breaking news
photo graphy
-
కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ
ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్ వర్క్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియా పాత్ర.. ఫొటోగ్రఫీకి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్ట్యాగ్’తో పోస్ట్ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్బుక్లో షేర్ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్తో ప్రోత్సహిస్తారు. ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన స్నేహితుల సర్కిల్లో హైలైట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్వర్కింగ్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటి అవకాశాలు పొందుతు న్నారు. జన్–జీ స్టైల్ అండ్ క్రియేటివిటీ.. ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్ క్యాప్షన్స్ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించారు. లైఫ్ స్టైల్ యాప్స్ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్ స్కిల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్ స్టైల్ కూడా ఫ్రేమ్లో బంధీ అయ్యాయి. (చదవండి: లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..) -
ఫోటోగ్రఫీతో సత్తా చాటుతున్న వనితలు..!
కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది. డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది. (చదవండి: అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..! సర్వేలో షాకింగ్ విషయాలు..) -
Pic of The Day: ‘క్లిక్’ కొట్టామంటే కిర్రాక్ ఉండాలే!
ఇప్పుడంటే ప్రతి స్మార్ట్ఫోన్(Smart Phone) ఓ కెమెరా..గురిపెట్టామా... క్లిక్ అనిపించామా... ఫొటో రెడీ. కానీ...వాస్తవానికి ఫొటోగ్రఫీ(Photography) అంత ఈజీ ఏమీ కాదు..సరైన కెమెరా.. సెట్టింగ్లపై అవగాహన.. లైటింగ్.. టైమింగ్..ఇలా బోలెడన్ని విషయాలను అర్థం చేసుకుని మరీ క్లిక్ అనిపించాలి!కావాలంటే.. ఎనజేటర్ పేరుతో ఎక్స్పై వచ్చిన ఈ ట్వీట్ చూడండి! అత్యద్భుతమైన ఫొటోగ్రఫీకి కొన్ని మచ్చుతునకలు కనిపిస్తాయి!This is photography at it’s finest. rate all from 1-10! pic.twitter.com/rTHuZjGmUo— Enezator (@Enezator) January 6, 2025 -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం (ఫొటోలు)
-
శారీలో మెస్మరైజ్ చేస్తున్న రింకూ రాజ్గురు... ఆకట్టుకుంటున్న (ఫొటోలు)
-
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
ఖాదీ వాక్.. కిర్రాక్స్
-
2021- ఈ ఏడాది ఉత్తమ ఫోటోలు ఇవే..
-
49వ వారం మేటి చిత్రాలు
-
48వ వారం మేటి చిత్రాలు
-
47వ వారం మేటి చిత్రాలు
-
46వ వారం మేటి చిత్రాలు
-
35వ వారం మేటి చిత్రాలు
-
34వ వారం మేటి చిత్రాలు
-
హృదయరాగం
ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పుడు, నాట్యానికి ప్రత్యేకంగా రంగస్థలం ఎందుకు? అనుకున్నాడేమో న్యూయార్క్కు చెందిన డేన్ షిటగి. వివిధ దేశాల్లో, వివిధ భౌగోళిక సౌందర్యాల నేపథ్యంలో బ్యాలే డ్యాన్సర్ల నృత్య విన్యాసాలను తన కెమెరాలోకి అందంగా తీసుకువచ్చాడు. ఈ పని ఆయన పన్నెండు సంవత్సరాలుగా చాలా ఆసక్తితో చేస్తున్నాడు. రంగస్థలం మీద కనిపించని నృత్యాలకు కొత్త వెలుగు ఇస్తున్నాడు. ‘‘నృత్యం అంటేనే అందం...ఆ అందానికి మరింత అందాన్ని జోడించడానికి బాహ్యప్రపంచ అందాలను వాడుకుంటున్నాను’’ అంటున్నాడు డేన్ షిటగి. తీసిన ఒక్కో ఫొటో.... డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫొటోగ్రఫీల సమ్మేళనం అని గర్వంగా చెబుతాడు. తన ఫోటోల్లో నృత్యకారుల భావోద్వేగాలు కనిపిస్తాయనీ, హృదయరాగాలు వినిపిస్తాయనీ అంటాడు ప్రేమగా. ప్రసిద్ధ నర్తకులతో పాటు, ఒకప్పటి నర్తకులు, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నర్తకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాడు షిటగి. విశేషం ఏమిటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా షిటగి... పాతకాలపు ఫిల్మ్, కెమెరాలను వినియోగించడం! -
ఇళయరాజా ఫొటో ఎగ్జిబిషన్
‘నా ఫొటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ అంటూ ఇళయరాజా ఓ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సంగీతస్రష్టకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే, కంటికి నచ్చినవాటిని తన కెమెరాలో బంధిస్తుంటారు. ఇప్పటివరకు ఐదువేల ఫొటోలకు పైగా తీశారు ఇళయరాజా. కానీ, ఇంతకుముందు తీసినట్లుగా ఇప్పుడు ఫొటోగ్రఫీ మీద ఆయనకు ఆసక్తి లేదు. ఎందుకంటే, ఫిల్మ్రోల్లో తీసిన ఫొటోలతో పోలిస్తే డిజిటల్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో అంత డెప్త్ ఉండటంలేదని ఆయన అంటున్నారు. డిజిటల్ని ఆవిష్కరించడం ద్వారా ఓ అద్భుతాన్ని నాశనం చేసినట్లుగా ఆయన భావిస్తున్నారు. 1978లో ఇళయరాజా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ప్రకృతి అందాలను ఫొటో తీయడం ఆయనకు చాలా ఇష్టం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటారు. తన ఫొటోల్లో ‘జీవం’ ఉంటుందని ఆయన అంటున్నారు. ఓసారి బెంగళూరులో ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే ఫొటో తీశారట ఇళయరాజా. ఆ పాప ఏడుస్తున్న దృశ్యం తనను కదిలించడంవల్లే కెమెరాని క్లిక్మనిపించానని పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్తోపాటు ఇతర నగరాల్లోనూ, దుబాయ్, సింగపూర్, లండన్లోనూ తను తీసిన ఛాయాచిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇప్పటివరకు ఎన్నో కెమెరాలను కొనుక్కున్నారు ఇళయరాజా. వాటిని చాలా పదిలంగా దాచుకున్నారట. దాన్నిబట్టి ఈ స్వరమాంత్రికుడికి ఫొటోగ్రఫీ అంటే ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు.