కాశీ రుద్ర, మీరట్ మావెరిక్స్ జట్లు తలపడనున్నాయి. -
‘నాకు గంభీర్ సర్ సపోర్టు ఉంది.. దుబాయ్ వెళ్లాక మాట్లాడతా’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు ముందు టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) సూపర్ ఫామ్లో ఉన్నాడు. యూపీ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్ (Meerut Mavericks)కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. ఈ టోర్నీలో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి రింకూ 332 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 179.46.ఇదే జోరును రింకూ కొనసాగిస్తే ఆసియా కప్ భారత తుదిజట్టులోనూ చోటు సంపాదించుకోవడం ఖాయం. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్తో తనకున్న అనుబంధం గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు.దుబాయ్కు వెళ్లాక గంభీర్ సర్తో మాట్లాడతాతనకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకు నేనైతే ఎవరినీ అడుగలేదు. దుబాయ్కు వెళ్లిన తర్వాత గంభీర్ సర్తో సుదీర్ఘంగా సంభాషిస్తా.ఇప్పటి వరకు మేము ఈ విషయం గురించి మాట్లాడుకోనేలేదు’’ అని రింకూ సరదాగా బదులిచ్చాడు. అదే విధంగా.. ‘‘ఆయనను కలవడమే కాదు.. ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటా.నాకు గంభీర్ సర్ మద్దతు ఉందికెరీర్లో నేను ఎదగడానికి ఆయన సహకారం ఎంతగానో ఉంది. జీజీ (గౌతం గంభీర్) సర్ నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు. కేకేఆర్తో ఉన్నపుడు తొలి పరిచయంలోనే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పుల్ షాట్ల గురించి నాకు సలహాలు ఇచ్చారు.ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో ప్రేమగా ఉంటారు. ఆయనకు పరిజ్ఞానం ఎక్కువ. బ్యాటింగ్ మెళకువల గురించి ఎంతో చక్కగా వివరిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో బాగుంటుంది. జీజీ సర్ కోచింగ్లో టీమిండియాకు ఆడటం గొప్పగా అనిపిస్తుంది. అలాంటి లెజెండ్తో డ్రెసింగ్రూమ్ పంచుకోవడం ఓ ప్రత్యేకమైన అనుభూతి’’ అని రింకూ సింగ్ గంభీర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా ఐపీఎల్లో కేకేఆర్కు రింకూ కీలక ప్లేయర్ కాగా.. గతేడాది గంభీర్ ఆ జట్టుకు మెంటార్గా వ్యవహరించాడు. చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
బీభత్సం సృష్టించిన రింకూ సింగ్.. ఇక ఆ జట్లకు మూడినట్లే..!
ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్ 2025లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎన్నో అనుమానాల నడుమ (బ్యాటింగ్ నైపుణ్యంపై) ఈ లీగ్ బరిలోకి దిగిన రింకూ.. తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీసి, తనెంత విలువైన ఆటగాడో మరోసారి జనాలకు రుచి చూపించాడు. ఫినిషర్ అన్న బిరుదుకు రింకూ మరోమారు సార్దకత చేకూర్చాడు.ఈ లీగ్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన రింకూ.. 170కి పైగా స్ట్రయిక్రేట్తో, 59 సగటున సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 295 పరుగులు చేశాడు. ఇందులో 20కి పైగా ఫోర్లు, 20కి పైగా సిక్సర్లు ఉన్నాయంటే రింకూ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది. గోరఖ్పూర్ లయర్స్పై రింకూ చేసిన 45 బంతుల శతకం సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.తాజాగా రింకూ సృష్టించిన బీభత్సకాండ చూసిన తర్వాత ఆసియా కప్లో పాల్గొనే జట్ల బౌలర్లు బెదిరిపోతుంటారు. కాశీ రుద్రాస్తో నిన్న జరిగిన మ్యాచ్లో రింకూ శివాలెత్తిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో అజేయమైన 78 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్లో రింకూ గేర్ మార్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 26 పరుగులకే తన జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా రింకూ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత అతి నిదానంగా ఆడిన రింకూ.. ఆతర్వాత ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. తానెదుర్కొన్న 48 బంతుల్లో తొలి 20 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసిన రింకూ.. ఆతర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 28 బంతుల్లో ఏకంగా 71 పరుగులు రాబట్టాడు. తానెదుర్కొన్న చివరి 11 బంతుల్లో రింకూ 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించాడు.రింకూ సృష్టించిన ఈ బీభత్సకాండ ఐపీఎల్లో యశ్ దయాల్ను చీల్చిచెండాడిన (5 బంతుల్లో 5 సిక్సర్లు) వైనాన్ని గుర్తు చేసింది. తర్వలో ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. రింకూ ప్రత్యర్థులను ఇప్పటినుంచే భయపెడుతున్నాడు. వాస్తవానికి రింకూను ఆసియా కప్కు ఎంపిక చేయకూడదనే చర్చ నడిచింది. ఇటీవలి కాలంలో అతను చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా చేయకపోవడమే ఇందుకు కారణం. రింకూ స్థానంలో ఆల్రౌండర్నో లేక శ్రేయస్ అయ్యర్నో ఎంపిక చేయాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డాడు.అయితే అలాంటి వారి అభిప్రాయాలు తప్పని రింకూ తాజా ప్రదర్శనలతో రుజువు చేశాడు. యూపీ లీగ్లో రింకూ బౌలర్గానూ తనలోని యాంగిల్ను పరిచయం చేశాడు. ఆల్రౌండర్ను తీసుకుంటే బాగుండేదని భావించే వారిని రింకూ ఈ రకంగానూ సమాధాన పరిచాడు.యూపీ లీగ్లో మీరట్ మెవెరిక్స్కు సారధిగానూ వహిస్తున్న రింకూ.. తన జట్టును అదిరిపోయే విజయాలతో ముందుండి నడిపిస్తున్నాడు. కాశీ రుద్రాస్పై విజయం తర్వాత మీరట్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కాశీ రుద్రాస్ మాత్రమే మీరట్ కంటే ముందుంది. -
చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చరపిడుగు
ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వి (21) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కాన్పూర్ సూపర్ స్టార్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. వరుస విధ్వంసాలతో హోరెత్తిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట గోరఖ్పూర్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 93 పరుగులు చేసిన రిజ్వి.. ఇవాళ మీరట్ మెవెరిక్స్పై అజేయమైన మెరుపు అర్ద శతకంతో (48 బంతుల్లో 78) మెరిశాడు.ఈ మ్యాచ్లో రిజ్వి మెరుపు ఇన్నింగ్స్కు లక్ కూడా తోడవ్వడంతో కాన్పూర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాన్పూర్.. మీరట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాన్పూర్ ఇన్నింగ్స్లో రిజ్వి ఒక్కడే రాణించాడు.సహచరులు ఒక్కో పరుగు సాధించేందుకు ఇబ్బంది పడుతుండగా.. రిజ్వి భారీ షాట్లతో చెలరేగాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్లో రిజ్వి ఒక్కడే సగానికి పైగా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మీరట్ను వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు స్కోర్ 41/2 వద్ద (8 ఓవర్ల తర్వాత) ఉండగా భారీ వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా డక్ వర్త్ లూయిస్ పద్దతిన కాన్పూర్ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి మీరట్ గెలుపుకు 14 పరుగుల దూరంలో (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఉండింది. ఆర్సీబీ యువ ఆటగాడు స్వస్తిక్ చికారా (29), మాధవ్ కౌశిక్ (4) క్రీజ్లో ఉన్నారు.కాగా, సమీర్ రిజ్వి గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడు పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్లో ఒత్తిడిలో అజేయమైన అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. యూపీ లీగ్లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి డీసీ మేనేజ్మెంట్ దృష్టిలో పడి ఉంటాడు. ఈ ప్రదర్శనలు అతడికి మరిన్ని ఐపీఎల్ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. -
రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్లతో వీర వీహారం! వీడియో
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్-2025లో మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్.. గురువారం గౌర్ గోరఖ్ పూర్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.168 పరుగుల లక్ష్య చేధనలో ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకూ పత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. లక్నోలని ఎకానా స్టేడియంలో రింకూ బౌండరీల వర్షం కురిపించాడు. ఓటమి ఖాయమైన చోట ఈ లెఫ్ట్ హ్యాండర్ తన తుపాన్ ఇన్నింగ్స్తో అద్భుతం చేశాడు.కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సింగ్.. 7 ఫోర్లు, 8 సిక్స్లతో 108 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో 168 పరుగుల టార్గెట్ను మీరట్ మావెరిక్స్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. గోరఖ్ పూర్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, అనికిత్ చౌదరీ, ఏ రెహమన్, విజయ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోరఖ్ పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గోరఖ్పూర్ కెప్టెన్ ధ్రువ్ జురెల్(38) టాప్ స్కోరర్గా నిలవగా.. నిశాంత్ కుష్వాహా(37), శివమ్ శర్మ(25) రాణించారు. మీరట్ బౌలర్లలో విశాల్ చౌదరి, విజయ్ కుమార్ తలా మూడు వికెట్లు పగొట్టగా.. జీసన్ అన్సారీ రెండు వికెట్లను తీశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్నకు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కింది. అయితే ఫామ్లేనప్పటికి రింకూకు ఛాన్స్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి రింకూ బ్యాట్తోనే సమాధానమిచ్చాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.చదవండి: UPT20: రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్లతో వీర వీహారం! వీడియోChasing a target of 168, Rinku walks in at 38-4. Scores unbeaten 108 off 48. Wins the game in the 19th over. 🤯The One. The Only. RINKU SINGH! 🦁 💜pic.twitter.com/YCjQcLMcaH— KolkataKnightRiders (@KKRiders) August 21, 2025 -
టీమిండియా యువ బౌలర్ విధ్వంసం.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ, 3 వికెట్లు
యూపీ టీ20 లీగ్లో టీమిండియా యువ బౌలర్, కేకేఆర్ మాజీ మీడియం పేసర్ శివమ్ మావి విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి మెరుపులు మెరిపించాడు. ఈ లీగ్లో కాశీ రుద్రాస్కు ఆడుతున్న మావి.. గోరఖ్పూర్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న మావి 54 పరుగులు చేసి ఔటయ్యాడు.ఎనిమిదో వికెట్కు మావి శివ సింగ్తో (17 బంతుల్లో 34 నాటౌట్; 4 సిక్సర్లు) కలిసి 87 పరుగులు జోడించాడు. మావి, శివ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడటంతో రుద్రాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ కరణ్ శర్మ (39), యశోవర్దన్ సింగ్ (23) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గోరఖ్పూర్ బౌలర్లలో అబ్దుల్ రెహ్మాన్ 3, శివమ్ శర్మ 2, ప్రిన్స్ యాదవ్, వాసు వట్స్, విజయ్ యాదవ్ తలో వికెట్ తీశాడు.అనంతరం మావి బౌలింగ్లోనూ రాణించాడు. 3.1 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మావి ఆల్రౌండ్ షోతో చెలరేగడంతో రుద్రాస్ గోరఖ్పూర్ జట్టుపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. మావితో పాటు అటల్ బిహారీ రాయ్ (4-0-13-3), కార్తీక్ యాదవ్ (3-0-14-2), సునీల్ కుమార్ (3-0-25-1) కూడా సత్తా చాటడంతో గోరఖ్పూర్ జట్టు 19.1 ఓవర్లలో 126 పరుగులకే టపా కట్టేసింది. గోరఖ్పూర్ తరఫున ప్రిన్స్ యాదవ్ (29 బంతుల్లో 49; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ ఆకాశ్దీప్ నాథ్ (34) పోరాటం చేశారు. అయితే అప్పటికే ఆ జట్టు ఓటమి ఖరారైపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన మావికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.26 ఏళ్ల మావిని 2018 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ రూ. 3 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. మావి కేకేఆర్ తరఫున 32 మ్యాచ్లు ఆడి 30 వికెట్లు తీశాడు. అనంతరం 2024 సీజన్ మెగా వేలంలో మావిని లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని ధర (రూ. 6.4 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ ప్రారంభానికి ముందే అతను పక్కటెముకల గాయంతో వైదొలిగాడు.ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా మావికి 2023లో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అరంగేట్రం టీ20లోనే అతను 4 వికెట్ల ప్రదర్శనతో చెలరేగి సత్తా చాటాడు. అయితే ఆతర్వాత మ్యాచ్ల్లో రాణించలేకపోవడంతో మావి అంతర్జాతీయ టీ20 కెరీర్కు 6 మ్యాచ్లతోనే బ్రేక్ పడింది. -
గర్జించిన రింకూ సింగ్.. విధ్వంసకర బ్యాటర్లో ఈ కోణం కూడా ఉందా..!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్లో కొత్త కోణం బయటపడింది. ఈ విధ్వంసకర మిడిలార్డర్ బ్యాటర్.. స్వరాష్ట్రంలో జరుగుతున్న యూపీ టీ20 లీగ్లో బౌలర్ అవతారమెత్తాడు. అవతారమెత్తడమే కాకుండా ఈ విభాగంలోనూ సత్తా చాటాడు.ఈ లీగ్లో మీరట్ మెవరిక్స్కు ఆడుతున్న రింకూ.. ఇవాళ (ఆగస్ట్ 18) కాన్పూర్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీశాక రింకూ తీవ్ర ఉద్వేగానికి లోనై గర్జించసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.King Rinku @rinkusingh235 rattles the stumps on his first ball! The Captain announces his arrival. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #MMvsKS pic.twitter.com/mLwjJWVRSw— UP T20 League (@t20uttarpradesh) August 17, 2025రింకూలోని బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు మరో ఆల్రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్నే నమ్ముకుంటే టీమిండియాలో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆటగాళ్లంతా అదనంగా మరో విభాగంలో (బ్యాటర్లైతే బౌలింగ్ లేదా వికెట్కీపింగ్, బౌలర్లైతే బ్యాటింగ్) సత్తా చాటితేనే ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఈ విషయాన్ని రింకూ గ్రహించినట్లున్నాడు. కేవలం బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తే సరిపోదు, అదనంగా మరో టాలెంట్ను జోడించుకోవాలని భావించి బంతి పట్టాడు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేల రింకూ తనలోని బౌలింగ్ టాలెంట్ను బయటికి తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు.బౌలర్గా రాణించినా ఆసియా కప్ జట్టులో రింకూకు చోటు దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. ఖండాంతర టోర్నీకి ముందు 15 బెర్త్ల కోసం 20 మంది పోటీపడుతున్నారు. లోయరార్డర్లో ఓ బెర్త్ కోసం రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రింకూతో పోలిస్తే రియాన్ పరాగ్, సుందర్ మెరుగైన బౌలర్లు. వారితో పోటీలో రింకూ ఏమేరకు నెగ్గుకొస్తాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. రింకూ జట్టు మీరట్ కార్పూర్ జట్టుపై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. మాధవ్ కౌశిక్ (31 బంతుల్లో 95) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం ఛేదనలో కాన్పూర్ జట్టు తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్పై బ్యాన్!?
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా అతడిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దయాల్పై పోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ ఆసోయేషిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూలైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్లోని సంగనేర్ సదర్ పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు దయాల్పై మరో లైంగిక వేదింపుల కేసు కూడా నమోదైంది.వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఘజియాబాద్కు చెందిన ఒక అమ్మాయి దయాల్పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టుపై స్టే విధించింది. ఈ వరుస కేసుల నేపథ్యంలో దయాల్పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై వేటుకు యూపీసీఎ సిద్దమైనట్లు వినికిడి.కాగా ప్రయోగ్రాజ్కు చెందిన దయాల్ను యూపీటీ20 వేలంలో గోరఖ్పూర్ లయన్స్ రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు యూపీసీఎ నిర్ణయంతో గోరఖ్పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశముంది. అయితే గోరఖ్పూర్ లయన్స్ యాజమాన్యానికి ఇంకా యూపీసీఎ నుంచి దయాల్కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేని దైనక్ జాగరణ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.అంతేకాకుండా త్వరలోనే యూపీసీఎ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని మరిన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ ఏడాది యూపీ టీ20 లీగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: సాయి సుదర్శన్కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి? -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్స్టార్స్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్స్టార్స్కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్కు ఫోర్తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రింకూ సింగ్
యూపీ టీ20 లీగ్లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7 నాటౌట్ (2), 48 నాటౌట్ (35), 64 నాటౌట్ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్లో రింకూతో పాటు మాధవ్ కౌశిక్ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్ తివారి, కునాల్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్ చావ్లా, కార్తికేయ యాదవ్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్ నితీశ్ రాణా ఓ మోస్తరు స్కోర్ (21) చేశాడు. మెవెరిక్స్ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.బంతితోనూ రాణించిన రింకూ..బ్యాట్తో ఇరగదీసిన రింకూ సింగ్ బౌలింగ్లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్ చౌదరీ, యశ్ గార్గ్, జీషన్ అన్సారీ తలో వికెట్ పడగొట్టారు. -
భువనేశ్వర్ కుమార్కు జాక్ పాట్.. లీగ్ చరిత్రలోనే భారీ ధర
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్-2024లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి ఎడిషన్లో నోయిడా సూపర్ కింగ్స్కు ప్రాతనిథ్యం వహించిన భువనేశ్వర్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం లక్నో ఫాల్కన్స్ తరపున ఆడనున్నాడు. ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు. ఈ భారత వెటరన్ క్రికెటర్ కోసం కాన్పూర్ సూపర్ స్టార్స్ , గోరఖ్పూర్ లయన్స్ కూడా తీవ్రంగా శ్రమించాయి. కానీ వారి పర్స్లో తగినంత మొత్తం లేకపోవడంతో సదరు ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అయితే లక్నో ఫాల్కన్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. గత సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన భువీ 13 వికెట్లతో అదుర్స్ అన్పించాడు. కాగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువనేశ్వర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021 మెగా వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ రూ. 4.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ టీ20 లీగ్-2024 సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి వారు భాగం కానున్నారు. -
అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Bhuvneshwar Kumar Comments: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్లో అతడు ఆఖరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించింది బీసీసీఐ. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి గత కొంతకాలంగా జట్టులో చోటు కరువైంది. ఈ నేపథ్యంలో ఈ యూపీ సీమర్ లీగ్ క్రికెట్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో హైదరాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. తాజా ఎడిషన్లో 14 మ్యాచ్లలో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్తో బిజీగా ఉన్నాడు. స్థానికంగా జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో భువీ ప్రాతినిథ్యం వహిస్తున్న నోయిడా సూపర్ కింగ్స్ టాప్లో కొనసాగుతోంది. భువీ(PC: SRH) ఈ నేపథ్యంలో నేషనల్న్యూస్తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్బౌలర్గా తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకానికి చేరిందన్న ఈ రైట్ఆర్మ్ పేసర్... ఇప్పుడు తన దృష్టంతా కేవలం ఆటను ఆస్వాదించడం మీదే ఉందని పేర్కొన్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్నాను ‘‘మన కెరీర్ ఎలా సాగుతుందన్న విషయం మనసు మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్బౌలర్గా మనగలను. అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు. అయినా ఆ విషయం నన్ను బాధించడం లేదు. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కొచ్చు. ఇకపై నా దృష్టి మొత్తం దానిమీదే అంతేగానీ.. ప్రత్యేకంగా తిరిగిరావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఫార్మాట్లో అయినా.. ఎలాంటి లీగ్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నా దృష్టి ఉంది’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను లీగ్ క్రికెట్పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు తీశాడు. లోకల్ టాలెంట్ వెలుగులోకి యూపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి లీగ్లు స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. కాగా ఆరు జట్ల మధ్య పోటీతో ఆగష్టు 30న యూపీ టీ20 లీగ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..


