-
శశి సోనీ ఎవరు? పద్మశ్రీ ఎందుకు వరించింది?
‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్లోని లాహోర్లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు. దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్పర్సన్గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్ఎంఓ లిమిటెడ్.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది. శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. -
ఐశ్వర్య రాయ్ బర్త్డే @ 50.. ఆమె పేరుతో ఫ్లవర్.. కోట్లల్లో సంపద
ఆమె అందాల రాశి, నీలి కళ్ల సుందరి, ప్రపంచ సుందరి ఇలా ఎన్నో ఐశ్వర్య రాయ్ బచ్చన్కు ఉన్న ట్యాగ్లైన్స్.. నేడు ఆమె పుట్టినరోజు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం. మిస్ వరల్డ్ కిరీటం కూడా ఆమె ధరించాకే దానికి విలువ పెరిగిందా అనేలా ఆమె సోయగం ఉంటుంది. అలా ఒక నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు. నేడు నవంబర్ 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... ఐష్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. ఆమె కాలేజీలో చదువుకునేప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు)తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య. సల్మాన్తో గొడవ.. అభిషేక్ బచ్చన్తో పెళ్లి అలా బాలీవుడ్లో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది. అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఐశ్వర్య నటించింది. 1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయానని వివరించారు ఆమె. ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వారు నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పుట్టుకతో హిందువైన ఐశ్వర్యకు సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి ఎక్కువ. 16 నవంబరు 2011న వీరికి ఒక పాప జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు. 50వ పుట్టినరోజు ఈ సందర్భంలో, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. స్క్రీన్ స్టార్ల అభిమానులుగా అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సమయంలో మిస్ వరల్డ్గా కీర్తించబడుతున్న ఐశ్వర్యరాయ్ ఆస్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా వెలుగొందుతున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ నికర విలువ రూ. 776 కోట్లుగా అంచనా వేయబడింది. ఆమె భారతీయ సినిమాలో అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా గుర్తించపడ్డారు. ముంబైలోని రూ. 112 కోట్ల విలువైన బంగ్లాలో తన కుటుంబంతో ఆమె కలిసి నివసిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్ల నుంచి 12 కోట్లు తీసుకుంటుందని ప్రచారం ఉంది. ప్రకటనల కోసం అయితే సుమారు రూ. 6 కోట్ల రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఐశ్వర్య రాయ్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం ► డాక్టర్ కావాలని యాక్టర్ అయిన ఐశ్వర్య.. కాలేజీ రోజుల్లో ఆమె పెప్సీ యాడ్ చేసింది. దీంతో వచ్చిన గుర్తింపుతో మోడలింగ్ వైపు వెళ్లింది ► 1994లో ఐష్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్ 'మిస్ యూనివర్స్'గా నిలిచింది. ► ఐశ్వర్యకు భారత్లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఈమె నటించిన 'జోధా అక్బర్' చిత్రంలో ఆమె లుక్ ఆధారంగా బార్బీ బొమ్మలను తయారు చేశారు. ► నెదర్లాండ్స్లోని క్యూకెనోఫ్ గార్డెన్లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు. ► సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం..ఆయనకు అభిమాని ఐశ్వర్య ► 2009లో భారత ప్రభుత్వం 'పద్మ శ్రీ' అవార్డుతో ఐశ్వర్యను సత్కరించింది ► 2012లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం 'ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్' పురస్కారాన్ని అందించింది. ► 2003లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా ఐష్ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి ఆమెనే ► 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్లను నిర్మించాడు!
ఎన్నో మారు మూల ప్రాంతాలను నగరాలతో అనుసంధానమయ్యేలా చేశాడు. స్కూళ్లకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది ఉండే మారూమూల ప్రాంతాలకు అతను వారధిగా నిలిచాడు. వందలకొద్ది వంతెనలను అలవోకగా నిర్మించాడు. ఒక్క రూపాయి ఆశించకుండా, ఎలాంటి సాయం తీసుకోకుండా ఉచితంగా నిర్మించాడు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ సమాజా సేవ అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. అతడే బ్రిడ్జ్మ్యాన్గా పిలిచే గిరీష్ భరద్వాజ్ భరద్వాజ్ కర్ణాటకకు చెందిన ఇంజనీర్. నదులు, వాగుల వద్ద ఉండే మారుమూల గ్రామాలను నగరాలతో కనెక్టవిటీ అయ్యేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఆయా గ్రామాల్లో ఉండే విద్యార్థులు, ప్రజలు సీటీకి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటేల్సింది. నిత్యం వారికది సాహస క్రీడగా మారింది. దీన్ని చూసి చలించిపోయిన భరద్వాజ్ ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జ్లు నిర్మిస్తే వారి సమస్య తీరుతుందని భావించి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా.. సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆయనే స్వయంగా నిర్మించేందుకు పూనుకోవాలనే ధృఢ నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం తక్కువ ఖర్చుతో నిర్మించి బ్రిడ్జిల కోసం అన్వేషించాడు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం స్టీల్ కేబుల్స్ ఎంచుకుని వేలాడే బ్రిడ్జ్లను నిర్మించాలనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అలా మొత్తం వివిధ ప్రాంతాల్లో సుమారు 128 బ్రిడ్జ్లు అలవోకగా నిర్మించాడు. మొదటగా కావేరి నదిపై కుశాల్నగర్ సమీపంలోని నిసర్గధామ ద్వీపాన్ని కర్ణాటక ప్రధాన భూభాగన్ని కలిపేలా 55 మీటర్ల బ్రిడ్జ్తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అలా అతను తక్కువ ఖర్చుతో బ్రిడ్జ్లు నిర్మించిన వ్యక్తిగా ఘనత సాధించడమే గాక ఇలా ఎన్నో మారుమూల ప్రాంతాలను నగరాలతో కనెక్ట్ అయ్యేలా చేసి 'బ్రిడ్జ్మ్యాన్ ఆప్ ఇండియాగా పేరుగాంచాడు. ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం పద్శశ్రీతో సత్కరించింది. భరద్వాజ్ ఓ కార్యక్రమంలో మట్లాడుతూ..నేను చాలా విస్తృతంగా పనిచేశాను. దురదృష్టమేమిటంటే ప్రతిభావంతులైన చాలా మంది గుర్తించబడటం లేదు. 1980 దశకంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయతతో తిరిగి సమాజంలోని జనజీవన స్రవంతిలోకి తీసుకురావచ్చు. అందుకు కావల్సిందల్లా మానవత్వం, ప్రేమ ఉంటే చాలని చెప్పారు. ఇక ఆయన జీవితం ఆధారంగా కన్నడ నిర్మాత సంతోష్ కోడెంకేరి ది బ్రిడ్జ్మ్యాన్ అనే బయోపిక్ను రూపొందిస్తున్నారు. దీనిని కన్నడలో నిర్మించి హిందీలో కూడా విడుదల చేయనుండటం గమనార్హం. (చదవండి: 20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి కట్టిన గుడి !) -
‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్ యాదవ్తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్ డి.పటేల్కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది. పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం), ఇండో–అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ పద్మభూషణ్ చినజీయర్ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం), ఎస్ఎల్ భైరప్ప (కళ), దీపక్ధర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సుమన్ కల్యాణ్పుర్ (కళ), కపిల్ కపూర్ (సాహిత్యం–విద్య) పద్మశ్రీ ఏపీ నుంచి: సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), గణేశ్ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం–విద్య). తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య). పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్ఝున్వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్ తదితరులున్నారు. -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
వాహన తనిఖీలు ముమ్మరం
బోనులో చిక్కిన చిరుత
పప్పు ప్రధాని అయితే దేశాన్ని అమ్మేస్తాడు
బాబొస్తే ఇంగ్లిష్ మీడియం రద్దే..!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement