-
బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే గొప్ప.. బిగ్బీ గుస్సా!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది. స్టార్ కిడ్స్కు అందలమిస్తారని, వేరేవాళ్లను తొక్కేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో హిందీ సినిమాలను ఎవరూ చూడొద్దు, బ్యాన్ చేసేద్దామని నెటిజన్లు సంకల్పించుకున్నారు. ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో చాలామటుకు ఫ్లాప్స్గా నిలిచిపోయాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు అందరినీ ఆకర్షించాయి. పాన్ ఇండియాగా రిలీజైన చిత్రాలు జనాలను మెప్పించాయి. దీంతో బాలీవుడ్ పనైపోయింది. సౌత్ ఇండస్ట్రీదే హవా.. అన్న టాక్ మొదలైంది. ఇప్పటికీ చాలాచోట్ల దక్షిణాది చిత్రాలను పొగుడుతూ హిందీ సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇది బిగ్బీ అమితాబ్ బచ్చన్కు బాధ కలిగిస్తోందట! సినిమాలను ఎందుకు తప్పుపడతారు? సౌత్ వర్సెస్ బాలీవుడ్ అన్న అంశంపై అమితాబ్ తీవ్రంగా స్పందించాడు. అలాగే సినిమాల మీద వ్యతిరేకత గురించి కూడా సంభాషించాడు. ఆయన మాట్లాడుతూ.. 'జనాల్లో వచ్చే మార్పులకు, సమాజంలో సంఘటనలకు సినిమాలే కారణమంటూ అనేకసార్లు మూవీ ఇండస్ట్రీనే తప్పుపడుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాల నుంచే కథలు, సినిమాలు పుడతాయి. ఆ యదార్థ సంఘటనలే సినిమాగా తెరకెక్కుతాయి. ఈ మధ్య ప్రాంతీయ సినిమాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అందుకే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ సినిమా బాగుంది అని వాళ్లను ప్రశంసించినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? హిందీలో ఎలాంటి సినిమాలైతే తీశారో అలాంటి వాటినే అక్కడ తెరకెక్కిస్తున్నామన్నారు. దీవార్, శక్తి, షోలే సినిమాలను రీమేక్ చేస్తున్నామని, వాటి సారాన్ని వాడుకుంటున్నామన్నారు. కాకపోతే మలయాళం సినిమా అలాగే కొంతవరకు తమిళ సినిమాలు మాత్రం వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అలా అని మా ఇండస్ట్రీ కంటే అదే గొప్ప అని చెప్పడం సరి కాదు' అన్నాడు బిగ్బీ. చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్పై భార్య ఫిర్యాదు! -
సైమా అవార్డ్స్-2023 వేడుకల ప్రకటన.. ఈసారి హోస్ట్ ఎవరంటే?
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2023 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దుబాయ్ వేదిక కానుందని ఆమె తెలిపారు. వేడుకలకు స్పాన్సర్గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. (ఇదీ చదవండి: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్) టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది సైమానే అని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో తాను కూడా భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తనకు దక్షిణాదికి చెందిన ఎందరో అభిమానుల నుంచి ప్రేమను పొందానని చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రం సీతారామంతోనే సైమాలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. దుబాయ్లోని D.W.T.Cలో జరిగే ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. Nexa Joins SIIMA as the Title Sponsor. SIIMA is the Biggest Awards Show in South India organising its 11th Edition in Dubai on 15th and 16th September. Rana Daggubati and Mrunal Thakur joined Brinda Prasad, Chairperson of SIIMA in announcing the Nexa SIIMA Partnership.… pic.twitter.com/H6na7W7uHr — SIIMA (@siima) July 7, 2023 -
దక్షిణాది చిత్రపరిశ్రమపై తాప్సీ వివాదస్పద వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్
సౌత్ సినిమా ఇండస్ట్రీపై సొట్టబుగ్గల సుందరి తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తను గుర్తింపు రాలేదని చెప్పింది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సరైన పాత్రలు సౌత్లో రాలేదని తెలిపింది. అక్కడ స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ సంతృప్తిని ఇచ్చే క్యారెక్టర్స్ లభించలేదని చెప్పింది. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) బాలీవుడ్లో నటించిన ‘పింక్’ చిత్రం తనకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టిందని వెల్లడించింది. ఈ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ టాలీవుడ్పై ఇలాంటి వ్యాఖ్యలే చేని విమర్శలు ఎదుర్కొంది తాప్సీ. టాలీవుడ్ హీరోయిన్స్ను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తారంటూ ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కామెంట్ చేసింది. అప్పట్లో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. -
ఇలియానాపై నిషేధం.. అందుకే సినిమాలకు దూరం!
తొలి సినిమా ‘దేవదాస్’తోనే అటు ఫిల్మ్ ఇండస్ట్రీని, ఇటు యూత్ని తనవైపుకు తిప్పుకుంది ఇలియానా. రెండో సినిమా పోకిరితో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా అవతరించింది. సౌత్లో కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే తన మకాంని బాలీవుడ్కి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా కూడా మళ్లీ సౌత్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. 2018లో అమర్ ఆక్బర్ ఆంటోనీ తర్వాత ఇలియానా తెలుగు తెరపై కనిపించలేదు. అయితే బాలీవుడ్పై ఉన్న మోజుతోనే ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పక్కకి పెట్టిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కావాలని సౌత్ సినిమాలకు దూరంగా వెళ్లలేదట. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాపై నిషేదం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలోనే ఇలియానా ఓ కోలీవుడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కోలీవుడ్ నిర్మాత నటరాజ్.. విక్రమ్ హీరోగా నందం అనే మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానాను తీసుకున్నారు. ఆమెకు రూ.40 లక్షలు కూడా అడ్వాన్స్ ఇచ్చాడట. అయితే అనుకొని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే.. దానికి ఇలియానా నిరాకరించిందట. కావాలంటే మరో సినిమాలో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో సదరు నిర్మాత నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఆశ్రయించారట. వారు కూడా చెప్పిన వినకపోవడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇలియానాను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ సమస్యను ఇలియాన పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె సౌత్ సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం టీటౌన్లో గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ గోవా బ్యూటీ ఏ హీరోతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి. -
సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ రీమేక్ చిత్రాల్లో నటించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానంది. ఆమె హీరోయిన్గా నటించిన భూల్ భులాయా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఓటీటీలు విస్తృతంగా వ్యాప్తి చెందకముందు కబీర్ సింగ్ సినిమా చేశాను, దాన్ని ఇప్పుడు మరోసారి చేయమన్నా సరే కళ్లు మూసుకుని ఓకే చెప్తాను. కానీ ఏదైనా రీమేక్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉందంటే దాన్ని చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. కొన్ని చిన్న చిత్రాలు రత్నాల్లా ఉంటాయి. వాటిని నిర్దిష్ట భాషలోనే తీస్తారు కనుక ఎక్కువమంది జనాలకు చేరదు. అలాంటప్పుడు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి ఎక్కువమంది జనాలు చూసేలా నిర్మించడంలో తప్పు లేదు' అని చెప్పుకొచ్చింది కియారా. కాగా భూల్ భలాయా మే 20న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక అదే రోజు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం కూడా విడుదల కానుంది. చదవండి: భళా తందనాన మూవీ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement