shuting
-
‘నయీం’ సినిమా షురూ
రాజధానిలో ‘ఖయీం భాయ్’ పేరుతో సినిమా ప్రారంభం క్లాప్ కొట్టిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్విచాన్ చేసి ప్రారంభించిన గుంటూరు కలెక్టర్ తుళ్లూరు రూరల్ (గుంటూరు): మాఫియా డాన్ ‘నయీం’ జీవిత కథ ఆధారంగా ‘ఖయీం భాయ్’ సినిమా ప్రారంభమైంది. పీ వెంకట్రెడ్డి, ఏ ప్రభాకర్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను డాక్టర్ అంబేద్కర్, తపస్సు సినిమాల దర్శకుడు భరత్ తీస్తున్నారు. రాజధాని అమరావతి తాత్కాలిక సచివాలయం సమీపంలోని మందడం గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్ కొట్టగా... గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ స్విచాన్ చేశారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాలో ‘నయీం’ కేరక్టర్ పాత్రను మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయీం పేరు రాంబోగా పిలుస్తారు. స్థానిక గణేష్ విగ్రహం ఎదుట నయీం కేరక్టర్ అయిన రాంబాబు కొబ్బరికాయ కొట్టి నృత్యం చేస్తుండగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో కథానాయికగా బెంగళూరుకు చెందిన మౌని, తనికెళ్ల భరిణి, ఎల్బీ శ్రీరాం, బెనర్జీ, రాం జగన్, ఫిష్ వెంకట్, శివ సత్యనారాయణ, హేమ, ప్రగతి, జ్యోతి, ముమైత్ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు గోపి మోహన్, సంగీతం శేఖర్ చంద్ర, కెమెరామన్ శ్రీధర్నార్ల, మేకప్ సూర్యచంద్ర, కాస్ట్యూమ్ వలి, కో–డైరెక్టర్ పీవీ రమేష్రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ క్రిష్ణారెడ్డి, జేవీ నారాయణరావు వ్యవహరిస్తున్నట్లు చిత్ర నిర్వహకులు తెలియజేశారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఏపీ రాజధాని ప్రాంతంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్లోని పాతబస్తీ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలియజేశారు. -
మరి వీటి సంగతి?
జహీరాబాద్, జహీరాబాద్లోనూ కమనీయ ప్రదేశాలు అనేకం. కాసింత శ్రద్ధ చూపితే పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి. పర్యాటకులు ప్రకృతి సోయగాలను ఇట్టే ఆస్వాదించవచ్చు. గలగల పారుతున్న సెలయేటి పరవళ్లు, అరకును తలపించే లోయలు, ట్యాంక్బండ్ను తలపించే ‘నారింజ’ ప్రాజెక్టు జహీరాబాద్కు పరిసరాల్లోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు సైతం జరుగుతుంటాయి. అయినా వీటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేవిషయంలో పాలకులు శ్రద్ధ తీసుకోవడంలేదు. జాడీమల్కాపూర్ సమీపంలోని జలపాతం కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. సుందర జలపాతాన్ని వీక్షించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రమే వెళుతుంటారు. ఈ జలపాతం వేసవికాలంలోనూ ఉంటుంది. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి భారీగానే పెరిగే అవకాశం ఉంది. పట్టించుకోకపోవడంతో జలపాతం గురించి ఎవరికీ తెలియకుండా పోతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రానికి సరిహద్దులో, పడియాల్తండాకు కొద్ది దూరంలో గొట్టంకోట ఆటవీ ప్రాంతం ఉంది. ఇది పూర్తిగా లోయ ప్రాంతం. ఇది అరకును తలపింపజేస్తోంది. ఈ ప్రాంతంలో పురాతన బక్కప్రభు, హనుమాన్ మందిరాలున్నాయి. అయినా ఆలయాల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. జాతర సందర్భంలోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతుంటారు. దీనిని అభివృద్ధి చేస్తే ఇరు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించే అవకాశం ఉంది. జహీరాబాద్ సమీపంలో నారింజ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇది పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే వీలుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో దారిన వెళ్లే వారికి కళావిహీనంగా దర్శనమిస్తోంది. 9వ నంబరు జాతీయ రహదారి నుంచి బీదర్ వెళ్లే రోడ్డుపై నారింజ ప్రాజెక్టు ఉండడంతో ఎప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్-బీదర్ మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడుస్తోంది. జహీరాబాద్ నిమోజకవర్గం ప్రజలు సెలవు రోజుల్లో సమీపంలో గల కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు వెళ్లివస్తారు. పర్యాటకులు నారింజ ప్రాజెక్టు మీదుగానే ప్రయాణం చేస్తున్నా ప్రాజెక్టు వద్ద ఆగేందుకు కూడా ఉత్సాహం చూపడం లేదు. ప్రాజెక్టు ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. నారింజ ప్రాజెక్టును బీదర్ రోడ్డుకు ఇరు వైపులా అభివృద్ధి చేసి మొక్కలు నాటడంతో పాటు సీసీ నిర్మాణం పనులు చేపడితే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ను తలపింపజేస్తుందనే అభిప్రాయాన్ని పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు. 4.