-
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..? -
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై హెచ్చరించారు. ‘అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్ చేయాలి. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు ట్రంప్. అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు స్పందించటం సంచలనంగా మారింది. క్యూబన్ మిసైల్స్తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Russia Ukraine War: పుతిన్ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
‘అణు’ పల్లవి!
కొన్ని మొదలుపెట్టడం సులభమే. ముగించడమే కష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఇప్పుడు ఆ సంగతి బాగా తెలిసొచ్చినట్టుంది. సరిగ్గా 7 నెలల క్రితం ఫిబ్రవరి 24న లక్షన్నర పైగా సైనికులతో, వివిధ మార్గాల ద్వారా ఉక్రెయిన్పై ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’కు సిద్ధమైనప్పుడు ఆ దేశాన్ని లొంగ దీసుకోవడం ఆయన సులభమనుకున్నారు. తీరా అమెరికా, ఐరోపాల ఆర్థిక, సైనిక అండదండలతో ఉక్రెయిన్ ఎదురుదెబ్బకి దిగేసరికి పీటముడి పడింది. పాశ్చాత్యలోకం నుంచి ముప్పు ఉందంటూ, 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణకు సిద్ధమవుతున్నట్టు బుధవారం పుతిన్ చేసిన ప్రకటన మొదట అనుకున్న వ్యూహం విఫలమైందనడానికి స్పష్టమైన సంకేతం. జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ, అణుదాడులకు సిద్ధమన్న ఆయన మాట ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఇవి ఉత్తుత్తి మాటలు కావనడంతో ఆయన బెదిరింపు ధోరణి బాధ్యతారహితమనీ, ఐరాస నిబంధనావళికి విరుద్ధమనీ అమెరికా అధ్యక్షుడు ఖండించాల్సి వచ్చింది. వెరసి, అంతులేని కథగా సాగుతున్న ఉక్రెయిన్ అంశం మళ్ళీ ఒక్కసారిగా అందరిలో వేడి పెంచింది. అణ్వస్త్ర దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాతో పాటు రష్యా ఒకటి. అణుయుద్ధం చేయరాదంటూ ఈ జనవరి 3న రష్యా సహా ఆ దేశాలన్నీ సమష్టి ప్రకటన చేశాయి. ఆ తర్వాతే ఉక్రె యిన్పై పుతిన్ ఆకస్మిక దాడి ఆరంభించారు. సమయానికి తగ్గట్టు మాటలు, చేష్టలు మార్చేయడం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్న ఈ మాజీ రష్యన్ గూఢ చారికి మంచినీళ్ళ ప్రాయం. ఉక్రెయిన్లో తాము పట్టు బిగించిన తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి నిలపడానికి ఆ మధ్య కీవ్, ఖార్కివ్ల నుంచి రష్యా సేనల్ని ఉపసంహరించుకున్నారు. తీరా ఈ నెల మొదట్లో ఉక్రెయిన్ మెరుపుదాడితో ఈశాన్యంలో దెబ్బతిని, సైన్యం తిరోగమించింది. ప్రతీకారంతో రగిలిపోతున్న పుతిన్ ‘అణు’పల్లవి అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలి సారి సైనిక సమీకరణకూ దిగారు. అదేమంటే సోవియట్లా రష్యా విచ్ఛిత్తికీ కుట్ర జరుగుతోందన్నారు. ఒక పక్క ఇలా సమరం చేస్తూనే, మరోపక్క ఉక్రెయిన్లో తమ స్వాధీనంలోకి వచ్చిన కీలక ప్రాంతాల్లో రష్యన్ సమాఖ్యలో చేరికపై ప్రజాభిప్రాయ సేకరణలు జరిపించాలని పుతిన్ ప్రయత్నం. ఆ కంటితుడుపు రిఫరెండమ్ల వెనుక ఉద్దేశం, వచ్చే ఫలితం ఇట్టే ఊహించవచ్చు. వాటిని అడ్డుపెట్టు కొని, ఉక్రెయిన్లో పట్టుబిగించిన ప్రాంతాలను కలిపేసుకొని ముందరికాళ్ళకు బంధం వేయాలని రష్యా వ్యూహం. గురువారం ఐరాస భద్రతామండలి సైతం రిఫరెండం ప్రతిపాదనల్ని ఖండిస్తూ, కనుచూపు మేరలో యుద్ధానికి ముగింపు కనపడకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, యుద్ధభూమిలో ఎక్కడ, ఎవరిది, ఎంత పైచేయి అన్నది పక్కనపెడితే ఉక్రెయిన్కు సైతం భరించ లేని ఉక్కపోత ఉంది. అమెరికా, ఐరోపా దేశాల అండ చూసుకొని బరిలో నిలిచిన ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీకి సైతం ఇప్పుడు తగిలిన దెబ్బలతో తత్త్వం తలకెక్కుతోంది. బుధవారం ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం పంచసూత్రాలు పాటించాలని ఆయన అభ్యర్థించడం అందుకు తాజా ఉదాహరణ. ఉక్రెయిన్ బాధ... ప్రపంచపు బాధగా భావించాలనేదే ఇప్పటికీ జెలెన్స్కీ ధోరణి. చిత్రం ఏమిటంటే, ఆంక్షల వల్ల రష్యాపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ, పాశ్చాత్య ప్రపంచం మాత్రం అదే మంత్రాన్ని నమ్ముకున్నట్టుంది. తాజాగా 8వ విడత ఆంక్షలను రష్యాపై విధించింది. నిజానికి, పలు పాశ్చాత్య ఆహార, వస్తూత్పత్తి బ్రాండ్లు తమ భూభాగాన్ని వీడినా, రష్యా సొంత బ్రాండ్లు సృష్టించుకుంటోంది. చైనా నుంచి సరకుల సరఫరా సాగుతుండడంతో ఆ విధమైన నొప్పి కూడా తెలియడం లేదు. రష్యా నుంచి గ్యాస్ సరఫరాకు ఆంక్షలు పెట్టి, పాశ్చాత్య ప్రపంచమే ఇరు కున పడింది. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే రష్యాలోనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. నిజానికి, రష్యా గడపలోకొచ్చి ‘నాటో’ రెచ్చగొట్టడం వల్లే పుతిన్ దూకుడు చూపారు. కానీ, అరకొర వ్యూహం, అతిగా బలాన్ని అంచనా వేసుకోవడంతో తంటా వచ్చింది. ‘నాటో’కు ముకుతాడు వేయాలన్న వ్యూహం ఫలించకపోగా, బలహీనపడుతున్న కూటమి ఫిన్లాండ్, స్వీడన్ లాంటి కొత్త చేరికలతో బలం పుంజుకుంది. లేని ప్రాసంగికతను సమకూర్చుకుంది. ఇది పుతిన్ వ్యూహాత్మక తప్పిదమే! పరిమిత యుద్ధంతో సైనిక లక్ష్యాలు సాధించాలని మొదలుపెట్టిన పుతిన్ వెనక్కి రాలేనంత దూరం వెళ్ళారు. ఈ ప్రక్రియలో తడబడి కిందపడ్డా, తనదే పైచేయిగా చూపాలని తాపత్రయపడు తున్నారు. నిన్నటి దాకా ‘నిస్సైనికీకరణ’ అన్న రష్యా ఇప్పుడు సమష్టి పాశ్చాత్య ప్రపంచంపై యుద్ధం అంటోంది. అతివాద జాతీయతతో పుతిన్ రేపిన ఈ యుద్ధం రష్యా యుద్ధమనే రంగు అద్దుకుంది. కానీ, ఇప్పటికే వేల సంఖ్యలో సైనికుల్ని కోల్పోయిన రష్యాలో తాజా సైనిక సమీకరణ యత్నంపై వందల మంది నిరసనకు దిగారు. మొదట నల్లేరుపై బండి నడక అనుకున్న ఉక్రెయిన్పై విజయం ఇప్పుడు పుతిన్కు ముగింపు తెలియని పీడకలగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ గాయపడ్డ పులి ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందో? ఐరాసను ఆడిస్తున్న పాశ్చాత్య ప్రపంచం సైతం భేషజాలతో అగ్నికి ఆజ్యం పోసే కన్నా, సామరస్య పరిష్కారానికి కృషి చేస్తే మేలు. ఇటీవల సమర్కండ్లో పుతిన్ను కలిసినప్పుడు భారత ప్రధాని చెప్పినట్టు ప్రపంచంలో ‘‘సమరానికి ఇది సమయం కాదు.’’ కరోనా అనంతర క్లిష్టపరిస్థితుల్లో కావాల్సింది శాంతి, సామరస్యం, సౌభాగ్యాలే!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement