breaking news
Priyank Panchal
-
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్స్టార్గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్కు ముగింపు పలికాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్లో పంచల్ పేర్కొన్నాడు.ప్రియాంక్కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఆ ఎడిషన్లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. -
ప్రియాంక్ ప్రతాపం
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0. గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222. వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0. -
ప్రియాంక్ పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్లో వెస్ట్ జోన్ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (69 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్, వికెట్కీపర్ హార్విక్ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో వెస్ట్ జోన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. నార్త్ ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్, రాహుల్ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వెస్ట్ జోన్ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సగ్వస్వల్లా (3/31), షమ్స్ ములానీ (2/37), శివమ్ దూబే (2/36), చింతన్ గజా (1/25), సేథ్ (1/38), పార్థ్ భట్ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్లో తొమ్మిదో నంబర్ ఆటగాడు టాప్ స్కోరర్గా (38) నిలవడం విశేషం. పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్ తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్ పాంచల్.. నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్-ఏ క్రికెట్లో ఇప్పటివరకు 87 మ్యాచ్లు ఆడిన పంచల్.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్జోన్పై 95 పరుగులు చేసిన పాంచల్ తన ఫామ్ను కొనసాగించాడు. -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్ను త్వరగా పెవిలియన్కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో అదరగొట్టిన టీమిండియా
జోహెన్నెస్బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడం ద్వారా 2021 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. జోహెన్నెస్బర్గ్ వేదికగా జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ విషయం పక్కనపెడితే జోహన్నెస్బర్గ్ హోటల్ రూంలో టీమిండియా ఆటగాళ్లు కొత్త సంవత్సర వేడుకలను ధూంధాంగా నిర్వహించుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, దీపక్ చహర్, ప్రియాంక్ పాంచల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కోహ్లి చివర్లో వచ్చి తనదైన శైలిలో క్రికెట్ ఫ్యాన్స్కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్ పాంచల్, అశ్విన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా జోహెన్నెస్బర్గ్లో గెలిచి ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. -
"ద్రవిడ్ సర్ నుంచి చాలా నేర్చుకున్నా... ఆయనే నా గురువు"
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ స్ధానంలో ప్రియాంక్ పాంచల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రియాంక్ పాంచల్ ప్రస్తుతం భారత-ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని పాంచల్ తెలిపాడు. 2019లో భారత-ఏ జట్టకు కెప్టెన్గా తానుని నియమించినప్పుడు చాలా సంతోష పడ్డాను,కానీ అంతే భయంగా ఉండేది అని అతడు తెలిపాడు. ఆ సమయంలో ద్రవిడ్ సర్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని పాంచల్ తెలిపాడు. "నేను భారత-ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యనప్పుడు చాలా సంతోషపడ్డాను. అదే విధంగా అంతే భయపడ్డాను. ఆ సయయంలో రాహుల్ సర్ నా దగ్గరకు వచ్చి నీవు ఏమి భయపడకు, మామాలుగా ఉండు. నీలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే కెప్టెన్సీ బాధ్యతలు నీకు ఇచ్చారు. నీవు నీ ఆలోచనల్లో మార్పుచేయవలసిన అవసరంలేదు. ఇన్నాళ్లూ దేశవాళీ క్రికెట్లో నీవు కెప్టెన్గా రాణించడానికి ఏ మార్గాలను అనుసరించావో అవే ఇక్కడ కూడా అనుసరించు అని ద్రవిడ్ సర్ నాకు సలహా ఇచ్చారు. అండర్-15 క్రికెట్ ఆడుతున్నప్పడు రాహుల్ సర్ని తొలిసారిగా నేషనల్ క్రికెట్ అకాడమీలో చూశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను అతనిని అనుసరిస్తున్నాను. భారత-ఏ జట్టుకు అతనితో కలిసి పనిచేయడం నా అదృష్టం. అతను ఏదైనా చెప్పినప్పుడు, నేను దానిని ఒక క్రికెటర్గా తక్షణమే ఫాలో అయ్యాను. భారత టెస్ట్ జట్టులో చోటు దక్కడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను" అని పంచల్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: టీమిండియాకు మరో షాక్.. వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి! ఎందుకంటే! -
Ind Vs SA: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్!
Who Is Priyank Panchal : దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న సమయంలో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ప్రియాంక్ పాంచల్ను టెస్టు సిరీస్కు ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా ప్రియాంక్ పాంచల్.. ఇటీవలి ‘ఎ’ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్గా వ్యవహరించాడు. గుజరాత్ ఓపెనర్గా సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ప్రియాంక్.. అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి టెస్టులో 96, రెండో టెస్టులో 24, 0 పరుగులు సాధించాడు. 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల అనుభవం... అహ్మదాబాద్కు చెందిన 31 ఏళ్ల ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్లో గుజరాత్ తరఫున సుదీర్ఘ కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 2008లో అరంగేట్రం చేసిన ప్రియాంక్ ఇప్పటివరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ప్రియాంక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... ఇటీవల దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన సిరీస్లో అతడు వరుసగా 96, 24, 0 పరుగులు సాధించాడు. 2016–17 సీజన్లో 1,310 పరుగులు చేసిన ప్రియాంక్... ఆ ఏడాది గుజరాత్ తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! View this post on Instagram A post shared by Priyank Panchal (@panchalpriyank) View this post on Instagram A post shared by Priyank Panchal (@panchalpriyank) -
రో‘హిట్ వికెట్’.. టెస్టు సిరీస్కు దూరం... బీసీసీఐ ప్రకటన
Rohit sustained a left hamstring injury: ఆస్ట్రేలియాలో రెండు వరుస టెస్టు సిరీస్ విజయాలు, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్లో ఆధిక్యం తర్వాత అద్భుత ఫామ్లో ఉన్న ప్రస్తుత జట్టుతో దక్షిణాఫ్రికానూ గెలవాలని భావించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆదివారం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ చేతికి స్వల్ప గాయం కావడంతో అదే కారణమని ముందుగా భావించారు. అయితే సమస్య అది కాదని, గతంలో ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తర్వాత తెలిసింది. రోహిత్ తప్పుకున్న విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2020 ఐపీఎల్లో ఇదే గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైన రోహిత్... ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల్లో చివరి రెండు మాత్రమే ఆడగలిగాడు. ఇప్పుడు అతని కెరీర్ కీలక దశలో అదే తొడ కండరాల గాయం మళ్లీ రోహిత్ను ఇబ్బంది పెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో ఇటీవలి ‘ఎ’ జట్టు పర్యటనలో భారత కెప్టెన్గా ఉన్న గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టూర్కు వెళ్లాల్సిన భారత జట్టు సభ్యులంతా సోమవారం ముంబైలో ప్రత్యేక ‘బయో బబుల్’లో చేరారు. చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్లకు స్టార్ ప్లేయర్ దూరం More details here - https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG — BCCI (@BCCI) December 13, 2021 -
దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడుతున్న భారత్..
Update: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. కాగా భారత్ ఇంకా 201 పరుగుల వెనుకంజలో ఉంది. India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి (25) విఫలమయ్యాడు. వర్షం కారణంగా గురువారం 60.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్ -
దక్షిణాఫ్రికాపై నిలకడగా ఆడుతున్న భారత్..
బ్లూమ్ఫొంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. పృథ్వీ షా (48) అవుట్ కాగా... ప్రియాంక్ పాంచల్ (45), అభిమన్యు ఈశ్వరన్ (27) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 343/3తో ఆట కొనసాగించిన సఫారీ జట్టు 509/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ పీటర్ మాలన్(163), టోని డి జోర్జి (117) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో నవ్దీప్ సైనీ, అర్జాన్ నాగ్వాస్వాల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
ఇండియా గ్రీన్ లక్ష్యం 474
లక్నో: దులీప్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో ఇండియా గ్రీన్ ముందు ఇండియా రెడ్ జట్టు 474 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు శనివారం ఆటలో ప్రియాంక్ పాంచల్ (133 నాటౌట్), దినేశ్ కార్తీక్ (100 నాటౌట్) అజేయ సెంచరీలు సాధించడంతో రెడ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 75 ఓవర్లలో రెండు వికెట్లకు 307 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో గ్రీన్పై 473 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్రీన్ 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. -
వీవీఎస్ రికార్డును బద్ధలు కొడతాడా?
ముంబై: ప్రియాంక్ పాంచల్.. ఈ రంజీ సీజన్లో మార్మోగుతున్న పేరు. పంజాబ్పై అజేయ ట్రిపుల్ కొట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గుజరాత్ తరపున ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు జార్ఖండ్తో జరిగిన సెమీ ఫైనల్లో పాంచల్(149) టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే క్రమంలో గుజరాత్ చిరస్మణీయ విజయంలో పాలు పంచుకున్నాడు. ఈ రంజీ సీజన్ ఆరంభం నుంచి తనదైన మార్కును చాటుకుంటూ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో 1270 పరుగుల సాధించి అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇప్పుడు పాంచల్ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. మరో 146 పరుగులను పాంచల్ సాధిస్తే, మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ గతంలో నెలకొల్పిన రికార్డు బద్ధలవుతుంది. రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ వీవీఎస్ పేరిటే ఉంది. 1999 సీజన్లో లక్ష్మణ్ 1415 పరుగుల్ని సాధించాడు. ఇదే నేటి వరకూ రంజీ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ అవకాశం పాంచల్ ముంగిట ఉంది. మంగళవారం నుంచి ముంబైతో జరిగే రంజీ ఫైనల్లో పాంచల్ రాణించిన పక్షంలో లక్ష్మణ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.