-
మరో రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’.. కాంగ్రెస్లో గుబులు
మహారాష్ట్రలో మహా అఘాడీ సంకీర్ణ సర్కారును కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేసినట్టు కనబడుతోంది. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది. కాంగ్రెస్ అలర్ట్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో సోరేన్ సర్కారుకు ఎసరు పెట్టుందుకు కమలనాథులు సిద్ధమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోరేన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తికాలం కొనసాగుతుందని ఏఐసీసీ రాష్ట్ర బాధ్యుడు అవినాష్ పాండే భరోసాయిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వాములైన వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని, సరైన సమయంలో కుట్రదారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఫిరాయింపుదారులకు వార్నింగ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నకాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు.. సోరేన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠినవైఖరి అవలంభించాలని నిర్ణయించింది. అందుకే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ వేటు చేసి ఫిరాయింపుదారులకు గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాదు జార్ఖండ్ కాంగ్రెస్ విభాగం 18 జిల్లాల్లో ఆందోళనలు కూడా చేపట్టింది. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో శాసనసభ్యుడు బెంగాల్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది రెండోసారి.. నాకేం తెలియదు హేమంత్ సోరేన్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది రెండోసారని అవినాష్ పాండే తెలిపారు. ప్రస్తుత కుట్ర వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు. సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను ప్రయత్నించడం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. 22 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగినందున ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, సీనియర్ నేతలు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనపై కాంగ్రెస్ ఎందుకు కేసు పెట్టిందో తెలియదన్నారు. హిమంత ప్రోద్బలంతోనే.. సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హిమంత బిశ్వ శర్మ ప్రోద్బలంతో తనకు 10 కోట్ల రూపాయలు, కొత్త ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఆశచూపారని ఆరోపిస్తూ బెర్మో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జయమంగళ్.. రాంచిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కారులో డబ్బు పట్టుబడిన తర్వాతే ఎందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నకు జయమంగళ్ వద్ద సమాధానం లేదు. మరోవైపు సీఎం సోరేన్ మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికార పక్షంలో గుబులు మొదలైంది. (క్లిక్: రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్) -
టార్గెట్ సిట్టింగ్స్: ఓ ఎంపీ.. 10 మంది ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు కీలక నేతలతో సంప్రదింపుల కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థి బీజేపీనే అని చాటి చెప్పడంతో పాటు.. పార్టీలో చేరే నేతలకు అన్నివిధాలా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్లో అసంతృప్తి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తాము టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బహిర్గతం అవుతోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులను సైతం చేర్చుకునేలా బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేరిక ఇప్పటికే ఖాయమైందని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం. కాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కీలక దశలో చర్చలు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈటల బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు వేగం పుంజుకున్నాయి. జిల్లాల వారీగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించడంతో పాటు వారు బీజేపీలో చేరేలా చర్చలు సాగుతున్నాయి. ఇతరత్రా హామీలతో పాటు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వచ్చే నెలలో పార్టీలో చేరతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన చేరిక నల్లగొండ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని, మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి రావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు, కీలక నాయకులు ఎంతోమంది ఉన్నారని.. ప్రస్తుతానికి ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలతో, పాటు బలమైన నాయకులతో చర్చల ప్రక్రియ కీలక దశలో ఉన్నట్టు బీజేపీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. భరోసా ఇస్తున్న బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరికలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని, పార్టీలోకి వచ్చే ప్రజాప్రతినిధులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాపులారిటీని కూడా గమనంలోకి తీసుకుంటున్నట్లు బీజేపీ నేత తెలిపారు. అసంతృప్తితో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కొందరు శాసనసభ్యులు.. ఇప్పటికిప్పుడు బయటకు వస్తే అనవసర వేధింపులు, కేసులు కొనసాగుతాయని, నియోజక వర్గాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా ఆపేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అలాంటి భయాలు అక్కర్లేదని భరోసా కల్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పలువురు ముఖ్య నేతలు రెడీ! ఖమ్మం నుంచి మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఆయన రావడంతో ఆ జిల్లాలో బీజేపీకి బలం గణనీయంగా పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈటల అధ్యక్షతన ఏర్పాటైన చేరికల కమిటీ నాయకుడొకరు వ్యక్తం చేశారు. అదే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని కూడా చేర్చుకునే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలిసింది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఓ మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన తేజవత్ రామచంద్రు పార్టీలో చేరతారని అంటున్నారు. అదే విధంగా ఆ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉందని సమాచారం. ట్రాన్స్పోర్టు వ్యాపారంలో ఉన్న ఓ వ్యాపారవేత్త బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరికి కీలక పదవి కట్టబెట్టి పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై బీజేపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీలోకి వస్తారని అంటున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్లో మళ్లీ ఆపరేషన్ కమలం ?
భోపాల్: మధ్యప్రదేశ్లో మళ్లీ రాజకీయ డ్రామాకి తెరలేచింది. అధికార కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి రాత్రి కనిపించకపోవడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్ కమలంకుట్రలో ఇది భాగమని కాంగ్రెస్ ఆరోపించింది. కమల్నాథ్ సర్కార్ని కూల్చడానికి కుట్ర పన్నిన బీజేపీ అధికార కూటమికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హరియాణాకు తరలించి ఒక లగ్జరీ హోటల్లో ఉంచినట్టుగా రాష్ట్ర మంత్రి జితు పత్వారీ ఆరోపించారు. సీనియర్ బీజేపీ నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర సింగ్ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హరియాణాకు తీసుకువెళ్లారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే తనతో చెప్పారని అన్నారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారైతే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ఈ ఆరోపణల్ని బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, ఏంచేస్తున్నారో తమకు తెలీదని అన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలలో నలుగురు బుధవారం తిరిగి వచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోట్తో కలిసి కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వ్యాపమ్ స్కామ్ను బట్టబయలు చేసిన డాక్టర్ ఆనంద్రాయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలకి కొత్త కేబినెట్లో మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా తనతో మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే అది మార్ఫింగ్ వీడియో అని మిశ్రా స్పష్టం చేశారు. మాకు మెజార్టీ ఉంది: కమల్నాథ్ తన సర్కార్కు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్నాథ్ అన్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడం దారుణమని ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నాటకాలు ఆడుతోందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్ ఆరోపించారు. మార్చి 26న జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు విప్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
పట్టు దిశగా కమలం అడుగులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పట్టు సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఊపుమీదున్న కమలదళం.. ఆపరేషన్ ఆకర్ష్ను పకడ్బదీంగా అమలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైనే బీజేపీ గురి పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.టీఆర్ఎస్కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో షకీల్ అమేర్ అర్వింద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్మూర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకురాలు ఏలేటీ అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అనుచరులు బీజేపీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈనెలాఖరులో గానీ, వచ్చేనెలలో గానీ ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డితో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్ వంటి నాయకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినాయత్వం ప్రయత్నిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలే కాకుండా, మండల స్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని యోచిస్తోంది. ఇటీవల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అనుచరవర్గం దాదాపు మొత్తం కాషాయ కండువా కప్పుకుంది. అలాగే ఆర్మూర్ వంటి నియోజకవర్గంలోనూ వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలకు బీజేపీ వలవేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్ను పెంచుకోవడం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది. -
కమలదళం వలస బలం!
రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. భారీగా బలగాన్ని సమకూర్చుకొనే పనిని చాప కింద నీరులా చేసుకుపోతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీని ఖాళీ చేయించిన బీజేపీ.. అడపాదడపా కాంగ్రెస్ నేతలను ఆకర్షించడమే కాక ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను రాజకీయ వర్గాల్లోకి పంపాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్ : అటు ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ, ఇటు ఆపరేషన్ ఆకర్ష్ను ఏక కాలంలో అమలు చేయడం ద్వారా రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో బలీయమైన రాజకీయ శక్తిగా అవ తరించాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపి స్తోంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్తో అధికార పార్టీలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ప్రారంభించిన ఆ పార్టీ... రాష్ట్ర ప్రభుత్వం పైనా పోరాటాలకు సిద్ధమవు తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు కూడా రాష్ట్ర బీజేపీలో ఇమడలేకపోతున్నా రనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చే నాయకులను ఏ మేరకు కలుపుకొనిపోతారు... ఎంతకాలం వారు పార్టీలో ఉండగలుగుతారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. లోక్సభ ఎన్నికల నుంచే.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దూకు డుగా వ్యవహరించలేకపోయిన తెలంగాణ బీజేపీ... లోక్సభ ఎన్నికల సమయంలో వ్యూహాలను అమల్లోకి తెచ్చింది. బలమైన అభ్యర్థులను దింప డం, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మరో చోట పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును సమకూర్చుకుంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టడంతో అదే ఊపును కొనసాగిస్తూ గత ఆరేడు నెలలుగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమున్న రాష్ట్రమన్న అంచనాతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వ్యూహాలకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర శాఖ పక్కా కార్యాచరణతో ఇప్పటికే అనేక మంది నేతలను కమలదళంలో చేర్చుకోవడంలో సఫలీకృతమైంది. టీ టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడంతోపాటు కాంగ్రెస్కు చెందిన కొందరు నియోజకవర్గ స్థాయి నేతలను కూడా అక్కున చేర్చుకుంది. ఆ రెండు పార్టీల్లో ఇంకా వీలైనంత మందిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలను కొనసాగిస్తూనే అధికార టీఆర్ఎస్లోని అసంతృప్తిని కూడా సొమ్ము చేసుకొని రాజకీయంగా ఎదిగే వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. షకీల్తో ‘షురూ’? అధికార టీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని, త్వరలోనే వారు అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరతారని 4–5 రోజుల నుంచి సోషల్ మీడి యాలో ప్రచారం జరుగు తోంది. ఈ ప్రచారానికి తగ్గట్లు గానే గురువారం బోధన్ ఎమ్మెల్యే ఫకీల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ల భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృ ప్తితో ఉన్న షకీల్ బోధన్ లాంటి సమస్యాత్మక నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బీజేపీ నేతతో భేటీ కావడం, అన్ని విషయాలను సోమవారం వెల్లడిస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో షకీల్ బీజేపీలో చేరడం లాంఛనమేనని, షకీల్తోపాటు మరికొందరు ఎమ్మె ల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా టచ్లో ఉన్నా రని బీజేపీ వర్గాలంటున్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా ఢిల్లీ నేతలే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఐదుగురు ఎమ్మె ల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని కమలనాథులంటు న్నారు. వారంతా అమిత్ షా సమ క్షంలో పార్టీలోకి వస్తారని చెబుతున్నారు. వారితో పాటు కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలను కూడా పార్టీలో చేర్చుకునే ప్రణాళికలు... ఢిల్లీ నుంచే అమలు జరుగుతుండ టంతో త్వరలోనే తమకు మరింత బలం సమకూరు తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలని ఇప్పటికే జాతీయ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమతో మాట్లాడుతున్నారని, 2022కల్లా రాష్ట్రంలో పేరున్న రాజకీయ నాయకులకు తమ పార్టీ చిరునామాగా మారబోతోందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం ఆ పార్టీ వ్యూహాన్ని తెలియజేస్తోంది. త్వరలోనే ‘పాదయాత్ర’! ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతోపాటు ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలన్న కోణంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడతారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఇది టానిక్గా ఉపయోగపడుతుందని బీజేపీ శిబిరం అంటోంది. అందులో భాగంగానే ఈ నెల 17న విమోచన దినోత్సవానికి అమిత్ షాను రప్పించాలని రాష్ట్ర నాయకులు ఇప్పటికే జాతీయ పార్టీకి ప్రతిపాదనలు కూడా పంపారు. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తేనే పార్టీలో చేరికలుంటాయనే అంచనాలో ఉన్న కమలనాథులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా పావులు కదుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎలాగూ తమకు సానుకూలత ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని, తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలు ఉండగలుగుతారా...? ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే వలస నేతలను బీజేపీలో కలుపుకొని పోరనే అభిప్రాయం ఉంది. నాగం జనార్దన్రెడ్డి లాంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చర్చిస్తుంటాయి. మొదటి నుంచీ బీజేపీలో ఉన్న నేతలే పాతుకుపోయారని, పార్టీ, ప్రభుత్వంలో పదవులు కూడా వారికే వస్తాయనే అపవాదు కూడా ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన డి.కె. అరుణ లేదా ఇతర నేతలకు ఇన్నాళ్లయినా ఎలాంటి అవకాశం కల్పించలేదని, అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిన వారికైనా ఏదో ఒక పదవి లేదా హోదా ఇచ్చి ఉంటే వలస నేతలకు భరోసా ఉండేదనే అభిప్రాయం అంతర్గతంగా బీజేపీలోనూ వ్యక్తమవుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement