-
ద్వారకలో స్కూబా డైవింగ్
ద్వారక: ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు. -
సాగర గర్భంలో పర్యాటకం
విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. – సాక్షి, అమరావతి ఎన్నెన్నో డైవింగ్ స్పాట్లు విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్లో 3 స్పాట్స్, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. అరుదైన చింతపల్లి.. ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్దీవులు, అండమాన్ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో మీటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా.. పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్ చేయించడంతో పాటు అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్ వాటర్, అడ్వాన్స్ ఓపెన్ వాటర్ విభాగాల్లో డైÐŒ లు చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్ పూల్ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సమీపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో మాత్రమే డైవింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. రెండు విధాలుగా.. విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్ మాస్టర్ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 మీటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో మీటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్ చేయిస్తారు. రెండింటిలోనూ 8–11 మీటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు. ప్రశాంత జలాల్లోనే.. ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్ నుంచి అకాడమీ సేవలను ప్రారంభించనున్నాం. – బలరామ్నాయుడు, లైవ్ ఇన్ అడ్వెంచర్స్, విశాఖపట్నం -
సముద్ర గర్భంలో చిన్నారి సాహసం
స్కూబా డైవింగ్లో పదేళ్ల చిన్నారి విశాఖ వేదికగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. చిచ్చరపిడుగు దేబప్రియ రుషికొండ సముద్ర జలాల్లో 35 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్రగర్భంలో స్కూబా డైవింగ్ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మొదటి డైవ్ని 40 నిమిషాల పాటు సముద్రంలో కొనసాగించిన దేబప్రియ.. రెండో డైవ్ని మరో 5 నిమిషాలు అదనంగా సాగర జలాల్లో కలియతిరుగుతూ 45 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్ బలరాం సారథ్యంలో చిన్నారి దేబప్రియ ఈ సాహస రికార్డుని నెలకొల్పింది. ఈ సందర్భంగా దేబప్రియకు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. తన పదో పుట్టిన రోజునే చిన్నారి ఈ రికార్డు సృష్టించడం కొసమెరుపు. చదవండి: (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం) -
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Parineeti Chopra Collects Plastic Waste While Scuba Diving: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. స్కూబా డైవింగ్ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించే వీడియోను సోషల్ మీడియాలో 'సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి' అనే క్యాప్షన్తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చెత్త సేకరించిన పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పరిణీతి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు', 'మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది', 'సూపర్', 'సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి భూమిని రక్షించేలా అందరికీ అవగాహన కల్పించాలి' అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
Tharagai Aradhana: శెభాష్.. 9 నెలలకే ఈత నేర్చుకుని... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..
తారాగై ఆరాధన సముద్రంలో ఈదడానికే పుట్టినట్లుంది. సముద్రంతో మమకారం పెంచుకుంటూ పెరుగుతోంది. సముద్ర జీవులను కాపాడడానికే పని చేస్తోంది. సముద్రంలో చెత్త వేయవద్దని చెప్తోంది. చేపపిల్లలా నీటిలో మునిగి వ్యర్థాల అంతుచూస్తోంది. తారాగై ఆరాధన స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ ధరించి పడవలో నుంచి సముద్రపు నీటిలోకి దూకిందంటే మరో క్షణంలో కంటికి కనిపించదు. పడవలో నుంచి ముందుకు ఉరికిన దేహం నీటిని తాకడమే ఆలస్యం... బుడుంగున మునక వేస్తుంది. చేపపిల్లలాగ నీటి అడుగుకు చేరుతుంది. పాన్పరాగ్ సాషేలు, పాలిథిన్ కవర్లు... అవీ ఇవీ అనే తేడా లేకుండా సముద్రంలో ఉండకూడని వ్యర్థాలన్నింటినీ ఏరి వేస్తుంది. నిజానికి సముద్రానికే ఆ లక్షణం ఉంటుంది. ప్రాణం లేని వస్తువును సముద్రం తన గర్భంలో దాచుకోదు. తనలో రూపుదిద్దుకున్న ప్రాణులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునూ నిలవనీయదు. వీలయినంత త్వరగా బయటకు తోసేస్తుంది. అలలతోపాటు నిమిషాల్లో తీరానికి కొట్టుకు వచ్చేస్తుందా వస్తువు. కానీ పలుచటి ప్లాస్టిక్ కవర్లు, చిన్న చిన్న వక్కపొడి కవర్ల వంటివి సముద్రంలో నీటి అడుగున ఇసుకలో కూరుకుపోతుంటాయి. అలాంటి వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని తనంతట తానుగా ప్రక్షాళన చేసుకోవడం సముద్రానికి చేతకావడం లేదు. అలలకు శక్తి చాలడం లేదు. అందుకే... ఆ పని సముద్రం మీద ప్రేమ ఉన్న మనుషుల బాధ్యత అయింది. అంతటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్న సాహసి మన తారాగై ఆరాధన. ఈ పాప వయసు ఎనిమిదేళ్లు. ఇప్పటి వరకు ఆమె సముద్ర తీరంలోనూ, సముద్రంలోనూ కూరుకుని పోయి ఉన్న 600 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసింది. సముద్రపు అలలతో ఆడుకునే వయసులో ఇంత పెద్ద పర్యావరణహితమైన బాధ్యతను తలకెత్తుకుంది. ఏ పని చేస్తున్నా తన వెంట తండ్రి ఉంటాడని, అందుకే ధైర్యంగా చేసేస్తున్నానని చెప్తోంది ఆరాధన. నీటిలోనే పెరిగింది తమిళనాడు రాష్ట్రం, కరప్పగమ్లో పుట్టిన ఆరాధనకు సముద్రంతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. ఆరాధన తండ్రి అరవింద్ తరుణ్శ్రీ స్కూబా డైవింగ్ ఎక్సపర్ట్ మాత్రమే కాదు, ఇన్స్ట్రక్టర్ కూడా. చెన్నై, పాండిచ్చేరిల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు అరవింద్. తన కూతురిని చిన్న వయసులోనే ఏదైనా సాధించేలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. నవజాత శిశువుకు ఈత నేర్పించడం చాలా సులువు కూడా. ఆరాధనకు మూడు రోజుల పాపాయిగా ఉన్నప్పుడే నీటిలో తేలడం అలవాటు చేశాడు. తొమ్మిది నెలలకు నీటి తొట్టిలో వదిలితే ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఈదేది. రెండేళ్లు నిండినప్పటి నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్గా తయారైంది. ఐదేళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఏడేళ్లు వచ్చేటప్పటికి స్విమ్మింగ్, స్కూబా డైవింగ్లో ఆరితేరింది. తండ్రి నేర్పిన విద్య అరవింద్ ఇరవై ఏళ్లుగా ఇదే రంగంలో ఉండడం, సముద్ర జలాలకు జరుగుతున్న హానిని కూడా దగ్గరగా చూడడంతో మెరైన్ పొల్యూషన్ని అరికట్టాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఆరాధనకు స్కూబా డైవింగ్ నేర్పించడంతోపాటు సముద్ర జలాల పరిరక్షణ పట్ల కూడా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆరాధన సముద్ర జలాలను ప్రక్షాళన చేయడంతోపాటు సముద్రజలాలు కలుషితమైతే సముద్రంలో నివసించే జీవులకు ఎదురయ్యే ప్రాణహాని గురించి చెబుతోంది. అంతరించిపోతున్న సముద్ర జీవుల పరిరక్షణ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది. ఇందుకోసం స్కూళ్లకు వెళ్లి తన వయసు పిల్లలకు తనకంటే పెద్ద పిల్లలకు మెరైన్ కన్జర్వేషన్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆరాధన ‘సేవ్ ద ఓషన్’ కార్యక్రమంలో భాగంగా ఏకబిగిన పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది. ‘‘మా నాన్న గడచిన పదిహేడేళ్లుగా పదివేల కిలోల వ్యర్థాలను వెలికి తీశాడు. నేను ఆరువందల కిలోలు తీశాను. ఇలా సాగర ప్రక్షాళన చేయడమే కాదు, ఇకపై ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పారవేయకుండా చైతన్యవంతం చేస్తున్నాం. మా తరం పెద్దయ్యేటప్పటికి సముద్ర పరిరక్షణ కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటోంది తారాగై ఆరాధన. చదవండి: సముద్రం నుంచి సముద్రానికి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement