breaking news
sultan of johor cup
-
భారత్కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరిశాడు.తొలి క్వార్టర్లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్లో అన్మోల్ గోల్తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది. -
టైటిల్ పోరుకు భారత్
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఆతిథ్య మలేసియా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (22వ నిమిషంలో), ఆనంద్ కుష్వాహ (48వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా జట్టుకు నావినేశ్ పానికెర్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12వసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్కు చేరడం విశేషం. శుక్రవారం జరిగిన మరో రెండు లీగ్ మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్–బ్రిటన్ మ్యాచ్ 2–2 గోల్స్ వద్ద... ఆస్ట్రేలియా–పాకిస్తాన్ మ్యాచ్ 3–3 గోల్స్ వద్ద ‘డ్రా’ అయ్యాయి. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. 11 పాయింట్లతో ఆస్ట్రేలియా, 10 పాయింట్లతో భారత్ తొలి రెండు స్థానాల్లో నిలిచి నేడు టైటిల్ పోరులో తలపడతాయి. బ్రిటన్–పాకిస్తాన్ జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. -
రోహిత్, అర్షదీప్ పోరాటం వృధా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్లో (Sultan of Johor Cup 2025) భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు (Indian Junior Men's Hockey Team) తొలి పరాజయం ఎదురైంది. నిన్న (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాతో జరిగిన పూల్ మ్యాచ్లో (India vs Australia) భారత్ 2-4 తేడాతో ఓటమి పాలైంది.భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ (22వ నిమిషం), అర్ష్దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39, 42), ఆండ్రూ ప్యాట్రిక్ (40) మరియు కెప్టెన్ డిలన్ డౌనీ (51) గోల్స్ చేశారు.ఈ మ్యాచ్ తొలి క్వార్టర్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఆదిలోనే గోల్ కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి గోల్ను సేవ్ చేశాడు. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను అన్మోల్ ఎక్కా గోల్గా మలచలేకపోయాడు. 22వ నిమిషంలో కెప్టెన్ రోహిత్ మ్యాచ్ తొలి గోల్ చేసి భారత్కు ఆధిక్యం అందించాడు.25వ నిమిషంలో అమీర్ అలీ సోలో రన్తో గోల్కి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా గోల్కీపర్ అద్భతంగా అడ్డుకున్నాడు.ఆతర్వాత కొద్ది నిమిషాలకే మ్యాచ్ భారత్వైపు నుంచి ఆస్ట్రేలియావైపు మళ్లింది. 39 నుంచి 42 నిమిషాల్లోపు ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్పై పట్టు సాధించింది. ఆఖరి నిమిషంలో (60) అర్షదీప్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్తో గోల్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ ఆతిథ్య మలేసియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత సెమీస్ బెర్త్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం భారత్ 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ డ్రా, ఓ ఓటమితో 7 పాయింట్లు కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ డ్రాతో 10 పాయింట్లు కలిగి ఉండి టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
భారత్–పాకిస్తాన్ హాకీ మ్యాచ్ ‘డ్రా’
జొహోర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మంగళవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ను భారత జట్టు 3–3 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ (43వ నిమిషంలో), ఆనంద్ (47వ నిమిషంలో), మన్మీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ తరఫున హన్నాన్ షాహిద్ (5వ నిమిషంలో) ఒక గోల్.. సుఫియాన్ ఖాన్ (39వ, 55వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పాయింట్లతో ఆ్రస్టేలియాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. -
యువ భారత్ శుభారంభం
జొహర్ బహ్రు (మలేసియా): భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్లో శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోరులో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్ను చిత్తుచేసింది. కెప్టెన్ రోహిత్ (45వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్తో విజృంభించగా... రణ్వీత్ సింగ్ (23వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు. గ్రేట్ బ్రిటన్ తరఫున మైఖేల్ రొయ్డెన్ (26వ నిమిషంలో), కాడెన్ డ్రాసే (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో భారత జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా... దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16వ నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో గుర్జ్యోత్ సింగ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని రణ్వీత్కు అందించగా... అతడు దాన్ని గోల్పోస్ట్లోకి పంపి భారత్కు మొదటి గోల్ అందించాడు. కాసేపటికే ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా... మూడో క్వార్టర్లోనూ ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 45వ నిమిషంలో బ్రిటన్ స్ట్రయికర్లు చేసిన ప్రయత్నాల్ని భారత గోల్కీపర్ ప్రిన్స్దీప్ సింగ్ సమర్థవంతంగా అడుకున్నాడు. అదే సమయంలో రోహిత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో భారత్ ఆధిక్యం రెట్టింపు కాగా... తర్వాతి నిమిషంలోనే పెనాల్టీ స్ట్రోక్ను వినియోగించుకున్న గ్రేట్ బ్రిటన్ స్కోరును మరోసారి సమం చేసింది. ఇక చివరి క్వార్టర్లో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కించుకున్న భారత్... మూడోదాన్ని గోల్గా మలచి విజయంతో మ్యాచ్ను ముగించింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. -
హెడ్ కోచ్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో...
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్గా, రోహిత్ను వైస్ కెపె్టన్గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను 19న జపాన్తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది. భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్వీందర్, అన్మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్. -
Sultan of Johor Hockey: భారత్ 5 ఆస్ట్రేలియా 5
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ చివరి నిమిషంలో అమన్దీప్ గోల్ చేసి భారత్ను ఆదుకున్నాడు. శారదానంద్ తివారి (8వ, 35వ ని.లో) రెండు గోల్స్... బాబీ సింగ్ ధామి (2వ ని.లో), అర్జింత్ సింగ్ హుండల్ (18వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను శుక్రవారం బ్రిటన్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. -
ఫైనల్లో యువ భారత్
జొహర్ బారు (మలేసియా): వరుసగా నాలుగో విజయంతో భారత యువ జట్టు సుల్తాన్ జొహర్ కప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 5–4తో సంచలన విజయం సాధించింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే అగ్రస్థానంలో నిలిచింది. ఆట మొదలైందో లేదో అప్పుడే ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది భారత్. ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ... ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. గుర్సాహిబ్జిత్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో తొలి క్వార్టర్లోనే భారత్ 4–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. హస్ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), మన్దీప్ మోర్ (14వ ని.), విష్ణుకాంత్ సింగ్ (15వ ని.), శిలానంద్ లక్రా (43వ ని.) తలా ఒక గోల్ చేశారు. రెండో క్వార్టర్లో భారత డిఫెన్స్ వైఫల్యంతో డామన్ స్టీఫెన్స్ (18వ ని.) ఆస్ట్రేలియాకు తొలి గోల్ అందించాడు. అతనే మళ్లీ 35వ, 59వ, 60వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసినా ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో భారత్... బ్రిటన్తో తలపడుతుంది. 13న ఫైనల్ జరుగుతుంది. -
భారత యువ జట్టుకు కాంస్యం
న్యూఢిల్లీ: సుల్తాన్ జోహర్ కప్ అంతర్జాతీయ అండర్–21 హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మలేసియాలోని జోహర్ బాహ్రులో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున విశాల్ రెండు గోల్స్ చేయగా... వివేక్ ప్రసాద్, శైలానంద్ లాక్రా ఒక్కో గోల్ సాధించారు. -
భారత్ ‘డ్రా’తో సరి
జొహర్ బారు (మలేసియా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు మలేసియా బ్రేక్ వేసింది. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 3-3తో భారత్ను నిలువరించింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (10వ ని.లో), రమణ్దీప్ సింగ్ (33వ ని.లో), అఫాన్ యూసుఫ్ (70వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా తరఫున షారిల్ రెండు గోల్స్ (61వ, 68వ ని.లో)... రషీద్ (64వ ని.లో) ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్కు ముందే ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో ఈ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసిన తర్వాత భారత్, మలేసియా 13 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్ అగ్రస్థానంలో, మలేసియా రెండో స్థానంలో నిలిచి ఆదివారం జరిగే అంతిమ పోరుకు అర్హత పొందాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఈ మ్యాచ్లో బరిలోకి దిగిన భారత్ విరామ సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి పది నిమిషాల్లో మలేసియా అనూహ్య విజృంభణతో మూడు గోల్స్ సాధించింది. భారత్ ఓటమి ఖాయమనుకున్న దశలో చివరి సెకన్లలో వైస్ కెప్టెన్ అఫాన్ యూసుఫ్ గోల్తో టీమిండియా మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. నేటి ఫైనల్ భారత్ x మలేసియా సాయంత్రం గం. 6.00 నుంచి ఈఎస్పీఎన్లో ప్రత్యక్ష ప్రసారం -
ఫైనల్లో భారత్
జొహార్ బహ్రూ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నీలో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న ఆటగాళ్లు గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లోనూ ఇదే జోరును చూపారు. తమన్ దయా హాకీ స్టేడియంలో దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచ్ను భారత్ 6-1 తేడాతో గెలుచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోని భారత్కు ఇది నాలుగో విజయం. దీంతో మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య మలేసియాను ఢీకొంటుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే అమిత్ రోహిదాస్ గోల్ చేయగా 9వ నిమిషంలో సత్బార్ సింగ్, 31వ నిమిషంలో తల్వీందర్ సింగ్ చేసిన గోల్స్తో ప్రథమార్థంలోనే భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మ్యాచ్ చివర్లో కుర్రాళ్లు రె చ్చిపోయారు. అమోన్ మిరాష్ టికే (57వ నిమిషం), రామదీప్ సింగ్ (62), అఫాన్ యూసుఫ్ (65) గోల్స్ కొట్టడంతో భారత్ విజ యం ఖరారైంది. కొరియా నుంచి యు స్యూంగ్ జు 34వ నిమిషంలో గోల్ సాధించాడు. శనివారం జరిగే తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో భారత జట్టు మలేసియాను ఢీకొంటుంది.