-
అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?
తాడికొండ: అమరావతి ఆంధ్రుల సొత్తయితే, ఈ ప్రాంతంలో దళితులు, ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పించకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 49వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బినామీలతో భూములు స్వాహాచేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబు.. ఇళ్ల స్థలాల కోసం దీక్షలకు వస్తున్న దళిత మహిళలపై దాడులు చేసి బెదిరించి ట్రాక్టర్లతో తొక్కిస్తామనడంపై మండిపడ్డారు. అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున లేచి చంద్రబాబు అండ్ కోను ముంచెత్తుతామని హెచ్చరించారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు దళిత నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనరాజు మాట్లాడుతూ మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు తన కుల రాజధాని నిర్మాణానికి కృత్రిమ ఉద్యమంతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు చంద్రబాబు వత్తాసు పలుకుతూ..ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకెక్కి వ్యవస్థను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్కు ప్రజాబలం, దళిత, మైనారీ్ట, బీసీ వర్గాల అండ ఉందని స్పష్టం చేశారు. కాగా బుధవారంతో రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దళిత, బహుజన సంఘాలు భారీగా పాల్గొని మద్దతు తెలుపనున్నాయి. బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు. -
సుఖాంతమైన ప్రేమ కథ
చందర్లపాడు: ప్రేమ కథ సుఖాంతమైంది. వేర్వేరు సామాజికవర్గాలు కావడం, పెళ్ళికి పెద్దల అంగీకారం లేనప్పటికీ అనేక మలుపుల మధ్య ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెద్దలు ఒప్పుకోలేదన్న సాకుతో ముఖం చాటేసిన యువకుడు పోలీసుల కౌన్సెలింగ్తోపాటు ఎమ్మార్పీఎస్ నాయకుల రంగప్రవేశంతో పెళ్లికి ఒప్పుకోకతప్పలేదు. ఆరేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి గ్రామ దేవత సాక్షిగా ఒక్కటయ్యారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వేదాంతం పవన్కుమార్(24), తిరువూరు మండలం చౌటపల్లికి చెందిన దేవి(20)కి మధ్య ఆరేళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఫోన్లో మాట్లాడుకోవడమేగాక అప్పుడప్పుడూ కలిసి తిరిగేవారు. వీరి సామాజిక వర్గాలు వేరైనందున విషయం దేవి ఇంట్లో తెలిసి మందలించారు. అయినా ఆమె పవన్ ఒత్తిడి మేరకు స్నేహం కొనసాగించింది. పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం తిరువూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకునేందుకు రెండు నెలల గడువు కోరిన పవన్ అప్పటినుంచి ముఖం చాటేశాడు. ఫోన్లోకూడా స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీ ఉదయం పవన్ ఇంటికి వచ్చిన దేవి జరిగినదానిపై అతని తల్లిదండ్రులకు చెప్పింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవండతో అక్కడే దీక్ష చేపట్టింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెకు ఆసరాగా నిలిచారు. పవన్ను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా జరగబోయే పరిణామాలపై హెచ్చరించారు. విధి లేని పరిస్థితిలో పవన్ పెళ్ళికి అంగీకరించగా గురువారం రాత్రి చందర్లపాడు గ్రామ దేవత అలివేలమ్మ సాక్షిగా ఒక్కటయ్యారు. -
సెల్టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ నేత
మహబూబ్నగర్ క్రైం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలనే డిమాండ్తో ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. దీంతో అక్కడకు పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోగా ట్రాఫిక్ జాం కావడంతో దాదాపు అర గంట పాటు ఉట్కంఠ నెలకొంది. హన్వాడ మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కేశవులు మంద కృష్ణను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్తో సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో బాధం సరోజిని దేవి ఆడిటోరియం ఆవరణలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్టవర్ ఎక్కాడు. అక్కడకు చేరుకున్న టూటౌన్ సీఐ డీవీపీ.రాజు, ఎస్ఐ మురళి అతడికి నచ్చచెప్పినా కిందకు రాలేదు. ఆ తర్వాత మంద కృష్ణ జైలు నుంచి విడుదల అయ్యాడని ఫోన్లో సమాచారం ఇవ్వడంతో కేశవులు కిందకు దిగాడు. ఈ మేరకు కేశవులుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో 309 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి హల్చల్
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. రోషయ్య అనే ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా కిరోసిన్ డబ్బాతో ఆఫీసులోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. తన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. అయితే వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు రోశయ్యను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొలకలూరు రైల్వేస్టేషన్లో కలకలం
గుంటూరు : తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. స్టేషన్ మాస్టర్ గదికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ స్వల్పంగా దగ్దమయ్యాయి. ఘటనా స్థలంలో మందుబాటిళ్లు , ఎంఆర్పీఎస్ జెండాలు లభ్యమయ్యాయి. ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ అక్రమ అరెస్టుకు నిరసనగానే ఈ ఘటనకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- ‘జగన్ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్షోలో సీఎం జగన్
Advertisement