-
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్లో ప్రకటించనుంది. -
నోబెల్ పురస్కారానికి మోదీ నామినెట్..!
సాక్షి, చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆవిష్కరించిన మోదీకి నోబెల్ ఇవ్వాలని.. ఆ మేరకు ఆయన పేరును నోబెల్ కమిటీకి ఆమె నామినెట్ చేశారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని కోరారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం రాంచీలో అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ ప్రచారం చేస్తోంది. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేర్చనున్నారు. -
పాకిస్తాన్ ప్రధానినవుతా!
దావోస్: ఓ బాలిక తనకు రాసిని ఉత్తరంలో భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ గుర్తు చేసుకుంది. బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా త్వరలోనే భారత పర్యటనకు వస్తానని ప్రకటించింది. 15 ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్లో బాలిక విద్య కోసం పోరాడుతున్న క్రమంలో ఆమెపై ఉగ్రమూకలు హత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ వేదికగా బాలికల సమస్యలపై పోరాడుతోంది. గుల్మకాయ్ పేరుతో సంస్థను స్థాపించి బాలిక విద్య కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులోభాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లోనూ పాల్గొంది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి గ్రహీత మీడియాతో మాట్లాడింది. తన సంస్థ గుల్మకాయ్ విస్తరణ కోసం ఇండియాలో పర్యటించాలని అనుకుంటున్నానని మలాలా వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు ఉత్తరాలు రాసి తన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారిచ్చే ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేమని కొనియాడింది. పాకిస్తాన్ ప్రధానినవుతా! తనకు భారత్ అంటే చాలా ఇష్టమని మలాలా చెప్పింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని తెలిపింది. తనకు ఉత్తరం రాసిన ఓ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని గుర్తు చేసుకుంది. ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని చెప్పింది. నేటి బాలికల ఉన్నత ఆశయాలకు ఈ ఉత్తరమే నిదర్శనమని ప్రశంసించింది. తాను కూడా పాకిస్తాన్కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాలోని బాలికల కోసం కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘‘భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువద్దు. కేవలం వారికి విద్యనందిస్తే సరిపోదు, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని సూచించింది. -
ధైర్యానికి నోబెల్!
కంగ్రాట్స్ మలాలా మలాలా డిగ్రీ కంప్లీట్ అయింది! చచ్చి బతికాక, ఆమె చదువు ఆపకుండా ధైర్యంగా డిగ్రీ పూర్తి చేసింది. అందుకే ఇది మలాలాకు మరో నోబెల్ లాంటిది. ఇవాళ మలాలా యుసాఫ్జాయ్ బర్త్ డే. 20 నిండి 21లోకి వచ్చేసింది. మలాలా జీవితంలో ఈ నెలకు ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితమే మలాల డిగ్రీ పూర్తయింది. అదే రోజు (జూలై 7) మాలాల ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం అయింది. ఆమె ‘హాయ్.. ట్విట్టర్’ అని ట్వీట్ చేయగానే మొదటి మూడు గంటల్లో లక్షా 34 వేల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్కు జత అయ్యారు. అది కాదు విశేషం. కొన్ని గంటల్లోనే కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మొదలుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వరకు ఎంతో మంది దేశాధినేతలు ట్విట్టర్లో ఈ అమ్మాయికి ‘హృదయపూర్వక స్వాగతం’ పలికారు. బాలికల విద్య కోసం, మహిళలకు సమానత్వం కోసం మలాలా పాటు పడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్లోని బర్మింగ్హామ్ కాలేజీ నుంచి చివరి పరీక్ష రాసి బయటికి వస్తూ.. తన డిగ్రీ ఒక ‘బిట్టర్ స్వీట్’ అని ఆమె అన్నారు. తాలిబన్ తీవ్రవాదులు మలాలా పై కాల్పులు జరిపిన అనంతరం బర్మింగ్హామ్ ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స జరిగింది. తలలో దిగబడిన బుల్లెట్ను బయటికి తీసి వైద్యులు అతి కష్టం మీద ఆమె ప్రాణాలను కాపాడారు. పాక్లోని స్వాత్ లోయ మలాలా స్వగ్రామం. 2012 అక్టోబరులో ఓ రోజు స్కూలు బస్సులో వెళుతున్న పదిహేనేళ్ల మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. బాలికలు చదువుకోడానికి వీల్లేదని తాలిబన్లు విధించిన నిషేధాజ్ఞల్ని ధిక్కరించి మరీ మాలాలా బయటికి వచ్చి చదువుకోవడం, మిగతా బాలికల్ని కూడా ధైర్యంగా బయటికి వచ్చి చదువుకొమ్మని పిలుపు ఇవ్వడం.. ఈ రెండు ‘తప్పులకు’ పడిన శిక్షే.. ఆమెపై కాల్పులు! తాలిబన్ల దాడి తర్వాత గాయాల నుంచి తేరుకుని మలాల మరింత కృత నిశ్చయంతో బాలిక చదువు కోసం కృషి చేశారు. ఓ పెద్ద ఉద్యమమే చేపట్టారు. అక్షరాలే ఆమె ఆయుధాలు. స్ఫూర్తి? ఇంకెవరు? మలాల జీవితమే. ఈ క్రమంలోనే 2014లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం మలాలా పూర్తి చేసిన డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చే నెల వెల్లడి అవుతాయి. ఆ లోపే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆమె ఆహ్వానం అందింది! ఆక్స్ఫర్డ్లో మలాలా పి.పి.ఇ. చదవాలనుకుంటున్నారు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్. బ్రిటన్లోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాల అధినేతలు, చివరికి మలాలా స్వదేశీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో కూడా ఈ కోర్సును చదివిన వారే. చేతికి రాబోతున్న డిగ్రీని మలాల ‘బిట్టర్ స్వీట్’ అని అనడానికి తగిన కారణమే ఉంది. తనకన్నా ఎంతో మంది తెలివైన అమ్మాయిలు, ఆశ ఉండీ, అవకాశం లేక చదువుకోలేకపోతున్నారు కనుకనే ఈ సంతోషాన్ని ఆమె సంపూర్ణంగా ఫీల్ అవలేకపోతోంది. కానీ ఆమె విజయాన్ని ప్రపంచం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ‘‘విద్య, సమానత్వాల కోసం జరిగే పోరాటంలో బాలికలకు వాళ్ల గళాలే అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. ప్రతి బాలికలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది’’ అని కూడా మలాలా ట్వీట్ చేశారు. ఈ ఒక్కమాట చాలు.. బాలికలకు విద్యను, సమానత్వాన్ని నిరాకరించే సమాజాలకు తూటాలా తగలడానికి. మలాలా–మరి కొన్ని విశేషాలు ► మలాలాపై దాడి అనంతరం పాకిస్తాన్లో తొలిసారిగా ‘రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు’ అమల్లోకి వచ్చింది. ► నోబెల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో శాంతి బహుమతి అందుకున్నారు మలాలా. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. ► ‘ఐ యామ్ మలాలా : ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ అనే పుస్తకాన్ని తన గురించి స్వయంగా రాసుకున్నారు మలాలా. ►యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజీ మలాలాకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందజేసింది. ►ఫుట్బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హామ్, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2, ఒబామా, జస్టిన్ బీబర్లతో ముఖాముఖి సంభాషించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement