breaking news
Seychelles
-
సెషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే
ద్వీపదేశమైన సెషల్స్లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి. ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్ నెక్ బ్లౌజ్ లేదా ఫుల్స్లీవ్ సిల్హౌట్లు ఈ చీర లుక్ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్వేరల్లోకి తీసుకొస్తుండటం విశేషం. అంతేగాదు వెస్ట్కోట్లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్లు లేదా న్యూట్రల్ బేసిక్స్తో జత చేసి సరికొత్త ట్రెండ్ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే. View this post on Instagram A post shared by New India Junction (@nijunction) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
సెషెల్స్తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్తో భారత్కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం
విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్లోని విక్టోరియా నగరంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు. వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడుదాం తర్వాత సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.19 కీలక అంశాలపై నిర్ణయం రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్లో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. సీషెల్స్కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్ కాక్పిట్తో ఒక డోర్నియర్ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి. దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సరీ్వస్, సీషెల్స్ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీకి సీషెల్స్ గౌరవ పురస్కారం ప్రదానం ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. -
సెషెల్స్ భద్రతకు భరోసా
విక్టోరియా: ద్వీప దేశమైన సెషెల్స్ సముద్ర భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శనివారం సెషెల్స్ దేశానికి చేరుకున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను సీషెల్స్ కోస్ట్గార్డుకు లాంఛనంగా అందజేశారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో భారత్–సెషెల్స్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. భారత్లో తయారైన నిఘా నౌకను సెషెల్స్కు అందజేయడం ఇరుదేశాల మధ్య సంబంధాల్లోమరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే ఆరు అంబులెన్స్లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్కు అందజేశారు. అంతకుముందు భారత్ నుంచి సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ ఘన స్వాగతం పలికారు. మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కళాకారులు నాట్య ప్రదర్శనలతో మోదీని స్వాగతించారు. మోదీ కోసం సెషెల్స్లోని భారతీయులు తరలివచ్చారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. భారతదేశం పట్ల వారికున్న ప్రగాఢమైన అభిమానం, సెషెల్స్ పురోగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని పేర్కొ న్నారు. భారతీయ ప్రవాసులు చాలాకాలంగా మన రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, మన ఉమ్మడి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చిస్తారు. సెషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. హిందూ మహాసముద్రంలో సెషెల్స్ ఒక విలువైన సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని మోదీ వివరించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కూర్మ రాజును సందర్శించిన మోదీ ప్రధాని మోదీ శనివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లోని భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించారు. ఇక్కడ అల్డాబ్రా వృద్ధ తాబేలుకు ఆహారం తినిపించారు. సీషెల్స్కు చెందిన అల్దాబ్రా భారీ తాబేళ్లు భూమిపై అత్యంత పెద్దవి, అత్యధిక కాలం జీవించే జీవజాతుల్లో ఒకటి. వీటిలో కొన్ని తాబేళ్లు రెండు శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ‘‘అల్డాబ్రా తాబేళ్లకు భారత్, సీషెల్స్ మధ్యనున్న ప్రత్యేక స్నేహంతో అనుబంధం ఉంది. 2014లో రెండు తాబేళ్లను కోల్కతాలోని అలీపూర్ జంతు పదర్శన శాలకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సెషెల్స్ మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు బహుమతిగా అందించింది’’అని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సెషెల్స్కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’అనే మొక్కను మోదీ నాటారు. కోకో డి మెర్కు సీషెల్స్లో విస్తృతమైన గౌరవం ఉందని, అది ఆ దేశ జాతీయ చిహ్నంపై కూడా ఉంటుందని మోదీ వివరించారు. అత్యంత పెద్ద విత్తనాలు, అత్యంత బరువైన పండ్లను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందిందని తెలిపారు. -
27 నుంచి ప్రధాని మోదీ సెషెల్స్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27–29వ తేదీల్లో సెషెల్స్లో పర్యటించనున్నారు. ఆ దేశ 50 ఏళ్ల జాతీయ దినోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనీతో చర్చలు జరుపుతారు. 50 ఏళ్లలో ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షిస్తారని గురువారం విదేశాంగ శాఖ తెలిపింది. సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారని వివరించింది. అక్కడి భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ ముచ్చటిస్తారంది. భారత నేవీలోని రెండు నౌకలు, భారత సైనికులు సెషెల్స్ జాతీయ దినోత్సవాల్లో పాలుపంచుకుంటారు. సెషెల్స్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపడుతున్నారని విదేశాంగ శాఖ వివరించింది. చివరిసారిగా మోదీ ఆ దేశాన్ని 2015లో సందర్శించారు. -
ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు.అంతకుముందు సీషెల్స్ అధ్యక్షుడితో భేటీ ఎంతో ఆనందంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సముద్ర పొరుగు దేశాలుగా, ఈ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సు మరియు భద్రత కోసం విజన్ మహాసాగర్ ని విజయవంతం చేయడంతో ఆయన మద్దతు చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా చైన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనెజ్ మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహాకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు.కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలాతో పాట్రిక్ హెర్మీని భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. భారత పర్యటన నిమిత్తం వచ్చిన పాట్రిక్ హెర్మీని ఫిబ్రవరి 10 వరకూ దేశంలో ఉండనున్నారు. ఇటీవల భారత్, సిీషెల్స్ ద్రైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. -
ఆ సమయంలో కూడా 'రతన్ టాటా' భయపడలేదు: శివశంకరన్
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్కాస్ట్లో ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్వర్డ్ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్పోర్ట్లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు. -
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
ఊహించని పరిణామం: ఇలాంటి వేటను అస్సలు చూసి ఉండరు!
Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం. సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్బయాలజీ జర్నల్లో ప్రచురితమైంది. కరోనా ప్రభావం! తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు. చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం! -
అసంప్షన్ ద్వీపంపై ముందడుగు
న్యూఢిల్లీ: సీషెల్స్లోని అసంప్షన్ ద్వీపంలో నౌకాదళ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నేవల్ బేస్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్, సీషెల్స్ మధ్య అంగీకారం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హిందూ మహాసముద్రంలో భారత్ ప్రభావం పెరగనుంది. మోదీ, ఫార్ మధ్య సోమవారం రక్షణతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చలు జరిగాయి. సీషెల్స్కు 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.680కోట్లు ) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. దీని ద్వారా సీషెల్స్లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ఫార్ పేర్కొన్నారు. మా లక్ష్యం ఒక్కటే!: మోదీ ‘భారత్, సీషెల్స్లు కీలక వ్యూహాత్మక భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలను ఇరుదేశాలు గౌరవిస్తాయి. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలు, సుస్థిరత నెలకొనాలన్నది మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. 2015లో సీషెల్స్ పర్యటనలో హామీ ఇచ్చినట్లుగా.. డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను సీషెల్స్కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ద్వీప సముదాయ దేశ రక్షణ సామర్థ్యం, తీర ప్రాంత మౌలికవసతులు పెంచుకునేందుకు భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. సీషెల్స్లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్ షిప్పింగ్ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్– సిటీ ఆఫ్ విక్టోరియా (సీషెల్స్) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. భారత రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వచ్చిన ఫార్ ఢిల్లీకి రాకముందే అహ్మదాబాద్, గోవాల్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా అలదాబ్రా జాతికి చెందిన రెండు భారీ తాబేళ్లను సీషెల్స్ అధ్యక్షుడు కానుకగా ఇచ్చారు. వీటిని హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉంచనున్నారు. ఫార్.. సోమవారం మోదీతో సమావేశం అనంతరం జరిగిన విందు సమావేశంలో సితార్ వాయించారు. ‘భారత్తో స్నేహబంధాన్ని సీషెల్స్ అధ్యక్షుడు ఫార్ వినూత్నంగా వ్యక్తపరిచారు. మోదీ ఏర్పాటుచేసిన విందులో సితార్ వాయిస్తూ.. పాట పాడారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొంటూ.. ఫార్ పాడిన పాటను ట్వీట్ చేశారు. ఆరోగ్యం జాగ్రత్త! రాష్ట్రపతి భవన్లో ఫార్ కోసం ఏర్పాటుచేసిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ కార్యక్రమంలో ఓ ఐఏఎఫ్ సైనికుడు వేసవి తాపం ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సహచరులు ఆయన్ను పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్సనందించారు. అయితే, కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ.. ఆ సైనికుడి వద్దకెళ్లి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అసంప్షన్ కథేంటి? హిందూ మహాసముద్రంలోని సీషెల్స్లో పాగా వేయడం భారత్కు వ్యూహాత్మకంగా కీలకం. 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్తో ఒప్పందం కారణంగా ఈ ప్రాంతంలో భారత్ తన ప్రభావం పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. 2015లోనే అసంప్షన్ ఐలాండ్ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. సీషెల్స్లో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చైనా–భారత్ల మిలటరీ వ్యూహంలో చిక్కుకుపోతామనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. కాగా, ‘మా తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్ ద్వీపంపై చర్చించాం. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని ఫార్ అన్నారు. -
సీషెల్స్లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
భారత్, షీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: గడిచిన మార్చి నెలలో షీషెల్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చకున్న అవగాహనమేరకు.. బుధవారం భారత్, షీషెల్స్ దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మిఛెల్ బుధవారం మద్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యాయి. అనంతరం ఐదు కీలక ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకం చేశారు. ఈ ఐదు ఒప్పందాల్లో పన్ను సమాచార మార్పిడి ఒప్పందంతోపాటు షీషెల్స్ కు డోర్నియార్ నిఘా విమానం అందజేత కీలకమైనవి. బ్లూ ఎకానమీ విషయంలో ఇరుదేశాల సహకారానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన, షీషెల్స్ లో వ్యవసాయ, విద్యారంగాల అభివృద్ధికి తోడ్పాటు తదితర ఇతర ఒప్పందాలపైనా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాక మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. -
లంకతో చెట్టపట్టాలు
ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు బలపడాలన్న ధ్యేయంతో శ్రీలంక, సీషెల్స్, మారిషస్లలో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన మూడు రోజుల పర్యటన ముగిసింది. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలైన ఈ మూడింటితో మంచి సంబంధాలుండటం ఆర్థికంగా మాత్రమే కాదు...వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి ఎంతో అవసరం. ఈ మూడు దేశాల్లోనూ భారత సంతతి జనాభా గణనీయంగా ఉన్నదని కూడా గుర్తుంచుకుంటే తాజా పర్యటనకున్న ప్రాముఖ్యత అవగతమవుతుంది. మన ప్రధాని ఒకరు శ్రీలంకలో పర్యటించడం 28 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారైతే...సీషెల్స్ పర్యటించడం 34 ఏళ్లలో ఇది తొలిసారి. ఇన్నేళ్లకుగానీ లంకనైనా, సీషెల్స్నైనా మన ప్రధాని సందర్శించడం సాధ్యంకాలేదంటే...అది చుట్టుపక్కల దేశాలతో సంబంధాల విషయంలో మనలో ఏర్పడిన నిర్లిప్తతను తెలియజేస్తుంది. మన వ్యూహాత్మక ప్రయోజనాలపై మనకున్న అవగాహనాలోపా న్ని వెల్లడిస్తుంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్లిప్తత, అవగాహనాలోపం మన ప్రయోజనాలకూ, భద్రతకూ చేటు కలిగిస్తాయి. అలాగని హిందూ సముద్ర ప్రాంత దేశాలతో సదవగాహనకు మన దేశం పూర్తిగా తలుపులు మూసుకోలేదు. దాదాపు 20 సభ్య దేశాలున్న హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల సంఘం 1997లో ఏర్పడటంలో మన దేశం చొరవ ప్రధానంగా ఉంది. అయి తే, ఈ దేశాలతో మన స్నేహసంబంధాలు అవసరమైనంతగా విస్తరిం చలేదు. ప్రత్యేకించి శ్రీలంకతో అయితే అవి క్షీణ దశకు చేరుకున్నాయి. దీన్ని గుర్తిం చబట్టే తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించిన మోదీ... దానికి కొనసాగింపుగా ఆయా దేశాల్లో పర్యటించారు. వారిలో చాలామంది మన దేశం వచ్చారు. మిగిలిన రెండు దేశాల పర్యటన కన్నా మోదీ శ్రీలంకలో జరిపిన పర్యట నపై మన దేశంలోనే కాదు...ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆసక్తిని ప్రదర్శిం చారు. ప్రధానంగా తమిళనాట దాదాపు అన్ని వర్గాలూ ఈ పర్యటననుంచి ఎంతో ఆశించాయి. సంస్కృతీ సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాల్లో భారత, శ్రీలంకల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. శతాబ్దాలుగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఉంది. అయినా, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అపోహలు, అపార్థాలూ పెరి గాయి. లంకలో తమిళులపట్ల అక్కడి పాలకులు అనుసరిస్తున్న వైఖరి, లిబరేషన్ టైగర్ల పోరాటం వంటివి దీనికి కారణం. లంక తమిళులకూ, మన తమిళులకూ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాల వల్ల అక్కడ సంభవించే పరిణామాల ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఉంటాయి. మహిం దా రాజపక్స అధ్యక్షుడుగా ఉన్న పదేళ్లకాలంలో మన సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో సార్క్ శిఖరాగ్ర సదస్సు కోసం లంక వెళ్లారు. రెండేళ్లక్రితం కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల సదస్సుకు తమిళ పార్టీల ఒత్తిడి కారణంగా ఆయన హాజరుకా లేదు. అటు రాజపక్స కూడా మన దేశం చాలాసార్లే వచ్చారు. అవన్నీ వ్యక్తిగత పర్యటనలే. ఏతావాతా రెండు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందలేదు. ఈ పరిస్థితిని చైనా పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకుంది. ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో అడుగుపెట్టి దాన్ని క్రమేపీ పటిష్టం చేసుకోవడం ప్రారంభించింది. పోర్టుల నిర్మాణంలో భారీ యెత్తున పెట్టుబడులు పెట్టడమేకాక...అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ చేయూతనిచ్చింది. శ్రీలంక విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది. ఈ పరిణామాలు భారత్కు అసంతృప్తిని కలిగించడంతోపాటు అనుమానాలనూ పెం చాయి. హిందూసముద్ర ప్రాంతంలో భారత్ను చుట్టుముట్టాలన్న ధ్యేయం తోనే చైనా అడుగులేస్తున్నదని మన దేశం భావించింది. ఒకప్పుడు మనతో ఎంతో సన్ని హితంగా మెలిగిన లంక చైనాతో అంటకాగడం, మన భద్రతకు ముప్పు కలిగే చర్య లకు దోహదకారి కావడం మన దేశం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇటు సముద్ర మార్గాన్నీ, అటు రోడ్డు మార్గాన్నీ అనుసంధానించి ఆఫ్రికా, యూరప్లతో నేరుగా వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికీ, అదే సమయంలో ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికీ చైనా రూపొందించిన విస్తృత వ్యూహం లోగుట్టు అర్థమయ్యాక మన దేశం జడత్వం వదిలించుకుంది. శ్రీలంకలో రాజపక్స పాలన ముగిసి మైత్రీపాల సిరిసేన ఏలుబడి వచ్చాక ఇరు దేశాలమధ్యా మైత్రి మళ్లీ చిగురిస్తున్నది. సిరిసేన తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకున్నారు. గత నెలలో మన దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇరు దేశాలమధ్యా పౌర అణు ఒప్పందం కుదిరింది. వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందిం చుకోవడంపై ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు దానికి కొనసా గింపుగా పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మన దేశాన్ని సందర్శించే లంక పౌరులకు వెనువెంటనే వీసా మంజూరు, ప్రాంతీయ పెట్రో హబ్గా ట్రింకోమలి రూపొందడానికి తోడ్పడటం, లంక రైల్వేలకు 31 కోట్ల డాలర్ల సాయంవంటివి ఇందులో ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని చూసి ఎవరూ బెదిరిపో నవసరం లేదని మోదీ భరోసానిచ్చారు. పరస్పర నమ్మకం, విశ్వాసం ఏర్పడి తే...ఒకరి ప్రయోజనాలపట్ల మరొకరికి ఆదుర్దా ఉంటే ఈ ప్రాంత దేశాలు అన్ని విధాలా ఎదగగలవని చెప్పారు. అదే సమయంలో లంక తమిళుల సమస్య పరిష్కా రానికి కృషిచేయాలని, ముఖ్యంగా తమిళులకు స్వయంపాలన ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న 13వ రాజ్యాంగ సవరణను త్రికరణ శుద్ధిగా అమలు చేయాలని హితవు పలికారు. ఈ పర్యటన రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యానికి బాటలు పరచ డంతోపాటు అపార్థాలనూ, అపోహలనూ తొలగించడానికి ఉపయోగపడింది. రాగలకాలంలో ఇది సుదృఢమైన మైత్రికి దోహదం కాగలదని ఆశిద్దాం. -
విదేశీ పర్యటనకు ప్రధాని
సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో పర్యటించనున్న మోదీ న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి బయల్దేరి సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. మారిషస్, శ్రీలంకల్లో కూడా ప్రధాని పర్యటించనున్నారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం భారత్కు అతి కీలకమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ భద్రతకు, పురోగతికి ఇది ముఖ్యమన్నారు. పర్యటన ఆ మూడు దేశాలతో భారత్ సంబంధాలకు పునరుత్తేజం కలిగిస్తుందని, భారత విదేశాంగ విధాన ప్రాధాన్యాలేమిటో స్పష్టం చేస్తుందని పర్యటనకు బయల్దేరే ముందు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత 33 ఏళ్లలో సీషెల్స్లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే. సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో ఆయన పర్యటన.. భారత్తో ఆ దేశాల స్థిర, చారిత్రక బంధాన్ని బలోపేతం చేస్తుందని, ఆర్థిక, సహకార, రక్షణ రంగంలో కొత్త అవకాశాలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చైనా హిందూ మహాసముద్ర ప్రాంతంపై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మిచెల్తో భేటీకి తాను ఎదురుచూస్తున్నానన్నారు. సీషెల్స్ నుంచి ప్రధాని మారిషస్ వెళతారు. గురువారం అక్కడ జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ దేశ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్తో చర్చలు జరుపుతారు. 13, 14 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ప్రధాని వెంట ఉన్నారు.


