breaking news
Ramya Moksha Kancharla
-
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్బాస్లో ఏం జరిగిందో మీకు తెలీదు!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని పదిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నా అవతారంపై మీమ్స్అదే వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష (Ramya Moksha Kancharla) కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే.. నా లుక్పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది.బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డా!సడన్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డా.. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా రాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియా (నీళ్ల విరేచనాలు)తో బాధపడ్డా.. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను.మేకప్ కూడా వేసుకోనుఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయినరోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, నేను బక్కగానే ఉంటాను. స్నాప్చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగెటివిటీ గురించి నేనసలు లెక్కచేయను. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్ -
అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే?
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..నో ట్రాక్స్బిగ్బాస్ హౌస్లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.అదే ముఖ్య కారణంరమ్య (Ramya Moksha) ఎలిమినేషన్కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్గా అనిపించింది.అది మర్చిపోతే ఎలా?తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది. రెమ్యునరేషన్ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్లో పడేశారు. నామినేషన్స్లో తప్ప గేమ్లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.చదవండి: కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య -
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్బిన్లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు -
బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా 9వ సీజన్లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
నీ ఏజ్కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్
బిగ్బాస్ హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాండింగ్స్ గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో హౌస్లోని కంటెస్టెంట్స్ అందరూ చాలా అలెర్ట్ అయిపోయారు. దీంతో 7వ వారం నామినేషన్స్లో బిగ్ వార్ కొనసాగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తనూజ -రమ్య మధ్య జరిగిన వార్తో పాటు రీతూ- ఆయేషాల మధ్య నడిచన మాటల ఫైర్ కూడా బాగానే పేలింది. ఎలిమినేషన్ రౌండ్లో ఇచ్చిన మాట తప్పావంటూ కల్యాణ్పై ఇమ్మాన్యేయల్ చేసిన కామెంట్లు ఆసక్తిగానే ఉన్నాయి. ఇలా ఈ వారం బిగ్ఫైట్తోనే మొదలైంది.రీతూ- ఆయేషాలో ఫైర్ బ్రాండ్ ఎవరుఆయేషా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షో చూసి గేమ్లోకి దిగింది. రీతూ, తనూజలనే టార్గెట్ పెట్టుకుని వచ్చినట్లు అర్ధం అవుతుంది. తానొక ఫైర్ బ్రాండ్ అనే రీతిలో ఆట మొదలు పెట్టింది. అయితే, ఈ వారం నామినేషన్లో రీతూ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను మెప్పించలేదు. కేవలం లవ్లు ఆడేందుకే హౌస్లోకి వచ్చావని పదేపదే రీతూను టార్గెట్ చేస్తూ ఆయేషా మాట్లాడింది. ఇదంతా బయటున్న ప్రేక్షకులకు కూడా తెలిసిందే. మళ్లీ అదే పాయింట్తో నామినేషన్ చేయడం ఆయేషా చేసిన రాంగ్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రీతూ పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే, రీతూ కూడా ఏంతమాత్రం తగ్గలేదు. కౌంటర్కు ధీటుగానే సమాధానం చెప్పకుంటూ పోయింది. రీతూ కేవలం లవ్ ట్రాక్తో మాత్రమే గేమ్ అడుతుందని చెప్పడవం చాలా రాంగ్.. గతంలో ఆమె చాలా బలంగా టాస్క్లు ఆడింది. అమ్మాయిల్లో శ్రీజ తర్వాత అంత గట్టిగా గేమ్స్ ఆడే సత్తా తనకు మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే. వీరిద్దరి మధ్య జరిగిన వార్లో రీతూనే ఫైర్ బ్రాండ్గా నిలిచిందని చెప్పవచ్చు.వయసుకు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్నామినేషన్స్ ప్రక్రియలో మొదట తనూజను టార్గెట్ చేస్తూ రమ్య హీట్ పెంచింది. తనూజ టాప్లో ఉందని హైపర్ ఆది కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తే కాస్త గేమ్ ట్రాక్లోకి వచ్చేస్తామనే ప్లాన్లో రమ్య ఉంది. అయితే, ఆట చూసే బరిలోకి దిగిన రమ్య పసలేని పాయింట్లతో తనూజను నామినేట్ చేసింది. తనూజ గురించి గత ఐదు వారాలుగా వస్తున్న వాటినే లేవనెత్తి మాట్లాడటం ఆపై తన గురించి బ్యాక్బిచ్చింగ్ చేయడం రమ్యకు నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి.నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ ఒక్క టాస్క్ కూడా ఆడలేదు.. మరోకరి సాయంతో మాత్రమే నిలబడుతున్నావ్ అంటూ తనూజ గురించి రమ్య అంటుంది. కేవలం బాండిగ్స్ కోసం మాత్రమే వచ్చావని, వాటి వల్లే ఇంట్లో ఉంటున్నావని కామెంట్స్ చేసింది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నావ్.. దాని నుంచి బయటికిరా.. ఫుల్ డ్రామా క్వీన్లా నటిస్తున్నావ్.. అంతా ఫేక్ అంటూ గట్టిగానే రమ్య మాట్లాడింది. తనూజ కూడా అంతే రేంజ్లో సమాధానం ఇచ్చింది.నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో.. కన్ఫెషన్ రూమ్లో నువ్వు ఏం అనిపించుకున్నావో అందరికీ తెలుసు. కాస్త వయసుకు తగినట్లు మాట్లాడు. ఫస్ట్ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడటం ఆపేయ్. అంటూ తనూజ ఫైర్ అయింది. అప్పుడు రమ్య కూడా.. అవును, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ మాటలు తూలింది. అలా ఇద్దరూ హౌస్లో హీట్ పెంచేశారు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాట్లాడిన నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ఇది బిగ్బాస్లా లేదు లవర్స్ పార్క్లా ఉంది అన్నావ్.. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో.. ఒకరికి మంట పెట్టాలని ఇంకొకరికి కోపం తెప్పించేలా మాట్లాడటానికే ఇక్కడికి వచ్చావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది.తనూజకు సరైన సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ చేసేందేకు రమ్య దిగింది. నువ్వు జెలస్ రాణివి.. ఫేక్ పిల్లవి.. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకర్ని వెతుక్కోనే పనిలో ఉంటావ్ .. అంటూ రమ్య వేసిన కౌంటర్కు తనూజ కూడా గట్టిగానే తిరిగిచ్చేసింది. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా.. ఒక్కోసారి రెండు చేతుల క్లాప్ నుంచి వచ్చే శబ్ధం కన్నా ఒక్క చేతితో వేసే విజిల్ గట్టిగా వినిపిస్తుందంటూ.. విజిల్ వేసి మరీ తనూజ బదులిచ్చింది .చెయ్ వెయ్ రా.. కల్యాణ్తనూజ- కల్యాణ్ గురించి రమ్య చేసిన బ్యాక్బిచ్చింగ్కు తనూజ ఓపెన్గానే సమాధానం ఇచ్చింది. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి.. వెనుకచాటు మాటలు ఎందుకంటూ రమ్యను ప్రశ్నించింది. నామినేషన్ టైమ్లోనే కళ్యాణ్ దగ్గరికెళ్లి.. ఒరేయ్ ఒకసారి నా భుజం మీద చెయ్ వెయ్ రా.. లాస్ట్ టైమ్ నువ్వు హ్యాండ్ వేయడానికి వస్తే ఛీ తియ్ అని అన్నాను. ఇప్పుడు వేయరా చూద్దాం. ఏమైనా జరగని అంటూ తన తల మీద చెయ్ పెట్టమని కూడా తనూజ కోరుతుంది. ఈ సీన్ బాగా వైరల్ అయింది. తనూజకు బాగా కలిసొచ్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఫైనల్గా ఈ వారం నామినేషన్లో తనూజ, రమ్య, కల్యాణ్, రాము, దివ్య, రాము, సంజన, శ్రీనివాస్ సాయి ఉన్నారు. -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్కార్డ్స్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
అమ్మాయిల పిచ్చి! నువ్వు చూశావా? రమ్యకు నాగ్ కౌంటర్
బిగ్బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. ఫుల్ క్లారిటీకల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్లో దూసుకుపోవడం ఖాయం! చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్మేట్స్తో తలపడి గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
చాంతాడంత లిస్ట్ ఆర్డర్ చేసిన రమ్య.. తిన్న వెంటనే వాంతులు!
వైల్డ్కార్డులు హౌస్లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఇచ్చాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్బాస్ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్ రమ్య (Ramya Moksha) వదులుకుంటుందా? సమస్యే లేదు.పెద్ద లిస్ట్ ఇచ్చిన రమ్యటిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్ బజ్జీ.. లంచ్కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, వెజ్ టిక్కా పిజ్జా, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్ విని బిగ్బాస్ గుడ్లు తేలేయడం ఖాయం. ఈ ఫుడ్ను సుమన్తో షేర్ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదట! 5 కిలోల చికెన్ కూడా అడిగేసిందట! పనిలో పనిగా చికెన్ పచ్చడి పెడుతుందేమో మరి!తినలేక తంటాలుదొరికిందే ఛాన్స్ అని ఆర్డర్ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్ చేసిన వంటకాలను మిగతా హౌస్మేట్స్కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్బాస్ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి! చదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
నా మీద చెయ్యేస్తే కిందేసి తొక్కుతా.. కల్యాణ్పై రమ్య చీప్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్(ఫ్లోరా సైనీ, శ్రీజ) తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చేశారు. అయితే, సోమవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా కనిపించింది. వాళ్ల రాకతో బిగ్బాస్లో వైల్డ్ తుపాన్ మొదలౌతుందని నాగార్జున సూచించారు. కానీ, అక్కడ అంత సీన్ ఏమీ లేదు. వచ్చిన వారందరూ కూడా పూర్తి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష పక్కా ప్లాన్తోనే కల్యాణ్, తనూజలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. టాప్లో ఉన్న వీరిద్దరిని టార్గెట్ చేస్తే వారిని ఇష్టపడని ఓటర్స్ను తమ వైపు లాగేయవచ్చనే స్ట్రాటజీ మొదలుపెట్టారనిపిస్తుంది.సోమవారం ఎపిసోడ్లో కెప్టెన్గా ఉన్న కల్యాణ్ను మాధురితో పాటు రమ్య టార్గెట్ చేశారు. మొదట కల్యాణ్తో దివ్వెల మాధురి గొడవ పెట్టుకున్నారు. కూర్చోండి మేడం అని చాలా మర్యాదగా ఆమెకు గౌరవం ఇచ్చాడు కల్యాణ్. కానీ, ఇంత చిన్న విషయానికి ఆమె గొడవకు దిగారు. నువ్వేమైనా నా బాస్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. కుర్చుంటేనే మాట్లాడుతారా అంటూ వెటకారంగా అనేశారు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఈ గొడవను భరణి ఆపాలని చూసినా మాధురి మాత్రం తగ్గలేదు. అయితే, కల్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత సమయం తర్వాత మాధురి మేడం సారీ అంటూ కల్యాణ్ కోరాడు. మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. నేను చిన్నపిల్లోడినే క్షమించేయండి అంటూ కోరుతాడు. దీంతో మాధురి కూడా మంచిగానే రియాక్ట్ అయి ఆ గొడవను క్లోజ్ చేస్తారు.నోరుజారిన రమ్య మోక్షసోమవారం ఎపిసోడ్ మొత్తం కల్యాణ్ చుట్టే నడిచింది. అతనిపై రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మాధురితో కూర్చొని మాట్లాడుతూ.. కల్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ పెద్ద కామెంట్ చేసింది. శ్రీజ ఎలిమినేషన్ రౌండ్లో తన బెలూన్ కట్ చేశానని ఆ అబ్బాయి కల్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందంటూ చెప్పింది. అసలు తనతో కల్యాణ్ మాట్లాడట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎదురు పడితే ముఖం తిప్పుకోవడమే కాకుండా కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని మోక్ష చెప్పింది. అయితే, ఈ సమయంలో మాధురి కూడా రమ్యకు వంత పాడుతుంది. ఆ అబ్బాయితో మాట్లాడానికి ఇక్కడికి వచ్చామా లేదు కదా అని మాధురి చెబుతుంది. అతనికి (కల్యాణ్) అమ్మాయిల పిచ్చి ఫస్ట్.. అంటూ రమ్య మళ్లీ పైర్ అవుతుంది. ఈ సమయంలో మాధురి కూడా నోరు జారుతుంది. ఆ అబ్బాయి ప్రొఫెషన్ (ఆర్మీ) ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న బిహేవ్ బాగాలేదంటుంది.నా మీద చెయ్యి వేస్తే కిందేసి తొక్కేస్తా: రమ్యరమ్య బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చాక కల్యాణ్, తనూజలనే టార్గెట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం టాప్లో ఉన్నారు. కాబట్టి వారిని ట్రిగ్గర్ చేస్తే.. తనకు లాభం అనే స్ట్రాటజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే కల్యాణ్, తనూజలను ఇష్టపడరో వారందరూ రమ్య వైపు తిప్పుకునేందుకే ఇలా స్కెచ్ వేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనూజతో కల్యాణ్ బిహేవ్ చేస్తున్న తీరుపై రమ్య గట్టిగానే రియాక్ట్ అయింది. వారిద్దరి బాండింగ్ గురించి ఆమె ఇలా కామెంట్ చేసింది. " తనూజ, కల్యాణ్లను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆమె (తనూజ) మీద కల్యాణ్ చేతులు ఇలా వేసేసి తడుముతుంటే చూసేందుకు నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా.. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుదో తెలియడం లేదు. కల్యాణ్ను కూడా ఆమె ఆపేయడం లేదు. హేహే అంటుందే కానీ.. అతన్ని ఆపదు. అందుకే కదా అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. వారిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు. అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అదంతా విన్న తర్వాత అక్కడే ఉన్న మాధురి కూడా నిజమే కదా అంటూ తల ఊపడం మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది.ఈ వారం నామినేషన్స్లో ఎవరు..?ఎపిసోడ్ చివరలో నామినేషన్ ప్రారంభమైంది. అయితే, వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నామినేషన్లో లేరు. కానీ, వారి నుంచే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకు తనూజ వల్ల సుమన్ శెట్టి, రామూ రాథోడ్ వల్ల పవన్, సంజన వల్ల భరణి నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు. అయితే.. తనూజ , దివ్య, రాము కూడా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఈసారి నామినేషన్స్లో ఎవరంటే?
ఆదివారం ఎపిసోడ్తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ వారం నామినేట్ అయినోళ్లుభరణిపవన్దివ్యరాముసుమన్తనూజ(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!) -
ఆరోజు షూటింగ్కి వెళ్లా.. నాన్న చనిపోయారు: రమ్య మోక్ష
బిగ్బాస్ 9లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్లో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్.. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న.. రమ్య, అలేఖ్య, సుమ. ఇదే మా కుటుంబం. షూటింగ్కు వెళ్లిన రోజే..నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన ఫిట్నెస్ వీడియోలకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా ఎదిగింది. ఒకరోజు సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ వెళ్లాను. ఆరోజు ఉదయం ఐదు గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్నను తీసుకెళ్లిపోయారు. సినిమా చేయకుండా ఉండాల్సిందినేను ఎంతో బతిమాలి చివరకు రెండు నిమిషాలు నాన్నను కడసారి చూసుకున్నాను. నేను ఆరోజు షూట్కు వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఆ సినిమాయే చేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాన్న చనిపోయిన తర్వాతి వారమే ఆడియో రిలీజ్లంటూ వివాదాల్లో చిక్కుకున్నాం. ఎవరెవరో వచ్చి ఊరికనే తిట్టేవాళ్లు. చాలా ఫేస్ చేశాం. అప్పుడు మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్లో తిట్టింది. కెరీర్పై ఫోకస్ పెట్టా..క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమరయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు బిగ్బాస్లాంటి ప్లాట్ఫామ్లో అవకాశం దొరికితే నేను వదలుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని చెప్పుకొచ్చింది. మరి బిగ్బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్కు ఛాన్స్ ఇస్తుందా? చూడాలి! -
బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు లీకులు వచ్చేశాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది.లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారట. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఆరుగురు రాబోతున్నారట. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే కావడం విశేషం. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూద్దాం.రమ్య మోక్షసోషల్ మీడియాలో పికెల్స్ (ఊరగాయలు) బిజినెస్తో పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష.. వైల్డ్ కార్డ్గా రాబోతుందట. చెప్పాలంటే రమ్యతో పాటు ఈమెకు మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఆన్లైన్లో పికెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈమె ఫిజికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గొడవల విషయంలో ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.శ్రీనివాస్ సాయి'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. దీంతో బిగ్బాస్ వాళ్లు అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేసినట్లున్నాడు. కుర్రాడు కాబట్టి హౌసులోకి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్స్ లాంటివి ఉండొచ్చు.నిఖిల్ నాయర్'గృహలక్ష్మి' సీరియల్తో తెలుగు ప్రేక్షకులు తెలిసిన ఇతడు.. 'పలుకే బంగారమాయెనా' సీరియల్లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. సిక్స్ ప్యాక్ కూడా ఉంది. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.గౌరవ్ గుప్తాప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ చేస్తున్నారు. ఇతడు కూడా సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్తో పాటు ఫిజికల్గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది. చూడాలి మరి ఏం చేస్తాడో?ఆయేషా జీనత్వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం ఈమెకుంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.దివ్వల మాధురిసోషల్ మీడియాలో రీల్స్తో పాపులారిటీ తెచ్చుకున్న దివ్వల మాధురి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.


