-
నల్లధనంపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం వల్ల నల్లధనానికి ద్వారాలు తెరుచుకున్నట్లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓ నేషనల్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అవసరం రాజకీయ పార్టీలకు ఎంత అవసరమో గుర్తు చేశారు. ‘రాజకీయ పార్టీలు నిధుల్ని సేకరించేందుకు అందుబాటులోకి తెచ్చిందే ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం. భారత ఆర్థిక వ్యవస్థను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని గడ్కరీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు నిర్ణయంపై తాను వ్యాఖ్యానించబోనన్న గడ్కరీ.. నిషేధంలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తే నల్లధనం రూపంలోనే డబ్బు చేతులు మారుతుందని చెప్పారు. ‘ఎలక్టోరల్ బాండ్లను సంపన్నులు కొనుగోలు చేస్తారు. ఆ సంపన్నులు కాంట్రాక్టర్లు అవుతారు. వ్యాపారం లేదా పరిశ్రమల వృద్ది కోసం ఉపయోగిస్తారు. కాబట్టి దానికి (క్విడ్ ప్రోకో) లింక్ చేయడం సరికాదు అని సూచించారు. -
16,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ విక్రయం.. ఏ పార్టీకి ఎన్ని నిధులు?
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని ప్రవేశ పెట్టారు. ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి. చదవండి: లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్ కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437. కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది. ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందింది. -
అదానీ–హిండెన్బర్గ్ అంశంపై సుప్రీం కోర్టు ఆరా
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరత నుండి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటర్ ఏమి చేయాలనుకుంటోందని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదానీ–హిండెన్బర్గ్ వ్యవహారానికి సంబంధించి దాఖలైన బ్యాచ్ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెబీకి ఈ ప్రశ్న సంధించింది. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించడానికి ప్రధాన కారణాలలో స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరతి ఒకటని తెలిపింది. ‘‘పెట్టుబడిదారుల తన పెట్టుబడి విలువను భారీగా కోల్పోయే ఈ తరహా అస్థిరతనుండి ఇన్వెస్టర్ను రక్షించడానికి సెబీ ఏమి చేయాలనుకుంటోంది. నిబంధనలను కఠినతరం చేసే దిశలో ఆలోచన చేస్తోందా?’’ అని జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు కూడా ఉన్న త్రిసభ్య ధర్మాసనం సెబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. అన్ని స్థాయిల్లో నిబంధనల పటిష్టతకు సెబీ తగిన చర్యలు తీసుకుంటోందని మెహతా ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెబీ తీసుకుంటున్న చర్యలను అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనితో ఈ అంశంపై తన ఉత్తర్వులను బెంచ్ రిజర్వ్ చేసుకుంది. 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు పూర్తి! కాగా, అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు ముగిసిందని సొలిసిటర్ జనరల్ తొలుత ధర్మాసనానికి తెలియజేశారు. మిగిలిన రెండింటి కోసం విదేశీ నియంత్రణ సంస్థల నుండి సమాచారం అవసరమని తెలిపారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు. షార్ట్ సెల్లింగ్కు సంబంధించినంత వరకు తప్పు జరిగినట్లు సెబీ ఏదైనా గుర్తించిందా అని బెంచ్ అడిగిన ప్రశ్నకు మెహతా సమాధానం చెబుతూ తప్పు ఎక్కడ జరిగినట్లు గుర్తించినా, సెబీ చట్టం ప్రకారం రెగ్యులేటర్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్కు సంబంధించినంతవరకు, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నుండి సూచనలు అందినట్లు తెలిపారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియంత్రణ వైఫల్యం లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మేలో సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. అయితే 2014 నుంచి 2019 మధ్య చేసిన పలు సవరణలు నియంత్రణ సంస్థ దర్యాప్తు సామర్థ్యాన్ని నిరోధించిందని అలాగే విదేశీ సంస్థల సంస్థల నుండి వచ్చిన నిధుల విషయంలో ఉల్లంఘనలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు వంటి ఆరోపణలతో హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇవి సత్యదూరాలని స్పష్టం చేసింది. గ్రూప్ కార్యకలాపాలనీ చట్టప్రకారం, పారదర్శకంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. -
Delhi: బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
రైడ్ షేరింగ్ సంస్థలకు సుప్రీం కోర్ట్ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్ చేసుకోండి!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్లో అప్లయ్ చేసుకునే వీలు కల్పించింది. ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఫండ్ బాడీ పోర్టల్ను సిద్ధం చేసింది. ఈపీఎఫ్ఓలో ఎలా అప్లయ్ చేయాలి ♦ అర్హులైన ఈపీఎఫ్ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్(e-Sewa portal)ను సందర్శించాలి ♦అందులో అధిక పెన్షన్ అప్లయ్ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ♦ అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఫర్ జాయింట్ ఆప్షన్తో యూఏఎన్ నెంబర్, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాల్ని ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్పై ట్యాప్ చేయాలి. ♦ ట్యాప్ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement