breaking news
Radhika Gupta
-
యూఎస్లో చదువుకు రూ.10 కోట్లు!
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనం (డెప్రిసియేషన్) తీవ్ర రూపం దాల్చింది. నేడు మార్కెట్లో ఒక డాలర్ విలువ సుమారు రూ.90.3గా నమోదైంది. దాంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 4.83% మేర క్షీణించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా అంతర్జాతీయ విద్యా ఖర్చులపై దీర్ఘకాలిక ప్రణాళిక గురించి భారతీయ కుటుంబాలను హెచ్చరించారు.రూపాయి విలువ 90 మార్కును దాటిన తర్వాత తన ఎక్స్ ఖాతాలో కరెన్సీ పతనం ప్రభావాన్ని వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో తమ పిల్లల చదువుల కోసం చూస్తున్న లక్షలాది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు.యూఎస్ డిగ్రీకి రూ.10 కోట్ల కార్పస్ ఎందుకు?మే నెలలో తాను పోస్ట్ చేసిన ఒక విశ్లేషణను గుప్తా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ‘గతంలో యూఎస్ ఎడ్యుకేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పినప్పుడు ఈ సంఖ్యపై చాలా సందేశాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు రూపాయి 90కి చేరుకున్న తర్వాత ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఆ పాత పోస్ట్లో ఆమె తన చిన్న కుమారుడు యూఎస్లోని డిగ్రీ చేయడం కోసం రూ.8-10 కోట్ల కార్పస్ (పెట్టుబడి నిధి) లక్ష్యంగా పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు.‘ఈరోజు సుమారు రూ.2.5 కోట్లు ఖర్చవుతున్న యూఎస్ డిగ్రీ 16 సంవత్సరాల్లో దాదాపు రూ.10 కోట్లకు పెరుగుతుంది’ అని ఆమె లెక్కలను పంచుకున్నారు. ఇక్కడ కేవలం దేశీయ ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ఏటా 2-4% చొప్పున జరిగే కరెన్సీ డెప్రిసియేషన్ను కూడా లెక్కించాలని ఆమె సూచించారు. దేశీయ ఎగుమతులకు మద్దతు ఇవ్వడానికి పోటీ అవసరం కాబట్టి దీర్ఘకాలంలో కరెన్సీ తగ్గుదలను పరిగణించడం సురక్షితమైన ప్రణాళిక అని ఆమె చెప్పారు.విదేశీ ఆస్తుల్లో డైవర్సిఫికేషన్అంతర్జాతీయ ఆస్తుల్లో వైవిధ్యీకరణ ఉండాలని రాధికా గుప్తా సిఫారసు చేశారు. విదేశీ కరెన్సీలో ఖర్చు చేయబోయే కుటుంబాలకు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆ కరెన్సీకి లింక్ అయిన ఆస్తుల్లో ఉంచడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవచ్చని తెలిపారు. అయితే, ఈ వైవిధ్యీకరణకు అడ్డంకిగా ఉన్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితుల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ పరిమితులు చాలా మంది భారతీయులకు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను కష్టతరం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.గిఫ్ట్ సిటీ ద్వారా కొత్త మార్గాలుఈ పరిమితులకు త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశం ఉందని గుప్తా సూచించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. గుజరాత్లోని గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిటీ (గిఫ్ట్ సిటీ) అనేది ఎల్ఆర్ఎస్ పరిమితులకు లోబడకుండా మ్యూచువల్ ఫండ్ల ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: 20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్! -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు
అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్మెంట్కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్వీజ్ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్వీజ్ను దేశవ్యాప్తంగా విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ఫండ్ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ 200 లక్షల కోట్లకు చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) → అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్మెంట్కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి. → అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? స్మాల్క్యాప్ కంపెనీలు... కొన్ని థీమ్స్..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్. → మరి ఇలాంటి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్ ఫండ్లు, మల్టీ అసెట్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. → డిఫెన్స్ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్ అవుతారు. నేనైతే ఈ థీమ్లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి. → మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్లిస్టెడ్ కంపెనీలు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్ ఇన్వెస్టర్లను ఇండెక్స్ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను. → కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. → చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోందా? చాలా. ఎడిల్వీజ్ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం. → పాసివ్ (ఇండెక్స్) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి. → ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎడిల్వీజ్ ప్రణాళికలేంటి? టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. → ఐదు పదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటమే వికసిత భారత్కు అర్థమన్నది నా భావన.→ యువత చాలామంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నారు. మీరేమంటారు? అదో దుర్మార్గం. ఎఫ్ అండ్ ఓ అనేది సంస్థలు రిస్్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్. ప్రమాదకరం. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ అవసరం లేదు. → భారత్ బాండ్ ఫండ్ మాదిరి ఎడిల్వీజ్ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? అక్టోబర్ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ స్పెషల్ ఇన్వెస్ట్మెండ్ ఫండ్ను (ఎస్ఐఎఫ్) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. -
బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట
దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.మరిన్ని సంస్కరణలు ప్లీజ్...మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్ చేశారు.చదవండి: జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. Big Diwali gift 🎁 for every Indian!GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries💊 Relief in healthcare📚 Affordable education🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.— Harsh Goenka (@hvgoenka) September 3, 2025Extremely progressive step at a very critical time that should help boost both demand and sentiment! When the world pushes us into a corner, we push ourselves to fight back harder. pic.twitter.com/DnU7k5tTgq— Radhika Gupta (@iRadhikaGupta) September 3, 2025We have now joined the battle…More and faster reforms are the surest way to unleash consumption and investment.Those, in turn, will expand the economy and amplify India’s voice in the world.But let’s remember the famous exhortation of Swami Vivekananda:“Arise, awake, and… https://t.co/rDoRtjsCw1— anand mahindra (@anandmahindra) September 3, 2025 -
డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా
డబ్బు సంపాదించాలన్నా.. డబ్బు ఆదా చేయాలన్నా, తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఖర్చులు పెరిగినప్పుడు, ఆదా చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ రాధిక గుప్తా మాత్రం ఓ ఫార్మలా సూచిస్తూ.. డబ్బును, ఇలా అదా చేయొచ్చని వెల్లడించారునిరంజన్ అవస్థితో కలిసి రాసిన తన కొత్త పుస్తకం 'మ్యాంగో మిలియనీర్'లో రాధిక గుప్తా 10-30-50 రూల్ గురించి వివరించారు. ''అదా చేయడం అంటే.. క్రికెట్ మ్యాచ్కు ముందు చేసే ప్రాక్టీస్ అని అన్నారు. ఆర్ధిక విజయానికి తప్పకుండా పునాది అవసరం. ఏ క్రేడాకారుడు.. సాధన లేకుండా మ్యాచ్లోకి అడుగు పెట్టాలని కలలు కనడు. అలాగే.. పెట్టుబడిదారుడు కూడా, ముందు పొదుపులో నైపుణ్యం సాధించాలి, అప్పుడే విజయం సాధిస్తాడు'' అని వెల్లడించారు.రాధిక గుప్తా 10-30-50 నియమం20 ఏళ్లలో 10 శాతం: పొదుపు చేయడం చిన్నగా ప్రారంభించండి. పొదుపు చేయడం అంటే.. మీ భవిష్యత్తుకు మీరే డబ్బు చెల్లించుకోవడం ని రాధికా గుప్తా పేర్కొన్నారు. ఆడంబరమైన, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి.30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో 30 శాతం: ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్నప్పుడు.. వస్తున్న ఆదాయంలో పొదుపును 30 శాతానికి పెంచండి.40 ఏళ్లు పైబడిన వారు 50 శాతం: పదవీ విరమణ, పిల్లల విద్య కోసం ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఆదాయం కొంత ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించే ఆదాయంలో 50 శాతం వరకు పొదుపు చేయండి.ఇదీ చదవండి: ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు! -
ఎవరు చెప్పినా వినండి.. కానీ..
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు. -
బాత్రూమ్లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా
వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy), 70 గంటలు కాదు.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ 'సుబ్రమణ్యన్' (Subrahmanyan) పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను వారానికి 100 గంటలు పనిచేశానని వెల్లడించారు.రాధికా గుప్తా ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో వారానికి 100 గంటలు పనిచేసాను. అలా నాలుగు నెలల పాటు పని చేసినట్లు పేర్కొన్నారు. పనిగంటలు పెరిగినంత మాత్రమే ఉత్పాతకత పెరుగుతుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఉద్యోగిపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మానసికంగా కృంగదీస్తుంది. కుటుంబాలకు సైతం దూరం చేస్తుందని అన్నారు.ఛాయిస్, హార్డ్వర్క్, ఆనందం పేరుతో ట్వీట్ చేస్తూ.. రాధికా గుప్తా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పనిగంటలపై పెద్ద డెబిట్ జరుగుతోంది. కాబట్టి ఈ అంశం మీద ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.కష్టపడి పనిచేయడం ముఖ్యం. నేను దానిని నేర్చుకున్నాను. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడిపని చేయడం అని నమ్ముతున్నాను. కష్టపడి పనిచేసే వ్యక్తి వేగంగా ఎదుగుతాడని కూడా నేను నమ్ముతానని అన్నారు.ఇక పని గంటల విషయానికి వస్తే.. నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో, మొదటి ప్రాజెక్ట్లో నెలకు వారానికి 100 గంటలు, రోజుకు 18 గంటలు పని చేశాను. పని ఒత్తిడి తట్టుకోలేక ఆఫీసు బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కొన్ని సార్లు తెల్లవారుజామున 2 గంటలకు తినేదాన్ని. ఈ కారణంగానే రెండు సార్లు ఆసుపత్రిలో చేరాను. బ్యాంకింగ్, కన్సల్టింగ్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేసే నా స్నేహితులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన.. ఎక్కువ ఉత్పాదకత ఉండదు. ఉన్న సమయంలో ఎంత సమర్ధవంతంగా పనిచేశామన్నదే ముఖ్యం అని రాధికా గుప్తా పేర్కొన్నారు. పని గంటలు ఎక్కువైతే.. ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఉత్పాదకత ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సమయానికి ఆఫీసుకు రండి, చేయాల్సిన పనిని పూర్తి చేయండి. అవసరమైన సమావేశాలను మాత్రమే నిర్వహించండి, టెక్నాలజీని కావలసిన విధంగా ఉపయోగించుకోండని రాధికా గుప్తా పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకుభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమందరం దోహదపడాలి. కానీ మనం అలా చేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. పని చేస్తూనే కుటుంబాలతో కలిసి ఉండటం.. పిల్లలకు మెరుగైన జీవితాలను అందించడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.నేను ఎంతోమంది యువతను.. ముఖ్యంగా మహిళలకు కలుస్తుంటాను. కుటుంబం & కెరీర్ కలిసి ఉండలేవనే భయం కారణంగా తమకు కుటుంబం ఉండాలా వద్దా అని వారు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను చాలా భయపెడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ.. వికసిత్ భారత్ కల సాకారానికి దోహదపడుతూనే.. పని - జీవితంతో సంతోషాన్ని ఆస్వాదించాలని రాధికా గుప్తా స్పష్టం చేశారు.Choices, Hard Work and Happiness I debated whether to write this post, because the risk of being misquoted on this issue in this clickbait world is high. But I am trying to share what is a nuanced point of view on the issue of work-life balance.1. Hard work is important and…— Radhika Gupta (@iRadhikaGupta) January 11, 2025


