-
దాతృత్వంలో శివ్ నాడార్ టాప్
ముంబై: విరాళాలివ్వడంలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. 2023లో ఏకంగా రూ. 2,042 కోట్లు విరాళమిచ్చి ఎడెల్గివ్ హురున్ ఇండియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. గతేడాది ఇచి్చన రూ. 1,161 కోట్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రూ. 1,774 కోట్లతో (గతేడాదితో పోలిస్తే 267 శాతం అధికం) రెండో స్థానంలోనూ, రూ. 376 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ విరాళాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా రూ. 287 కోట్లతో నాలుగో స్థానంలో, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ. 285 కోట్లతో (50 శాతం అధికం) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నారు. ఇటీవలి హురున్ కుబేరుల జాబితా ప్రకారం అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగాను, అదానీది రూ. 4.74 లక్షల కోట్లు, నాడార్ సంపద రూ. 2.28 లక్షల కోట్లుగాను ఉంది. సంపద పెరిగే కొద్దీ సంపన్న కుటుంబాలు .. అట్టడుగు వర్గాల వారి కోసం ఆహారం, దుస్తులు, ఉపకార వేతనాలు మొదలైన దాతృత్వ కార్యకలాపాలకు విరాళాలిచ్చే ధోరణి పెరుగుతోందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. లిస్టులో మొత్తం 119 మంది వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు.. ► బజాజ్ కుటుంబంతో పాటు సైరస్ ఎస్ పూనావాలా, అదార్ పూనావాలా, రోహిణి నీలెకని వంటి వారు టాప్ 10లో నిల్చారు. మహిళల్లో నీలెకనితో పాటు అను ఆగా (థర్మాక్స్), లీనా గాంధీ తివారీ (యూఎస్వీ) కూడా ఉన్నారు. ► డిస్కౌంటు బ్రోకరేజీ జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయసు్కడు. కామత్ సోదరులు రూ. 110 కోట్లు విరాళమిచ్చారు. ► రూ. 150 కోట్ల విరాళంతో ఎల్అండ్టీ గౌరవ చైర్మన్ ఏఎం నాయక్ .. ప్రొఫెషనల్స్ జాబితాలో అగ్రస్థానంలో, ఓవరాల్ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు. -
ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!
Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. నార్త్వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్పై దృష్టి సారించి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్చే స్థాపించిన్ హెచ్సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్సిఎల్ చైర్పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు. కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. -
తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్లోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 1975లో హెచ్సీఎల్ ఆవిర్భావం ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) ఆవిష్కరించారు. హెచ్సీఎల్ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్సీఎల్టెక్ లిస్ట్ అయింది. తొలి పీసీ, ఐటీ రంగంపై అంచనాలు ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్వేర్తో హార్డ్వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ. 10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) బ్లూమ్బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్ను స్థాపించాడు. తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు. -
రోజుకు 3 కోట్లు విరాళాలు, టాప్లో ఎవరు? అంబానీ, అదానీ ఎక్కడ?
సాక్షి, ముంబై: ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త, పరోపకారి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, 77 ఏళ్ల శివ్ నాడార్ టాప్ ప్లేస్ను ఆక్రమించారు.. రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఎడెల్ గివ్ హురున్ ఇండియా విడుదల చేసిన తాజా లిస్ట్లో రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశీయ అత్యంత ఉదారమైన వ్యక్తిగా శివ నాడార్ నిలిచారు. 484 కోట్ల రూపాయల వార్షిక విరాళాలతో విప్రో 77 ఏళ్ల అజీమ్ ప్రేమ్జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. దాతృత్వంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టాప్లో ఉన్న అజీమ్ ప్రేమ్జీ విరాళాలు 95 శాతం తగ్గిపోవడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఆసియా, భారతదేశపు అత్యంత సంపన్నుడు, గౌతమ్ అదానీ విరాళాలు 46 శాతం పెరగడంతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. గత మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ 1446 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2022 ఎడెల్గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో భారతదేశంలో 15 మంది దాతలు రూ. 100 కోట్లకు పైగా వార్షిక విరాళాలివ్వగా, 20 మంది రూ. 50 కోట్లకు పైగా విరాళాలను అందించగా, 20 కోట్లకు పైగా విరాళాలిచ్చిన వారి సంఖ్య 43 మంది అని నివేదిక తెలిపింది. ఇంకా 142 కోట్ల రూపాయల విరాళం అందించిన లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్, దేశీయ అత్యంత ఉదారమైన ప్రొఫెషనల్ మేనేజర్. జెరోధా వ్యవస్థాపకులు నితిన్ ,నిఖిల్ కామత్ తమ విరాళాన్ని 300శాతం పెంచి రూ.100 కోట్లకు చేరుకున్నారు. వీరితోపాటు మైండ్ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రొతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి జాబితాలో ఒక్కొక్కరు రూ. 213 కోట్ల విరాళాలత టాప్ 10లోకి ప్రవేశించడం విశేషం. -
India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా?
దేశంలో లేదా ప్రపంచంలో సంపన్నుల లెక్క ఎప్పుడూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే.. మన దేశంలో ఏ రంగం నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈసారి కొంచెం కొత్తగా.. ఈ ఏడాది అత్యధిక సంపన్నులు ఉన్న టాప్–10 వ్యాపార రంగాల గురించి తెలుసుకుందాం.. అది కూడా ఫోర్బ్స్ జాబితా ప్రకారమే.. వీటిని చూశాక.. హెల్త్ ఈజ్ వెల్త్కి.. మరో అర్థమూ మనకు దొరుకుతుందేమో.. ఎందుకంటే.. అత్యధిక బిలియనీర్లు ఆరోగ్య రంగం నుంచే ఉన్నారు మరి.. 1. వైద్య రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు:సైరస్ పూనావాలా కంపెనీ: సైరస్ పూనావాలా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఎండీ. కోవిడ్ టీకాలు తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. ఆస్తుల నికర విలువ: సుమారు రూ.1.61 లక్షల కోట్లు 2. తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు: అశ్వన్ దనీ, కుటుంబం కంపెనీ: ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 58 వేల కోట్లు 3. ఫ్యాషన్ అండ్ రిటైల్ బిలియనీర్ల సంఖ్య: 16 అత్యంత ధనికుడు: రాధాకిషన్ దమానీ, కంపెనీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.43 లక్షల కోట్లు 4. సాంకేతిక రంగం బిలియనీర్ల సంఖ్య: 13 అత్యంత ధనికుడు: శివ్ నాడర్ కంపెనీ: హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.78 లక్షల కోట్లు 5. ఆర్థిక, బ్యాంకింగ్ బిలియనీర్ల సంఖ్య: 11 అత్యంత ధనికుడు: ఉదయ్ కోటక్, కంపెనీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ–సీఈవో ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.08 లక్షల కోట్లు 6. ఆహారం– పానీయాలు బిలియనీర్ల సంఖ్య: 10 అత్యంత ధనికుడు: రవి జైపురియా కంపెనీ: ఆర్జే కార్ప్ లిమిటెడ్ చైర్మన్. పెప్సీకి సీసాలు తయారు చేసే సంస్థ. కేఎఫ్సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు ఫ్రాంచైజీ) ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 52 వేల కోట్లు 7. వాహన తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికులు: బజాజ్ సోదరులు (నీరజ్, మధూర్, శేఖర్), కంపెనీ: బజాజ్ గ్రూప్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 54 వేల కోట్లు 8. స్థిరాస్తి రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికుడు: కుషల్పాల్ సింగ్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 66 వేల కోట్లు 9. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగం బిలియనీర్ల సంఖ్య: 5 అత్యంత ధనికుడు: రవి పిళ్లై కంపెనీ: ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ.20 వేల కోట్లు 10. సేవా రంగం బిలియనీర్ల సంఖ్య: 4 అత్యంత ధనికులు: కపిల్, రాహుల్ భాటియా (తండ్రీకొడుకులు) కంపెనీ: ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కపిల్ భాటియా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఎండీ రాహుల్ భాటియా. ఇండిగో సంస్థ సహవ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 35 వేల కోట్లు బిజినెస్ టైకూన్లు దేశంలో వివిధ రంగాలకు తమ వ్యాపారాలను విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్తల సంఖ్య 17కు చేరుకుంది. సుమారు రూ. 9.1 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ. 7 లక్షల కోట్లు సంపదతో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉండగా సుమారు రూ. 1.04 లక్షల కోట్లుతో కుమార్ మంగళం బిర్లా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement